Telangana

News July 20, 2024

అటవీ గ్రామాలను చుట్టుముడుతున్న వాగులు

image

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చర్ల మండలంలోని గ్రామాలను వాగులు చుట్టు ముడుతున్నాయి. కుర్నపల్లి పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామం చుట్టూ వాగులు కమ్మేయడంతో బాహ్య ప్రపంచంతో ఆ గ్రామానికి సంబంధాలు తెగిపోయాయి. కుర్నపల్లి-రామ చంద్రాపురం మధ్యలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు ప్రభుత్వంగా ఉండాలని అధికారులు సూచించారు

News July 20, 2024

NGKL: మద్యం తాగించి మహిళ కూలీలపై అత్యాచారం

image

ఇద్దరు మహిళా కూలీలకు మద్యం తాగించి అత్యాచారం చేసిన ఘటన NGKL జిల్లా అచ్చంపేట సమీపంలోని హాజీపూర్ హైదరాబాద్- శ్రీశైలం ప్రధాన రహదారిపై జరిగింది. బల్మూర్ మండలంలోని వేరువేరు గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు రోజువారీ పనికి వచ్చారు. బండల వ్యాపారం నిర్వహించే వినోద్ సింగ్, గజానంద్ అనే వ్యక్తులు ఇద్దరు మహిళలను కూలీ పనికి తీసుకెళ్లారు. వారిని కారులో ఎక్కించుకొని మద్యం తాగించి అత్యాచారం చేశారు. కేసు నమోదైంది.

News July 20, 2024

జిల్లా కలెక్టర్‌ను అభినందించిన సీఎస్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల వల్ల అశ్వరావుపేటలోని పెద్దవాగుకు గండిపడి భారీగా వరద సంభవించింది. ఈ ఆకస్మిక వరదల వల్ల చిక్కుకుపోయిన దాదాపు 40 మందిని ఏవిధమైన అపాయం జరుగకుండా వివిధ శాఖల సమన్వయంతో కాపాడినందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షలో అభినందించారు.

News July 20, 2024

వర్షానికి పొలాల్లో నిలిచిన నీరు.. జాగ్రత్తలు పాటించండి!

image

ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలుస్తోంది. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వర్షాధార పంటలైన మొక్కజొన్న, కంది, పత్తి, జొన్న, పెసర, మినుముతో పాటు వరి, మిరప, ఉద్యాన పంటలు పండిస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వర్షం నీరు నిలవకుండా మురుగుకాల్వలు ఏర్పాటుచేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

News July 20, 2024

మెదక్: జాతీయ రహదారిపై కారు బోల్తా.. మహిళ మృతి

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కళ్లకల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బాసర వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా నలుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులు హైదరాబాద్ మూసాపేట్ చెందిన వారిగా సమాచారం.

News July 20, 2024

HYD: టీ కోసం వెళ్లి ఇంజినీరింగ్ స్టూడెంట్స్ దుర్మరణం (UPDATE)

image

దుండిగల్‌ రోడ్డు ప్రమాదంలో శుక్రవారం ముగ్గురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. VNR విజ్ఞాన్‌ జ్యోతి‌ కాలేజీలో అక్షయ్, అశ్విత్, నవనీత్, జస్వంత్‌ బీటెక్‌ ఫస్టీయర్ చదువుతున్నారు. మరో ఫ్రెండ్‌ హరితో కలిసి ORRవైపు టీ తాగేందుకు వెళ్లారు. ORR సర్వీస్ రోడ్డులో అతివేగంగా వెళ్తున్న వీరి కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో‌ అక్షయ్, అశ్మిత్, హరి దుర్మరణం చెందారు.

News July 20, 2024

HYD: టీ కోసం వెళ్లి ఇంజినీరింగ్ స్టూడెంట్స్ దుర్మరణం (UPDATE)

image

దుండిగల్‌ రోడ్డు ప్రమాదంలో శుక్రవారం ముగ్గురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. VNR విజ్ఞాన్‌ జ్యోతి‌ కాలేజీలో అక్షయ్, అశ్విత్, నవనీత్, జస్వంత్‌ బీటెక్‌ ఫస్టీయర్ చదువుతున్నారు. మరో ఫ్రెండ్‌ హరితో కలిసి ORRవైపు టీ తాగేందుకు వెళ్లారు. ORR సర్వీస్ రోడ్డులో అతివేగంగా వెళ్తున్న వీరి కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో‌ అక్షయ్, అశ్మిత్, హరి దుర్మరణం చెందారు.

News July 20, 2024

HYDలో ఘోర రోడ్డు ప్రమాదం.. నిజామాబాద్ వాసి మృతి

image

HYDలోని దుండిగల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంజినీరింగ్ చదువుతున్న NZB జిల్లాకు చెందిన ఆశ్మిత్, జస్వంత్, నవనీత్ మరో స్నేహితుడు హరితో కలిసి శుక్రవారం సాయంత్రం టీ తాగేందుకు కారులో వెళ్లారు. దుండిగల్ ఎగ్జిట్ నం.5 వద్ద బౌరంపేట-గండిమైసమ్మ వైపు వెళ్తున్న ట్యాంకర్‌ను కారు ఢీకొంది. దీంతో అక్షయ్, అశ్మిత్, హరి అక్కడికక్కడే మృతి చెందినట్లు CI శంకరయ్య తెలిపారు. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.

News July 20, 2024

ఊట్కూరు: బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

image

నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో ఈ నెల 17న మొహరం పండుగకు వచ్చిన బాలిక భాను(8)తప్పిపోయింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బాలికకు దూరంగా ఉన్న తల్లి అంజమ్మ కిడ్నాప్ చేసి హైదరాబాద్‌లోని అత్తాపూర్‌కు తీసుకువెళ్లింది. తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించి బాలికను తండ్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News July 20, 2024

Way2Newsలో ‘తల్లి ఆవేదన’ కథనం.. స్పందించిన MRO

image

Way2Newsలో ప్రచురితమైన <<13641008>>కథనానికి <<>>స్పందన లభించింది. గార్ల మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు గాడిపెల్లి నర్సమ్మను తన కొడుకులు ఆలనా పాలనా చూసుకోకపోవడంతో రోడ్ల పైనే తిరుగుతూ, భిక్షమెత్తుకుంటూ జీవిస్తోంది. ఈ విషయపై ఈ నెల 16న Way2Newsలో ‘బుక్కెడు బువ్వ పెట్టడం లేదని తల్లి కన్నీటి ఆవేదన’ కథనం ప్రచురితమైంది. దీనిపై గార్ల MRO రవీందర్ స్పందించి నర్సమ్మ కొడుకులకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు.