India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గోషామహల్లో BRS అభ్యర్థిగా పోటీ చేసిన నందకిశోర్ కాంగ్రెస్లోకి వెళ్లడం సరికాదని ఆ పార్టీ నేత ఆనంద్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన నియోజకవర్గ శ్రేణులతో సమావేశమయ్యారు. స్వలాభం కోసం పార్టీ మారుతున్న వ్యక్తిని ఎంత నీచంగా అభివర్ణించినా తక్కువేనని అన్నారు. లోకల్ లీడర్ కాకపోయినా MLA టికెట్, ఆయన కూతురికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చిన KCRను మోసం చేయడం సిగ్గుచేటు అంటూ ఆనంద్ మండిపడ్డారు.
గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కడేలా దేవయ్య (46) అనే వ్యక్తి తీవ్ర అప్పులతో బాధపడుతున్నారు. ఇదే క్రమంలో శనివారం బిల్డింగ్ పైన గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న దేవయ్య ఆదివారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు పోలీసులు మేరకు కేసు నమోదు చేశారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్ డిగ్రీకి సంబంధించిన 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీ విడుదల చేసినట్లు KU అధికారులు తెలిపారు. మార్చి 30 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే ఏప్రిల్ 10 వరకు ఫైన్తో ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు మేలో ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు గమనించాలని కోరారు.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ పకడ్బందీగా అమలు చేస్తామని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యం అన్నారు. జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక ప్రాంతాలు, 439 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని తెలిపారు.
అక్కడ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. అవసరమైన ప్రతీ చోటా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. పోలింగ్ కు సుమారు రెండు నెలల సమయం ఉండటంతో ప్రధాన పార్టీల్లో ప్రచారం, అభ్యర్థి చేసే ఖర్చుపై కొంత చర్చ సాగుతోంది. రెండు సెట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేలా అధికార పార్టీ ఓవైపు పావులు కదుపుతుండగా.. మరో వైపు బిఆర్ఎస్, బిజెపిలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల ముగిసే వరకు జనగామ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమ తేదీల వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తెలియజేస్తామని తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలతో కలెక్టరేట్ కు రావద్దని సూచించారు.
వనపర్తి మండలంలోని పెద్దగూడెం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన ఖలీల్ ట్రాన్స్ఫార్మర్ వద్ద వ్యవసాయ బోరుకు సంబంధించిన విద్యుత్తు కనెక్షన్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో అతను అక్కడికక్కడ మృతి చెందాడు. ఈఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గ్రూప్-1, DSC నోటిఫికేషన్లతో HYDలోని లైబ్రరీలకు తాకిడి పెరిగింది. అమీర్పేట, అశోక్నగర్, దిల్సుఖ్నగర్లోని కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. TGలో అతిపెద్దదైన అఫ్జల్గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. రూ. 5 భోజనం తింటూ 8 నుంచి 10 గంటల సేపు చదువుతున్నారు. వీరి కోసం మౌలిక వసతులతో పాటు అదనపు పుస్తకాలు అందుబాటులోకి తెస్తున్నట్లు లైబ్రేరియన్ తెలిపారు.
గ్రూప్-1, DSC నోటిఫికేషన్లతో HYDలోని లైబ్రరీలకు తాకిడి పెరిగింది. అమీర్పేట, అశోక్నగర్, దిల్సుఖ్నగర్లోని కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. TGలో అతిపెద్దదైన అఫ్జల్గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. రూ. 5 భోజనం తింటూ 8 నుంచి 10 గంటల సేపు చదువుతున్నారు. వీరి కోసం మౌలిక వసతులతో పాటు అదనపు పుస్తకాలు అందుబాటులోకి తెస్తున్నట్లు లైబ్రేరియన్ తెలిపారు.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదు కార్యక్రమం ఈనెల 14వ తేదీతో ముగిసింది. నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో 5,06,527 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నల్గొండ – 87,596, సూర్యాపేట – 55,837, యాదాద్రి భువనగిరి – 39,066 మంది ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వచ్చేనెల 4న ఓటరు తుది జాబితా విడుదల చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.