India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లాలో 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలో అత్యధికంగా CTL మండలంలో 18.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా అనుములలో 0.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. SLGలో 15.5, NKPలో 15.1, మర్రిగూడ 6.9, గట్టుప్పల్ 4.5, KTGR 4.3, చింతపల్లి 3.5, CDR 3.3, NLG 2.8, మునుగోడు 2.6, తిప్పర్తి 2.3, గుండ్లపల్లి 2.2, గుర్రంపోడు 1.8 మీ.మీ వర్షం పడింది.
జడ్చర్ల సమీపంలో NH-44పై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 15 మంది ప్రయాణికులు కోలుకుంటున్నారు. బస్సులో 36 మంది ఉండగా ఆరుగురు కర్నూలు, నంద్యాల, మరో 30 మంది అనంతపురం, గుత్తి, HYD తదితర ప్రాంతాల వాళ్లు ఉన్నారు. పలువురిని మెరుగైన చికిత్స కోసం HYDకి తరలించారు. ఎస్పీ జానకి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బస్సు అదనపు డ్రైవర్ కదిరప్ప ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐ ఆదిరెడ్డి తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బిక్కనూర్లోని సిద్ధిరామేశ్వర్ నగర్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలైనట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు, మిగతా నలుగురు నిర్మల్కి చెందిన వారిగా గుర్తించారు.
BRS అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్రంలో కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.జి.చిన్నారెడ్డి విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులు వారి సమస్యలు చెప్పుకోవాలంటే ప్రజావాణికి రావచ్చని దానికి అధికారులను కూడా రప్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ కూడా ఇచ్చామని, రెండు డీఎస్సీలను నిర్వహిస్తామన్నారు.
MSC విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన KNR జిల్లా గంగాధర మం.లో జరిగింది. రామడుగు SI సురేందర్ ప్రకారం.. గర్శకుర్తికి చెందిన మాధవి(23) తల్లి లక్ష్మి ఇటీవల పెద్ద కూతురు ఇంటికి వెళ్లడంతో మాధవి ఒంటరిగా ఉంటోంది. ఉదయం పాలు అమ్మే వ్యక్తి వచ్చి పిలిస్తే పలకకపోవడంతో స్థానికులను పిలిచాడు. ఇంట్లోకి వెళ్లిచూడగా ఉరేసుకొని కనిపించింది. దీంతో హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు కాంగ్రెస్ తీపికబురు చెప్పింది. ఆగస్టు 15 లోగా రూ. 2లక్షల రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం ఈమేరకు మార్గదర్శకాలు వెల్లడించింది. ఈ క్రమంలో మెదక్ జిల్లా నుంచి 2023-24లో 1,75,832 మంది రైతులకు రూ.1,299 కోట్ల మేరకు పంట రుణాలు పంపిణీ చేశారు. ఇందులో లక్ష మందికి పైగా రైతులు రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారు ఉంటారని సమాచారం.
తమ సమస్యల సాధనకై సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు MLA క్యాంపు ఆఫీస్ ముందు ధర్నా చేశారు. దీంతో ధర్నాలో పాల్గొన్న ఆయా జిల్లాల్లోని వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 748 మందికి సోమవారం సాయంత్రం జిల్లా సంక్షేమాధికారి జరినా బేగం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 24గంటల్లోగా సంజాయిషీ ఇచ్చుకోవాలని, లేనిపక్షంలో శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
కడుపునొప్పి తాళలేక విద్యార్థిని పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోనకల్ మండల పరిధిలోనే రావినూతలలో జరిగింది. ఎస్సై కడగండ్ల మధుబాబు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయినపల్లి అచ్యుతరావు, నాగేంద్ర దంపతుల పెద్ద కుమార్తె రిషిత (16) గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుందన్నారు. ఈ క్రమంలో కడుపు నొప్పి తాళలేక సోమవారం ఇంట్లో పురుగు మందు తాగి మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
<<13633463>>భార్యను చంపి <<>>భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బేలలో జరిగిన విషయం తెలిసిందే. సైద్పూర్కి చెందిన లక్ష్మణ్(32), బోరిగాంకు చెందిన సునీత(28)ను 9ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. సునీతకు అక్రమసంబంధం ఉందని గొడవపడటంతో ఆమె కొన్ని పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం పిల్లల టీసీ కోసం గ్రామానికి వచ్చిన ఆమెను లక్ష్మణ్ కత్తితో దారుణంగా గొంతు కోసి చంపినట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు.
2024-25 విద్యా సంవత్సరంలో ఏకరూప దుస్తులు సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2,998 పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఒక జత ఏకరూప దుస్తులు అందజేసేందుకు కుట్టు కూలీ కోసం రూ. 1 31 కోట్ల నిధులు విడుదల అయ్యాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఒక్కో జతకు రూ. 50 వంతున స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేయనున్నారు.
Sorry, no posts matched your criteria.