India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రానున్న ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామని పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్లోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అక్రమ డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేసే వారిని కట్టడి చేస్తామన్నారు.
అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. గచ్చిబౌలి PS పరిధిలో ఉండే బాలిక మీద కన్నేసిన శివకృష్ణ (22).. 2014, అక్టోబర్లో కిడ్నాప్ చేశాడు. ఓ గదిలో బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. బుధవారం విచారణకు రాగా 10 ఏళ్ల జైలు శిక్ష, బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.
అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. గచ్చిబౌలి PS పరిధిలో ఉండే బాలిక మీద కన్నేసిన శివకృష్ణ (22).. 2014, అక్టోబర్లో కిడ్నాప్ చేశాడు. ఓ గదిలో బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. బుధవారం విచారణకు రాగా 10 ఏళ్ల జైలు శిక్ష, బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.
రైల్వే లైన్ కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్న మార్కింగ్తో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో డోర్నకల్-మిర్యాలగూడెం వరకు రైల్వే లైన్ కోసం అధికారులు ఖమ్మం రూరల్ మండలంలో సర్వేని చేపట్టారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు వ్యక్తం కావడంతో నిలిపివేశారు. మూడు రోజులుగా ఎస్సీపీ నలుపు, తెలుపు రంగులతో మార్కింగ్ను ఎంవి పాలెం, కాచిరాజుగుడెం, ఆరేకొడు, చింతపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేశారు.
అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. బిక్కనూర్ మండలం అంతంపల్లి, జంగంపల్లి గ్రామాలలో ఆయన పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులు ఎలాంటి ఆందోళన పడవద్దని చెప్పారు. త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఉన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఎలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకి రూ.19,300 ధర పలకగా.. 341 రకం మిర్చి రూ.16,500, వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.15,500 వచ్చింది. అలాగే 5,531 మిర్చికి రూ.12,500 ధర, టమాటా రకం మిర్చికి రూ.34,000 ధర వచ్చింది. కాగా, టమాటా రకం మిర్చి మినహా అన్ని రకాల ధరలు తగ్గాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన అటవీ సంపద హరితహారం కార్యక్రమంతో పూర్వ వైభవం సంతరించుకుంటోంది. ఏటా ఉమ్మడి జిల్లాలో 2 కోట్లకు తగ్గకుండా మొక్కలు నాటుతున్నారు. ఈ కార్యక్రమంతో సుమారు 12 శాతానికి అటవీ విస్తీర్ణం పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జనగామ జిల్లాలో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండడంతో ఈసారి ఏడు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వరంగల్ పార్లమెంట్ సీటు పరిధిలో 18.16 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో 8,91,969 మంది పురుషులు, 9,24,250 మంది మహిళలు, థర్డ్ జెండర్లు 395 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.
రజాకార్ సినిమా యూనిట్ బుధవారం రాత్రి సిద్దిపేటలో సందడి చేసింది. జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజాకర్ సినిమాలో చాకలి ఐలమ్మగా కనిపించిన హీరోయిన్ ఇంద్రజ ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ వీరనారి అని కీర్తించారు. కార్యక్రమంలో నటీనటులు మకరంద దేశ్పాండే, రాజు, అర్జున్, తేజ్, వేదిక పాల్గొన్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.20,100 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,450 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర స్థిరంగా కొనసాగుతుండగా, పత్తి ధర మాత్రం రూ.100 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.