Telangana

News March 17, 2024

SRD: సిలిండర్‌ పేలి తాత, మనవరాలి మృతి

image

గ్యాస్‌ సిలిండర్‌ పేలి తీవ్రంగా గాయపడిన ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 10న రాత్రి స్థానిక మాణిక్‌ ప్రభు వీధిలో ఎరుకల లక్ష్మన్న ఇంట్లో గ్యాస్‌ లీకై మంటలు అలుముకున్నాయి. ఆయన్ను కాపాడే క్రమంలో కోడలు సుగుణ, మనవరాలు కీర్తి(4) గాయపడ్డారు. వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిచంగా చికిత్స పొందుతూ కీర్తి శుక్రవారం, నిన్న లక్ష్మన్న చనిపోయారు. తాత, మనుమరాలు మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.

News March 17, 2024

వరంగల్: మహిళా ఓటర్లే కీలకం 

image

ఉమ్మడి వరంగల్ పరిధిలోని వరంగల్, మానుకోట లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో మహిళలే కీలకం కానున్నారు. వరంగల్ పరిధిలోని 7అసెంబ్లీ స్థానాల్లో 18,16,609 ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 8,92,676, మహిళలు 9,23,541, ఇతరులు 392 మంది ఉన్నారు. మహబూబాబాద్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 15,26,137 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 7,45,716 మంది పురుషులు, 7,80,316 మంది మహిళలు, 105 మంది ఇతరులున్నారు

News March 17, 2024

MBNR: 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి..

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపటి నుండి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష ఉంటుంది. గతంలో నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండేది కాదు. ఈ సారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా.. అనుమతి ఇస్తారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు.

News March 17, 2024

నిజామాబాద్ లోక్‌సభ స్థానం.. మహిళా ఓటర్లే అధికం

image

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో NZB అర్బన్‌, NZB రూరల్‌, ఆర్మూర్‌, బాల్కొండ, బోధన్‌, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌లో అత్యధికంగా 2.99 లక్షల ఓటర్లు ఉండగా.. ఆర్మూర్‌లో అత్యల్పంగా 2.10 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే బాల్కొండ మినహా అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా NZB అర్బన్‌లో 289, NZB రూరల్‌లో 293 పోలింగ్‌ కేంద్రాలున్నాయి.

News March 17, 2024

నాగర్‌కర్నూల్: ‘విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుంటే చర్యలు’

image

పదో తరగతి విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, ఇతర కారణాలతో యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని డీఈవో గోవిందరాజులు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది కాపీయింగ్ ప్రోత్సహించినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు.

News March 17, 2024

వ్యభిచార గృహంపై దాడి… కేసు నమోదు

image

కల్లూరులో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఓ ఇంట్లో మండల కేంద్రానికి చెందిన వ్యక్తి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అక్కడకు సుజాతనగర్‌కు చెందిన ఇద్దరు వచ్చారు. ఆ వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు. దీంతో విషయం బయటకు వచ్చింది. గతంలో ఇదే ఇంటి వద్ద ఇదే ఘటనపై కేసు నమోదైంది. దీంతో ఇంటి యజమానిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ షాకీర్ తెలిపారు.

News March 17, 2024

గేట్ ఫలితాల్లో ఆదిలాబాద్ వాసికి ఆల్ ఇండియాలో ర్యాంక్

image

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి ప్రతిభను కనబర్చారు. పట్టణంలోని జై జవాన్ నగర్ కాలానికి చెందిన సుంకరి నవీన్ ఆల్ ఇండియాలో 1833 ర్యాంక్ సాధించారు. 38.33 మార్కులు సాధించి క్వాలిఫై అయ్యాడు. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో రెండు షిఫ్టుల్లో దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించారు.

News March 17, 2024

HYD: యువకుడి ఆత్మహత్య

image

ఉరేసుకుని హాస్టల్ నిర్వాహకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి PS పరిధిలో జరిగింది.SI శోభన్ వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ (29) గచ్చిబౌలిలోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని 11 నెలలుగా శ్రీ దుర్గమెన్స్ పీజీ హాస్టల్ నిర్వహిస్తూ అక్కడే ఉంటున్నాడు. కాగా శనివారం అతడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

News March 17, 2024

HYD: యువకుడి ఆత్మహత్య

image

ఉరేసుకుని హాస్టల్ నిర్వాహకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి PS పరిధిలో జరిగింది.SI శోభన్ వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ (29) గచ్చిబౌలిలోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని 11 నెలలుగా శ్రీ దుర్గమెన్స్ పీజీ హాస్టల్ నిర్వహిస్తూ అక్కడే ఉంటున్నాడు. కాగా శనివారం అతడు  ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

News March 17, 2024

లోక్ సభ పోరు.. NGKL కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

image

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మహబూబ్ నగర్ పరిధిలో BRS, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. అటూ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని ప్రచారం ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థి తేలాల్సి ఉంది. ఇక్కడ BRS, కాంగ్రెస్‌ అభ్యర్థులపై స్పష్టత వస్తే ప్రచారం ఊపందుకోనుంది.