Telangana

News March 21, 2024

NLG: అష్టకష్టాలు పడుతున్న పండ్లతోటల రైతులు

image

బోర్లలో నీరు అడుగంటడంతో ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పండ్ల తోటలను రక్షించుకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి జిల్లాలోనే బత్తాయి సుమారు 60 వేల ఎకరాల్లో, నిమ్మ 20 వేల ఎకరాల్లో ఉన్నాయి. రూ. లక్షలు ఖర్చు చేసి కొత్తగా బోర్లు వేసినా చుక్క నీరు పడటం లేదని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. చాలా ప్రాంతాల్లో తోటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.

News March 21, 2024

హైదరాబాద్‌లో పార్కింగ్‌పై స్పెషల్ ఫోకస్

image

నగరంలో ప్రజలకు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని పూర్తి ప్రణాళికను తయారు చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నగరంలో ఎదుర్కొంటున్న పార్కింగ్ సమస్యలపై చర్చించారు. కాంప్రహెన్సివ్ పార్కింగ్ పాలసీ తయారు చేసేందుకు అధికారులు విధివిధానాలను సిద్ధం చేయాలని సూచించారు.

News March 21, 2024

సూర్యాపేట: బాలికపై అత్యాచారం.. 10 ఏళ్ల జైలు శిక్ష

image

బాలికను బంధించి అత్యాచారం చేసిన వ్యక్తికి రాజేంద్రనగర్‌లోని ప్రత్యేక కోర్టు 10 ఏళ్ల జైలుశిక్ష వేసింది. జడ్జి ఆంజనేయులు తీర్పు వెలువరించారు. హుజూర్‌నగర్‌కు చెందిన బాలిక కుటుంబం గచ్చిబౌలి వినాయక‌నగర్‌లో ఉంటోంది. బాలికపై అక్కడే నివసించే శివకృష్ణ కన్ను పడింది. 2014 అక్టోబర్ 20న ఇంట్లో నిద్రిస్తున్న బాలికను శివకృష్ణ  కిడ్నాప్ చేసిన అత్యాచారం చేశారు. తాజాగా కోర్టు తీర్పునిచ్చింది. 

News March 21, 2024

కొత్తగూడెం: విద్యార్థినులను దత్తత తీసుకున్న ఎస్సై

image

తల్లిదండ్రులను కోల్పోయినా విద్యలో రాణిస్తున్న ఇద్దరు పేద విద్యార్థినులను దత్తత తీసుకుని, వారి చదువుల బాధ్యతను చర్ల ఎస్సై టీవీఆర్‌.సూరి స్వీకరించారు. చర్లలోని కస్తూర్భా పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన పదో తరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనిత, తల్లిని కోల్పోయిన శిరీష పరిస్థితి తెలుసుకుని చలించారు. వారు ఎంత వరకు చదివినా తనదే బాధ్యత అని తెలిపారు.

News March 21, 2024

హైదరాబాద్‌లో పార్కింగ్‌పై స్పెషల్ ఫోకస్

image

నగరంలో ప్రజలకు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని పూర్తి ప్రణాళికను తయారు చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నగరంలో ఎదుర్కొంటున్న పార్కింగ్ సమస్యలపై చర్చించారు. కాంప్రహెన్సివ్ పార్కింగ్ పాలసీ తయారు చేసేందుకు అధికారులు విధివిధానాలను సిద్ధం చేయాలని సూచించారు.

News March 21, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

✓వివిధ శాఖలపై భద్రాద్రి, ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ఖమ్మం జిల్లాలో ఓటు నమోదుపై ప్రత్యేక కార్యక్రమాలు
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి పర్యటన
✓భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పర్యటన

News March 21, 2024

ఖమ్మం జిల్లాలో తగ్గిన వరి సాగు విస్తీర్ణం

image

సాగర్ జలాలు రాకపోవటం వల్ల ఖమ్మం జిల్లాలో సాగు విస్తీర్ణం సగానికి పైగా తగ్గింది. గతేడాది 2.20లక్షల ఎకరాల్లో వరి పంట సాగవగా ఈసారి 1.02 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అందుకే ధాన్యం సేకరణ కేంద్రాల సంఖ్య కుదించాలని అధికారులు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభమవగా, భద్రాద్రి జిల్లాలో ఏప్రిల్ రెండో వారంలో డీసీ మొదలయ్యే అవకాశముందని చెబుతున్నారు.

News March 21, 2024

మహబూబ్‌నగర్‌లో ఉప ఎన్నిక.. క్యాంప్‌ రాజకీయాలు

image

పాలమూరులో స్థానిక సంస్థల MLC ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ BRS, కాంగ్రెస్ పార్టీల MLAలు, మాజీ MLAలు జాగ్రత్త పడుతున్నారు. ఎన్నికకు వారం రోజుల సమయం ఉండడంతో అంతవరకు ఓటర్లు పార్టీలు మారకుండా ఉండేందుకు వీలుగా క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు. ఇలా అయితే అభ్యర్థుల గెలుపు, ఓటములపై ప్రభావం చూపడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీ కామెంట్..?

News March 21, 2024

కరీంనగర్: చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా చర్యలు!

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే తనిఖీ చేసి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ కమిషనరేట్‌లో 63 కేసులు నమోదు చేసి రూ.4.25 కోట్లు పట్టుకున్నారు. ఈ నెల 16న ప్రతిమ హోటల్‌లో పట్టుబడిన రూ.6.67 కోట్లను ఎన్నికల కోడ్ కింద పోలీసులు, IT అధికారులు సీజ్ చేసిన విషయం విదితమే.

News March 21, 2024

DCCB ఛైర్మన్ పదవీకి పోచారం భాస్కర్ రెడ్డి రాజీనామా!

image

నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. లేఖను సహకారశాఖ కమిషనర్‌కు పంపుతున్నట్లు ప్రకటించారు. కాగా తనపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇవ్వలేదు. రాజీనామా లేఖ తమకు అందలేదని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌రావు వెల్లడించారు. కాగా రేపు అవిశ్వాసం పై ఓటింగ్ జరగనుంది.