Telangana

News March 18, 2024

ఎన్నికల నిర్వహణలో నిఘా బృందాల పాత్ర కీలకం

image

ఖమ్మం: స్వేచ్ఛ, న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణలో నిఘా బృందాల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. సోమవారం సమావేశ మందిరంలో ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి, ఎంసిసి బృందాలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల్లో నిఘా బృందాలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. జిల్లాలో 15 ఎస్ఎస్టీ, 12 ఎఫ్ఎస్టీ, 27 ఎంసిసి బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

News March 18, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాలలో బిజెపి విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ. @ ఓదెల మండలంలో డాన్స్ చేస్తుండగా గుండెపోటుతో యువకుడు మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో విద్యుత్ షాక్ తో చేపలు పట్టిన వ్యక్తులపై కేసు. @ వేములవాడ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి. @ పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జగిత్యాల, కరీంనగర్ కలెక్టర్లు. @ మల్యాల మండలంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.

News March 18, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!

image

*ఉమ్మడి జిల్లాలో ఎన్నికల వేళ.. పటిష్ట పోలీస్ బందోబస్తు
*DSCకి ఉచిత శిక్షణ.. దరఖాస్తు చేసుకోండి:BC స్టడీ సర్కిల్
*మాజీమంత్రి శ్రీనివాస్ బీజేపీలో చేరుతున్నారనేది అసత్యం:DK అరుణ
*ఉమ్మడి జిల్లాలో తొలిరోజు ప్రశాంతంగా పది పరీక్ష
*కొనసాగుతున్న కుష్టువ్యాధి సర్వే
*NGKL:CM,MLA,MLC చిత్రపటానికి పాలాభిషేకం
*GDWL:పరీక్షకు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
*WNPT:రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

News March 18, 2024

DSCకి ఉచిత శిక్షణ.. దరఖాస్తు చేసుకోండి!

image

MBNR:BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డిఎస్సీ పరీక్షలకు 75 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.స్వప్న సోమవారం అన్నారు. MBNR, NGKL,NRPT జిల్లాలకు చెందిన అర్హత గల బిసి అభ్యర్థులు www.tsbcstudycircle.cgg.gov.in వెబ్ సైడ్ లో(SGTకి ఈనెల 22న, SAకి ఏప్రిల్ 5వరకు) దరఖాస్తులు చేసుకోవాలని, ఎంపిక అయిన అభ్యర్థులకు రూ.1500 చొప్పున బుక్ ఫండ్ లేదా స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు.

News March 18, 2024

వేములవాడ రాజన్న గుడి చెరువు పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి స్వామి గుడి చెరువు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గుడి చెరువు పనులను సోమవారం అయన క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి పరిశీలించారు. వచ్చే నెల ఆఖరిలోగా పనులను పూర్తిచేయాలని టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు. శివార్చన స్టేజ్ నిర్మాణ పనులను పరిశీలించి ఈఈకి పలు సూచనలు చేశారు.

News March 18, 2024

HYD: ట్రైన్ నుంచి జారిపడి బీటెక్ విద్యార్థి మృతి

image

ట్రైన్ నుంచి జారిపడి బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ GRP పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. ఆదివారం నీలం సుమంత్ తన తమ్ముడితో కలిసి సొంతూరు ఖమ్మం జిల్లా కల్లూరు వెళ్లడానికి SCBD రైల్వే స్టేషన్‌కు వచ్చి ట్రైన్ ఎక్కాడు. అయితే ట్రైన్ ఎక్కే సమయంలో జారీ కింద పడ్డాడు. సుమంత్‌ను తమ్ముడు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికత్స పొందుతూ.. మృతి చెందినట్లు తెలిపారు.

News March 18, 2024

HYD: ట్రైన్ నుంచి జారిపడి బీటెక్ విద్యార్థి మృతి

image

ట్రైన్ నుంచి జారిపడి బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ GRP పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. ఆదివారం నీలం సుమంత్ తన తమ్ముడితో కలిసి సొంతూరు ఖమ్మం జిల్లా కల్లూరు వెళ్లడానికి SCBD రైల్వే స్టేషన్‌కు వచ్చి ట్రైన్ ఎక్కాడు. అయితే ట్రైన్ ఎక్కే సమయంలో జారీ కింద పడ్డాడు. సుమంత్‌ను తమ్ముడు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికత్స పొందుతూ.. మృతి చెందినట్లు తెలిపారు.

News March 18, 2024

తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకుంటూ పరీక్ష రాసిన విద్యార్థి

image

తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకుంటూ ఓ కుమారుడు పదవ తరగతి పరీక్ష రాసిన ఘటన కల్లూరులో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరాంపురం గ్రామానికి చెందిన  మారబోయిన అఖిల్ పదో తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. సోమవారం పదవ తరగతి పరీక్ష ఉండడంతో కుటుంబ సభ్యులు మనోధైర్యం నింపి పరీక్షకు పంపించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.

News March 18, 2024

శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరుతున్నారనేది అసత్యం: డీకే అరుణ

image

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ BJPలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని బీజేపీ నాయకురాలు DK అరుణ స్పష్టం చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. BJPకి ప్రజలలో ఉన్న ఆదరణను ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు కావాలని, ప్రజలను తప్పుదోవ పట్టించాలని అసత్యం ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ మమ్మల్ని సంప్రదించలేదని పేర్కొన్నారు.

News March 18, 2024

విద్యుత్ షాక్ కు గురై రైతు మృతి

image

విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన బీబీనగర్ మండల పరిధిలోని పెద్దపలువు తండాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బిచ్యా అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన పొలంవద్ద బోర్ మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ గురైయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.