Telangana

News March 21, 2024

రాజధానిలో లోక్‌సభ అభ్యర్థులు వీళ్లే..!

image

*సికింద్రాబాద్‌: కిషన్ రెడ్డి(BJP) ఖరారు. దానం(INC), పద్మారావు (BRS) అని సమాచారం. *మల్కాజిగిరి: ఈటల(BJP), రాగిడి(BRS) ఖరారు. సునీతా మహేందర్ రెడ్డి(INC) అని సమాచారం. *చేవెళ్ల: కొండా విశ్వేశ్వరరెడ్డి(BJP), కాసాని (BRS) ఖరారు. రంజిత్ రెడ్డి(INC) అని సమాచారం. * హైదరాబాద్: మాధవీలత(BJP), అసదుద్దీన్(MIM) పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్‌ నుంచి ఒక్క HYD MP అభ్యర్థిని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంది.

News March 21, 2024

రాజధానిలో లోక్‌సభ అభ్యర్థులు వీళ్లే..!

image

*సికింద్రాబాద్‌: కిషన్ రెడ్డి(BJP) ఖరారు. దానం(INC), పద్మారావు (BRS) అని సమాచారం. *మల్కాజిగిరి: ఈటల(BJP), రాగిడి(BRS) ఖరారు. సునీతా మహేందర్ రెడ్డి(INC) అని సమాచారం. *చేవెళ్ల: కొండా విశ్వేశ్వరరెడ్డి(BJP), కాసాని (BRS) ఖరారు. రంజిత్ రెడ్డి(INC) అని సమాచారం. * హైదరాబాద్: మాధవీలత(BJP), అసదుద్దీన్(MIM) పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్‌ నుంచి ఒక్క HYD MP అభ్యర్థిని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంది.

News March 21, 2024

ధాన్యం దారులన్నీ మిర్యాలగూడ వైపే..

image

ఉమ్మడి నల్గొండ ధాన్యం దారులన్నీమిర్యాలగూడ వైపే వెళ్తున్నాయి. సన్నరకాల కొనుగోలు ఎక్కువగా ఉండడంతో రైతులు అక్కడికి ధాన్యం తరలిస్తున్నారు. ఇక్కడ దాదాపు 115 మిల్లులు ఉండడం, ధర అనుకూలంగా ఉండడంతో రైతులు మిర్యాలగూడకే తీసుకొస్తున్నారు. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి వరకు, సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అటు సాగర్ నుంచి కోదాడ వరకు సాగైన సన్నాలు తరలివస్తున్నాయి.

News March 21, 2024

నిర్మల్: కారు దిగేందుకు సిద్ధం!

image

ఎన్నికలు సమీపిస్తున్న వేళ..BRS నాయకులు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతుండటంతో ఆ ప్రభావం నిర్మల్ జిల్లాలో కొనసాగేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఇంద్రకరణ్ రెడ్డితో పాటు విఠల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రచారం సాగుతోంది. జిల్లాలో కాంగ్రెస్, BJP బలంగా ఉండటంతో ఈ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ గణేశ్ చక్రవర్తి, BRS కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు BRSను వీడనున్నారు.

News March 21, 2024

వరంగల్: వైద్యులకు షోకాజు నోటీసులు

image

వరంగల్‌లోని పలువురు వైద్యులకు రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్‌ టి.కిరణ్‌కుమార్‌ షోకాజు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 17న నర్సంపేట రోడ్డులోని ఓ గార్డెన్‌లో జరిగిన RMP, PMPల మహాసభలో పలువురు వైద్యులు జాతీయ, రాష్ట్ర వైద్యమండలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు.నకిలీ వైద్యులను ప్రోత్సహించేలా వారి అసోసియేషన్‌కు డబ్బులు ఇవ్వడమే కాకుండా, ఆయా ఆసుపత్రుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

News March 21, 2024

ఖమ్మం: విదేశానికి వెళ్లిన ఉపాధ్యాయుడి సస్పెండ్

image

అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. వైరా ఎంఈఓ కే.వెంకటేశ్వర్లు తెలిపిన సమాచారం మేరకు.. అష్ణగుర్తి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఎస్‌జీటీ వై.మధుబాబు తన తండ్రి అనారోగ్యానికి గురయ్యారని ఫిబ్రవరి 13 నుంచి 19 వరకు సెలవు పెట్టారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లినట్లు అందిన సమాచారంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి అతణ్ని సస్పెండ్‌ చేశారు. 

News March 21, 2024

నాగర్ కర్నూల్: ‘సిఎంఆర్ బియ్యాన్ని తక్షణమే అప్పజెప్పాలి’

image

ప్రభుత్వానికి చెల్లించాల్సిన సిఎంఆర్ బియ్యాన్ని తక్షణమే అప్పజెప్పాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సీతారామారావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023-24 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని ఏప్రిల్ 30లోగా ప్రభుత్వానికి అప్పజెప్పాలని మిల్లర్లను ఆదేశించారు. లేనియెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 21, 2024

శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలి: సీపీ

image

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా స్ధానిక పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పోలీస్ కమిషనర్ మాట్లాడారు. ముందు జాగ్రత్తగా రౌడీ షీటర్లు కదలికలపై పోలీసు నిఘా పెట్టాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే అదుపులోకి తీసుకోవాలకున్నారు.

News March 21, 2024

MLG: మిల్లర్లపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్

image

రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించకుండా.. సకాలంలో కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేసే మిల్లులను సీజ్ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. MLG మహర్షి రైస్ మిల్ వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆగి వారి వద్దకు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధికారులను పంపి పరిస్థితిని సమీక్షించాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.

News March 21, 2024

సంగారెడ్డి: ‘ధరణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి’

image

ధరణి పెండింగ్ దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం ప్రకటనలో తెలిపారు. తహసిల్దార్ క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలించిన తర్వాత వెంటనే ఆర్డీవో, కలెక్టరేట్ పంపించాలని చెప్పారు. దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు.