Telangana

News July 16, 2024

మెదక్: అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం

image

మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో ఆర్టీసీ, విద్య, డిఆర్డిఓ, ఆరోగ్య, పంచాయతీ, వ్యవసాయ, పౌరసరఫరా, అటవీశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖలపై సమీక్ష నిర్వహించారు. పలు విషయాలు అధికారులను నుండి అడిగి తెలుసుకున్నారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

News July 16, 2024

బాధితులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది: కలెక్టర్

image

ప్రజావాణి ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వెంటనే దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టొద్దని, ఏ వారం దరఖాస్తులను ఆవారమే పరిష్కరించాలని సూచించారు. బాధితులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

News July 16, 2024

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: కలెక్టర్

image

NLG: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను ఒకటికి రెండుసార్లు చదివి, ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు.

News July 16, 2024

ధర్మపురి: లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,05,452/- ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ 54,130/-, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.32,500/-, అన్నదానం రూ.18,822/-,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News July 16, 2024

నేడు కొమరవెల్లి మల్లన్న ఆలయం హుండీల లెక్కింపు

image

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవస్థాన హుండీలు, బియ్యం హండీలను మంగళవారం లెక్కించనున్నట్లు కొమురవెల్లి దేవస్థాన కార్యనిర్వాహక అధికారులు తెలిపారు. అధికారుల పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు మధ్య ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు హుండి లెక్కింపునకు హాజరుకావాలని కోరారు.

News July 15, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి> కన్నుల పండువగా జగన్నాథుడి రథయాత్ర> బోడుప్పల్ నూతన మేయర్‌గా తోటకూర అజయ్ యాదవ్> బాలాపూర్‌‌లో ప్రయాణిస్తున్న కారులో చెలరేగిన మంటలు> రాజేంద్రనగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత > ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడి> గచ్చిబౌలి DLF వద్ద అగ్ని ప్రమాదం > దుండిగల్‌లో 3.8 కిలోల గంజాయి సీజ్

News July 15, 2024

చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ఘటనపై హరీశ్ రావు ఫైర్

image

చిక్కడపల్లి <<13635887>>సెంట్రల్ లైబ్రరీ<<>> వద్ద నిరుద్యోగుల ఆందోళన, పోలీసుల చర్యలపై MLA హరీశ్ రావు స్పందించారు. ‘గ్రూప్స్, DSC అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గం. నాడు సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టారు. నేడు అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహించి సీఎం క్షమాపణ చెప్పాలి’ అని అన్నారు.

News July 15, 2024

NLG: “ఇంటింటా ఇన్నోవేషన్” గోడపత్రిక ఆవిష్కరణ

image

గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలకు సాధికారత కల్పించడంలో భాగంగా తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో రూపొందించిన “ఇంటింటా ఇన్నోవేషన్” గోడపత్రికను కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఆవిష్కర్తలు ఆగస్టు 3లోగా నూతన ఆవిష్కరణలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను సెల్ ఫోన్ నెంబర్ 9100678543 నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించాలని ఆయన అన్నారు.

News July 15, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్యాంశాలు

image

★ ఆదిలాబాద్: గంటల వ్యవధిలో దొంగ అరెస్ట్
★ బేలా : భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం
★ కన్నెపల్లి : ఒకరి మృతికి కారకుడైన వ్యక్తికి జైలుశిక్ష
★ భైంసా : అక్రమంగా తరలిస్తున్న గుట్కా స్వాధీనం
★ ఆదిలాబాద్ : 16 లక్షల గుట్కా పట్టివేత
★ ఖానాపూర్: మున్సిపల్ సిబ్బందిపై తేనెటీగల దాడి
★ కుంటాల : 84 వాహనాలు స్వాధీనం
★ ఆదిలాబాద్ : కష్టం చెప్పుకొని.. కాటికి వెళ్లిన వృద్ధురాలు
★ కుబీర్: తాళం వేసిన ఇంట్లో చోరీ

News July 15, 2024

జన్నారం: కవ్వాలో అడవి దున్నల సందడి

image

కవ్వాల్ పులుల అభయారణ్యంలో అడవి దున్నలు సందడి చేస్తున్నాయి. కొంతకాలంగా కంటికి కనిపించకుండా పోయిన అడవి దున్నలు ఇప్పుడు బైసన్ కుంట వద్ద గుంపుగా వచ్చి మేత మేస్తున్నాయి. నీలుగాయి కుంట సమీపంలో, మైసమ్మకుంట వద్ద సేద తీరుతూ మరో అడవి దున్న కెమెరాకు చిక్కింది. సోమవారం అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసిన ఆడవి దున్నలు అధికంగా సందడి. చేస్తూ ఆకట్టుకున్నాయి. నిజానికి అడవిలోకి వెళ్లేందుకు ఇప్పుడు పర్యాటకులకు అనుమతి లేదు.