India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం ఎస్టీ-1 కాగా.. మూడు జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, మథోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్ ఉండగా.. ఇందులో 16,44,715 మంది ఓటర్లు ఉన్న ట్లు ఎన్నికల అధికారి రాజర్షి షా వివరించారు. పురుషులు 8,02,575.. మహిళలు, 8,42,054, ఇతరులు 86, 2,085 మంది సర్వీస్ ఓటర్లు ఉండగా 2,111 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన మర్రి స్వామి(45) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో అతడు అప్పుడప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోతుండే వాడని, అలాగే ఈనెల 11న భార్య జ్యోతితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడన్నారు. ఈ క్రమంలో ఘనపూర్ గ్రామ శివారులో ఉరేసుకుని అతడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆదివారం రాత్రి స్థానికులు గుర్తించారన్నారు. మృతదేహం కుళ్లిపోయిందన్నారు.
ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ DCM ఢీకొన్న ఘటన HYD శంషాబాద్ పరిధి తొండుపల్లి సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. RR జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరై అర్ధరాత్రి మేఘ్ రాజ్, మనోహర్తో కలిసి ఆమె కారులో HYD- బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. తొండుపల్లి వంతెన వద్దకు రాగానే DCM ఢీకొట్టింది. త్రుటిలో ప్రమాదం తప్పింది.
ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ DCM ఢీకొన్న ఘటన HYD శంషాబాద్ పరిధి తొండుపల్లి సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. RR జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరై అర్ధరాత్రి మేఘ్ రాజ్, మనోహర్తో కలిసి ఆమె కారులో HYD- బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. తొండుపల్లి వంతెన వద్దకు రాగానే DCM ఢీకొట్టింది. త్రుటిలో ప్రమాదం తప్పింది.
గ్రేటర్ హైదరాబాద్లో ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. కాప్రా 34.09 డిగ్రీలు, ఉప్పల్ 34.6, ఫలక్నుమా 34.8, ముషీరాబాద్ 34.7, అంబర్పేట్ 34.1, ఖైరతాబాద్ 34.3, అల్వాల్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే నేటి నుంచి 4 రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్లో ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. కాప్రా 34.09 డిగ్రీలు, ఉప్పల్ 34.6, ఫలక్నుమా 34.8, ముషీరాబాద్ 34.7, అంబర్పేట్ 34.1, ఖైరతాబాద్ 34.3, అల్వాల్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే నేటి నుంచి 4 రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.
కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన చిన్నరాయుడు(30) ఆదివారం గ్రామ శివారులోని వాగు పరివాహక ప్రాంతంలో చేపలు పెట్టేందుకు వెళ్ళాడు. ఈక్రమంలో వ్యవసాయ మోటార్కు ఉన్న విద్యుత్ తీగను నీటి గుంతలో వేసి బండరాయిపై కూర్చుని చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు జారీ నీటిలో పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.
మద్యం మత్తులో జరిగిన చిన్నపాటి గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆదిలాబాద్కు చెందిన రాజు (30), సాగర్ ఓ వైన్స్ వద్ద మద్యం సేవించారు. అనంతరం అక్కడే ఉన్న వినోద్, ప్రవీణ్లతో వారు గొడవపడ్డారు. దీంతో వినోద్, ప్రవీణ్ లు వారిని వెంబడించి టీటీడీ సమీపంలో దాడి చేశారు. ఈ దాడిలో రాజు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, సాగర్కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట ఖానాపురం హవేలి పోలీసులను ఆదివారం ఆశ్రయించింది. నగరంలోని మామిళ్లగూడెం, శ్రీనగరాకాలనీ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారు. దీనికి యువతి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో వారు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మేజర్లైన తాము ఇరువురం ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని వారు పోలీసులను కోరారు.
నిజామాబాద్లోని గౌతమ్ నగర్లో గొల్ల గంగామణి నివాసం ఉంటుంది. గంగామణి కి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని నెలల క్రితం పెద్ద కుమారుడు మరణించాడు. చిన్న కుమారుడు గొల్ల పవన్ కుమార్ మేస్త్రీ పని చేస్తూ దుబ్బ ప్రాంతంలో నివాసం ఉంటాడు. గంగామణి వద్దకు పవన్ కుమార్ వచ్చి కన్నతల్లి పై దుర్భాషలాడుతూ కాలితో తన్నుతూ విచక్షణ రహితంగా ముఖంపై పిడి గుద్దులు కురిపిస్తూ దాడి చేశాడు.
Sorry, no posts matched your criteria.