Telangana

News March 19, 2024

కామారెడ్డి: ‘అనుమతి లేని ప్రకటనలను గుర్తించాలి’

image

MCMC టీమ్ ఎన్నికల ప్రచారం, చెల్లింపు వార్తలు గుర్తించడం, అనుమతి లేకుండా ప్రకటనలు వేయడం వంటివి గుర్తించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం మీడియా మానిటరింగ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన ప్రకటనలకు అనుమతి అదేరోజు అందించే విధంగా MCMC పనిచేయాలన్నారు.

News March 19, 2024

ర్యాలీలు, ధర్నాలకు అనుమతులు తప్పనిసరి: సిద్దిపేట సీపీ

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ సూచించారు. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 3 తేదీ వరకు కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధర్నాలు, ర్యాలీలు, బహిరంగసభలకు తప్పనిసరిగా ఆయా పోలీస్ స్టేషన్లలో అనుమతులు తీసుకోవాలని సూచించారు.

News March 19, 2024

MBNR: ఏప్రిల్ 25 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

మహబూబ్ నగర్: సార్వత్రిక విద్య (ఓపెన్ స్కూల్) వార్షిక పరీక్షలు వచ్చే నెల 25 నుంచి ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్ తెలిపారు. ప్రతి రోజు రెండు పూటలు పరీక్షలు ఉంటాయని ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ప్రయోగ పరీక్షలు మే 3 నుంచి 10 వరకు ఉంటాయని పేర్కొన్నారు.

News March 19, 2024

ములుగు: డీఎల్ఎస్ఏలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ములుగు జిల్లాలోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ( డిఎల్ఎస్ఎ)లో మూడు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆఫీస్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, ఆఫీస్ ప్యూన్ ఉద్యోగాలకు జిల్లాలోని నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని, ఏదేని డిగ్రీతో పాటు టైపింగ్‌లో అనుభవం ఉండాలన్నారు.

News March 19, 2024

బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలపై సమాచారం అందించాలి: కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలపై జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీకి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఎన్నికల వ్యయనిర్వహణలో భాగంగా ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ సమావేశంలో ఆమె బ్యాంకర్లతో మాట్లాడారు.

News March 19, 2024

ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలి:కలెక్టర్

image

ఖమ్మం : అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టర్, నూతన కలెక్టరేట్ లోని అన్ని శాఖల కార్యాలయాల సందర్శన చేసి, రాజకీయ నేతల, రాజకీయ పార్టీలకు సంబంధించి క్యాలెండర్లు, పోస్టర్లు ఫోటోలు తొలగించింది పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ యువరాజు పాల్గొన్నారు.

News March 19, 2024

వేములవాడ రాజన్న గుడి చెరువు పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి స్వామి గుడి చెరువు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గుడి చెరువు పనులను సోమవారం అయన క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి పరిశీలించారు. వచ్చే నెల ఆఖరిలోగా పనులను పూర్తిచేయాలని టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు. శివార్చన స్టేజ్ నిర్మాణ పనులను పరిశీలించి ఈఈకి పలు సూచనలు చేశారు.

News March 18, 2024

ముస్తాబాద్‌లో కరెంట్ స్తంభం పడి వ్యక్తి మృతి

image

కరెంట్ స్తంభం పడి వ్యక్తి మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో జరిగింది. సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో చెట్లు, పొల్స్ విరిగిపడ్డాయి. ఎలుసాని ఎల్లయ్య (50) అనే వ్యక్తి కరెంట్ పోల్ పక్కనే ఉన్నాడు. భారీ ఈదురుగాలికి పోల్ విరిగి మెడపై పడింది. దీంతో అతని మెడపై తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.

News March 18, 2024

HYD: తీసుకున్న డబ్బులు ఇవ్వనందుకు వ్యక్తి హత్య 

image

తీసుకున్న డబ్బులు ఇవ్వనందుకు ఇద్దరి మధ్య జరిగిన గొడవలో వ్యక్తిని కొడవలితో హత్య చేసిన ఘటన మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగా కాలనీకి చెందిన షేక్ నిసార్ అహ్మద్, ఉప్పల్ పీర్జాదిగూడకు చెందిన షేక్ వాజిద్ స్నేహితులు. వాజిద్ తన అవసరం నిమిత్తం నిస్సార్ వద్ద రూ.3లక్షలు తీసుకొని ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో హత్య జరిగింది.

News March 18, 2024

సికింద్రాబాద్: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

రైలు పట్టాలు దాటుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలోని అల్వాల్, బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. కాగా, పోలీసులు మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయసు 35ఏళ్ల లోపు ఉంటుందన్నారు. 5.5 అడుగుల ఎత్తు, కోల ముఖం, లైట్ క్రీమ్ కలర్ షర్ట్, బూడిద రంగు జీన్స్ ప్యాంట్ ధరించాడు.