India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంజారాహిల్స్లో తాగునీటిని అప్రయోజనాలకు వాడిన ఇద్దరిపై HMWSSB చర్యలు తీసుకుంది. బైక్, కారు కడిగిన వ్యక్తికి రూ.10,000, నీరు ఓవర్ఫ్లో అయ్యేలా వదిలిన మరొకరికి రూ.5,000 జరిమానా విధించింది. తాగునీరు వినియోగం కోసం మాత్రమేనని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. ఇక ఉదయాన్నే ఈ నీటితో రోడ్లు, ఇంటిపరిసరాలు కడిగేవారూ.. జాగ్రత్త నెక్ట్స్ మీ వంతే.
KNR నగరంలోని భగత్ నగర్ లో విశ్వనాథ్ చెస్ అకాడమీలో ఈ నెల 6న గ్రాండ్ మాస్టర్ చెస్ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు, అకాడమీ డైరెక్టర్ విశ్వనాథ్ ప్రసాద్, జిల్లా చెస్ అసోసియేషన్ కో-ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, అకాడమీ సీనియర్ కోచ్ శివయ్య తెలిపారు. ఈ క్యాంపునకు ప్రముఖ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు హాజరవుతున్నారని పేర్కొన్నారు. వివరాలకు 7569229294, 9030177607 సంప్రదించాలన్నారు.
అంబేడ్కర్ స్టేడియంలో ఈ నెల 6న జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ యోగాసన ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సర్దార్ రవీందర్ సింగ్, నాగిరెడ్డి సిద్ధారెడ్డిలు తెలిపారు. 8-18 సం.ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు బెర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో ఈ నెల 6న ఉ.9 గం.కు కోచ్లు వద్ద నమోదు చేసుకోవాలన్నారు. 8985275068 సంప్రదించాలన్నారు
విద్యుత్తు వినియోగదారుల కోసం TGNPDCL వాట్సప్ చాట్ బాట్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని KNR ఎస్ఈ రమేష్ బాబు తెలిపారు. వినియోగదారులు తమ మొబైల్ వాట్సాప్లో 7901628348 నంబరుకు ‘హాయ్’ అని మెస్సేజ్ పంపగానే వెల్కమ్ టూ TGNPDCL కాల్ సెంటర్ అని సందేశం అందుతుంది. వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యను ఎంచుకొని ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు అని తెలిపారు. పరిష్కారమైన తర్వాత వినియోగదారుడికి IVRL కాల్ వస్తుందన్నారు.
నగరంలో ఈ నెల 6న జరిగే ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పోలీసులకు బిగ్గెస్ట్ టాస్క్. భక్తులకు ఇది అతిపెద్ద శోభాయాత్ర. ఈ నేపథ్యంలో పోలీసులతో పాటు అధికారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిమజ్జన ఏర్పాట్లపై కసరత్తులు చేసి పక్కా రూట్ మ్యాప్ను రిలీజ్ చేశారు. ఖైరతాబాద్- పాత సైఫాబాద్ PS- ఇక్బాల్ మినార్- తెలుగు తల్లివిగ్రహం- అంబేడ్కర్ విగ్రహం- ట్యాంక్ బండ్ మీదుగా నిమజ్జనానికి తరలించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అధిక సి-సెక్షన్లు చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హెచ్చరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు పాటించిన ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రమే అనుమతులు మంజూరు చేస్తామని, రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రులు, క్లినిక్లు, ల్యాబ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్స్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, క్లబ్బులు బంద్ చేయాలని సీపీ సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా CP నిర్ణయం తీసుకున్నారు. గణపతి నిమజ్జనం సందర్భంగా జిల్లాలో గురువారం ఉదయం
6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ పాటించాలన్నారు.
HYD బంజారాహిల్స్లో తాగునీటిని అప్రయోజనాలకు వాడిన ఇద్దరిపై హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) చర్యలు తీసుకుంది. బైక్, కారు కడిగిన వ్యక్తికి రూ.10,000, నీరు ఓవర్ఫ్లో అయ్యేలా వదిలిన మరొకరికి రూ.5,000 జరిమానా విధించింది. తాగునీరు వినియోగం కోసం మాత్రమేనని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు.
జిల్లా నుంచి ఎంపికైన 301 మంది గ్రామ పంచాయతీ అధికారులకు (జీపీవో) ఈ నెల 5న ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేయనున్నారు. వారిని ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నిజామాబాద్ డివిజన్ వారు పాత కలెక్టరేట్ మైదానం నుంచి, ఆర్మూర్ డివిజన్ వారు ఆర్మూర్ తహశీల్దార్ కార్యాలయం, బోధన్ డివిజన్ వారు బోధన్ తహశీల్దార్ కార్యాలయం నుంచి బయలుదేరుతారన్నారు.
గీసుగొండ మండలం తిమ్మాపురంలో రైతులకు అవగాహన కల్పించేందుకు డ్రోన్ సాయంతో నానో యూరియా పిచికారీ ప్రదర్శనను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై పరిశీలించారు. నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ రైతులకు వివరించారు. ఉత్పాదకత పెంపుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, రైతులు దీనిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
Sorry, no posts matched your criteria.