Telangana

News March 20, 2024

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్ జితేష్ వి.పాటిల్

image

కామారెడ్డి, జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించడానికి నోడల్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఆర్.డి.ఓ.లు, డి.ఎస్పీలు, తహశీల్ధారు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన జూమ్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. డబ్బులు, మద్యం రవాణా కాకుండా తనిఖీలు చేపట్టాలని సూచించారు.

News March 20, 2024

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి : ఎస్పీ

image

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయం నిర్వహించిన జిల్లా సిబ్బందితో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాల నియంత్రణ గురించి ప్రజలకు అవగాహన విస్తృత స్థాయిలో కల్పించాలని సూచించారు.

News March 20, 2024

సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా చూడాలి- సీపీ

image

స్వేచ్ఛ, న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీపీ సునీల్ దత్ సూచించారు. జిల్లాలో 12 ఎఫ్ఎస్టి , 15 ఎస్ఎస్టి , 2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు, 24 గంటల నిఘా ఉంచినట్లు చెప్పారు. సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అటు ప్రజలతో మర్యాదగా మెలగాలని పేర్కొన్నారు.

News March 20, 2024

మల్కాజిగిరిలో పోటీపై క్లారిటీ ఇచ్చిన మైనంపల్లి

image

మాజీ MLA మైనంపల్లి హన్మంతరావు MP ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తన పోరాటం అంతా మల్లారెడ్డి అక్రమాలపైనే ఉంటుందని ఆయన అన్నారు. తనను మాట్లాడనివ్వకుండా మల్లారెడ్డి కొందరు మధ్యవర్తులతో మాట్లాడిస్తున్నారన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ.. తనను కట్టడి చేయాలని అనుకుంటున్నారని మైనంపల్లి ఆరోపించారు.

News March 20, 2024

మల్కాజిగిరిలో పోటీపై క్లారిటీ ఇచ్చిన మైనంపల్లి

image

మాజీ MLA మైనంపల్లి హన్మంతరావు MP ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తన పోరాటం అంతా మల్లారెడ్డి అక్రమాలపైనే ఉంటుందని ఆయన అన్నారు. తనను మాట్లాడనివ్వకుండా మల్లారెడ్డి కొందరు మధ్యవర్తులతో మాట్లాడిస్తున్నారన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ.. తనను కట్టడి చేయాలని అనుకుంటున్నారని మైనంపల్లి ఆరోపించారు. 

News March 20, 2024

ఆదిలాబాద్: సోషల్ మీడియా పోస్టులపై.. ALERT

image

సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్ ఓపెనింగ్ లో కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కోరారు. మీడియా సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల వివరాలను తెలియజేస్తామన్నారు.

News March 20, 2024

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు నేడు సెలవు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు (బుధవారం) బంద్ ఉండనుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్‌కి ప్రతీ బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు ఇటీవల అధికారులు పేర్కోన్నారు. ఈ క్రమంలోనే రేపు మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎల్లుండి గురువారం మార్కెట్ యథాతథంగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

News March 20, 2024

సిరిసిల్ల: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై అవగాహన ఉండాలి: కలెక్టర్

image

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారులు, పోలీస్ అధికారులతో అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతిఒక్కరూ తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల రోడ్లను తనిఖీ చేయాలని, మాక్‌పోల్, రిజర్వు ఈవీఎం నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.

News March 20, 2024

 ఆధారాలు చూపి నగదు తీసుకెళ్లొచ్చు: సంగారెడ్డి కలెక్టర్

image

లోక్ సభ ఎన్నికల సందర్భంగా చెక్ పోస్టుల వద్ద పట్టుబడిన నగదుకు సంబంధించిన ఆధారాలను గ్రీవెన్స్ కమిటీకి చూపి తీసుకువెళ్ళొచ్చని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. 50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత పత్రాలను వెంట పెట్టుకోవాలని చెప్పారు. 10 లక్షలకు పైగా నగదు పట్టుబడితే ఐటి శాఖకు సమాచారం అందిస్తామన్నారు.

News March 19, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు 

image

✓రాజేంద్రనగర్ యూనివర్సిటీలో ఫొటోగ్రఫీ పై నైపుణ్య శిక్షణ
✓ఉప్పల్:రియల్ ఎస్టేట్ పేరుతో మోసం.. బాధితుల ఆందోళన
✓మ్యాన్‌హోళ్లు, నాలాలపై GHMC స్పెషల్ ఫోకస్
✓ఓయూ పీఎస్ పరిధిలో పల్టీ కొట్టిన కారు.. ఒకరి మృతి
✓నకిలీ సాస్‌లు తయారు చేస్తున్న ముఠా ARREST ✓చందానగర్‌లో కారులో మంటలు
✓జీడిమెట్ల‌లో 9వ అంతస్తు నుంచి పడి ఒకరి మృతి
✓కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇస్తే గెలిచి, అభివృద్ధి చేస్తా: రంజిత్ రెడ్డి