Telangana

News July 16, 2024

నెక్కొండ: బాలుడి మృతి ఘటన… సుమోటోగా స్వీకరణ

image

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండలో బాలుడి మృతి ఘటన కేసును తెలంగాణ వైద్య మండలి సుమోటోగా స్వీకరించారు. ఈమేరకు టీజీఎంసి రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల మనది పనే బాలునికి కుక్క కరవగా MGMలో 3 ARV ఇంజక్షన్లు వేయగా.. నాలుగోది RMP వద్ద వేయించారు. దీంతో ఐదు నిమిషాలలోపే మృతి చెందగా, విషాదం నెలకొంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మండిపడ్డారు.

News July 16, 2024

NZB: విషాదం.. యువజంట సూసైడ్

image

యువజంట సూసైడ్ చేసుకున్న ఘటన నవీపేటలో జరిగింది. పోలీసుల వివరాలు.. పోతంగల్ మం. హెగ్డోలికి చెందిన అనిల్(28), శైలజ(24)కు ఏడాది కిందట పెళ్లైంది. కాగా తాను ఓ తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువుల దుష్పప్రచారం తట్టుకోలేక బాసర గోదావరిలో దూకి సూసైడ్ చేసుకొంటున్నామని దంపతులు కోటగిరి SI సందీప్‌కి వీడియో పంపించారు. దీంతో పోలీసులు గాలించగా పకీరాబాద్-మిట్టాపూర్ రైలు పట్టాలపై వారి మృతదేహాలు గుర్తించారు.

News July 16, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైరల్ ఫీవర్లు

image

ఉమ్మడి WGL జిల్లాలో వైరల్ ఫీవర్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్నాయి. MHBD జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి జులై వరకు 72 డెంగ్యూ, 34 మలేరియా కేసులు నమోదయ్యాయి. వీరిలో పిల్లలు కూడా ఉన్నారు. ఈనెలలో డెంగ్యూ సోకినవారిలో నలుగురు పెద్దలు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే జ్వరాలు వచ్చిన గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి రక్తనమూనాలను సేకరిస్తున్నామని జిల్లా వైద్యాధికారిణి కళావతిబాయి తెలిపారు.

News July 16, 2024

WGL: భారీగా కురుస్తున్న వర్షాల సమస్యలకు టోల్ ఫ్రీ నెంబర్లు

image

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం వరంగల్ కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఏవైనా ఫిర్యాదులుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 3434, 91545 25936ను సంప్రదించాలని సూచించారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.

News July 16, 2024

HYD: పుట్టింటి నుంచి భార్య రావట్లేదని కూలీ ఆత్మహత్య

image

పుట్టింటికి వెళ్లిన భార్య రావడం లేదని మనస్తాపానికి గురైన కూలీ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప, హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం.. సికింద్రాబాద్ దూద్‌బావి‌కి చెందిన కూలీ గణేష్ (31) భార్య పుట్టింటి నుంచి రావడం లేదని ఆదివారం రాత్రి సీతాఫల్‌మండి స్టేషన్లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 16, 2024

రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటి..?: నిరంజన్ రెడ్డి

image

రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రమాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమని, మరీ రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. అందరి రుణాలను మాఫీచేస్తామని చెప్పి.. ఇప్పుడుమాత్రం కొందరికే రుణమాఫీ పరిమితం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు.

News July 16, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

✓వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
✓ ఖమ్మంకి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు రాక
✓ మధిరలో సిపిఎం రాజకీయ శిక్షణ కార్యక్రమం
✓ నేలకొండపల్లిలో రైతులతో శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్

News July 16, 2024

నంగునూరు: సూక్ష్మరాతి పనిముట్లు లభ్యం

image

నంగునూరు మండల కేంద్రానికి చెందిన ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ సూక్ష్మరాతి పనిముట్లను గుర్తించాడు.గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో పరిశోధనలు చేస్తున్న ఆయన కొత్తరాతి యుగం నాటి రాతి గొడ్డళ్ళు,శాతవాహనుల కాలం నాటి  టెర్రకోట బొమ్మలు,పూసలు,దేవత విగ్రహలు ఎన్నో గుర్తించాడు.ఇప్పుడు కొత్తగా గ్రామానికి దక్షిణం వైపున ఉన్న జోకిరమ్మ బండ మీద సూక్ష్మరాతి పరికరాలు (మైక్రోలిథిక్ టూల్స్) గుర్తించాడు.

News July 16, 2024

సిద్దిపేట: ‘జులై 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి’

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత సివిల్స్ శిక్షణకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి కవిత తెలిపారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్‌తో కూడిన ఉచిత శిక్షణను అందజేయనున్నట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జూలై 31వ తేదీ వరకు tsstudycircle. Co.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

News July 16, 2024

ఉపాధ్యాయురాలి సస్పెండ్‌..

image

కొత్తగూడెం బూడిదగడ్డ పాఠశాలలో పనిచేస్తున్న తుమ్మ పద్మావతిని కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌ సస్పెండ్‌ చేశారు. రామచంద్రఎయిడెడ్‌ పాఠశాల ప్రవేశాలు లేకపోవటంతో 2018లో మూతపడింది. ఆ పాఠశాలలో 2004-14మధ్యకాలంలో పద్మావతి HMగా పనిచేశారు. ఆ సమయంలో అవకతవకలు జరిగాయని అప్పటి కలెక్టర్‌ అనుదీప్‌కు ఫిర్యాదు రాగా.. ఆయన విచారణకు ఆదేశించారు. గత నెలలో నివేదిక సమర్పించారు. పరిశీలించిన కలెక్టర్, పద్మావతిని సస్పెండ్‌ చేశారు.