Telangana

News March 17, 2024

ALERT ఆదిలాబాద్: అమల్లోకి ఎన్నికల కోడ్

image

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినందున పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున తక్షణమే పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులు, వివిధ రకాల ప్రచార సామాగ్రిలు తొలగించాలని అన్నారు.

News March 17, 2024

సిద్దిపేట: ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరగదన్నారు. జిల్లా ప్రజలు గమనించగలరని ఆయన సూచించారు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోనూ రేపు ప్రజావాణి నిర్వహించారు.
SHARE IT

News March 17, 2024

నాగర్ కర్నూల్‌పై బీజేపీ ఫోకస్

image

నాగర్ కర్నూల్‌పై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా పాగా వేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో 1, 29, 021 ఓట్లు సాధించగా ఈసారి పక్కా గెలుస్తామని ఆపార్టీ నాయకులు చెబుతున్నారు. కాగా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భరత్ పోటీలో ఉన్నారు.

News March 17, 2024

కామారెడ్డి జిల్లాలో వడగళ్ల వర్షం

image

రామారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో వడగళ్ల వర్షం కురిసింది. రైతులు సాగు చేసినా వరి పంటతో పాటు మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా ఎదురుగా కూడిన వడగళ్ల వర్షం రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రంతో పాటు రెడ్డి పేట, పోసానిపేట గ్రామాలలో పెద్ద ఎత్తున వడగళ్ల వర్షం కురిసింది. ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

News March 16, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> ఏసీబీ వలలో జలమండలి అధికారులు
> ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. నగర వ్యాప్తంగా నిరసనలు
> ఓయూలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం
> లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సమీక్ష సమావేశం
> లాలాపేటలో రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగునీరు
> అమీన్‌పూర్ PS పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యం
> జీడిమెట్లలో 5 కేజీల గంజాయి స్వాధీనం
> హయత్‌నగర్-ఎల్బీనగర్ రూట్‌లో వాహన తనిఖీలు చేసిన పోలీసులు

News March 16, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*ఎల్లారెడ్డిపేట మండలంలో కారు ఢీకొని వ్యక్తి మృతి.
*మెట్పల్లి మండలం ఆరపేటలో ముగ్గురు మహిళలను ఢీ కొట్టిన కారు.. తీవ్ర గాయాలు.
*జగిత్యాలలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వైద్యుడి అరెస్ట్
*ఎన్నికల నియమావళిని పాటించాలన్న సిరిసిల్ల కలెక్టర్.
*రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లొద్దన్న SRCL ఎస్పీ.
*జగిత్యాలలో ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు.
*రాయికల్ మండలంలో వ్యవసాయ బావిలో పడి యువకుడి మృతి.

News March 16, 2024

గద్వాల: రెండు బైక్ ఢీ.. ఒకరి మృతి

image

రెండు బైకులు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన గద్వాల జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ధరూర్ మండలం అల్వాల్ పాడ్ గ్రామానికి చెందిన రమేష్ (26) అదే గ్రామానికి చెందిన రాము.. బైక్ పై ధరూర్ మండల కేంద్రానికి వెళ్తుండగా పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన ప్రమాదంలో రమేష్ మృతి చెందాగా.. రాము తీవ్రంగా గాయపడ్డాడు. రాముని ఆస్పత్రికి తరలించారు.

News March 16, 2024

తిమ్మాపూర్ స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం రాత్రి సుమారు 10 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. గుర్తుతెలియని కారు అతడిని బలంగా ఢీ కొట్టిడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 16, 2024

వెల్దండ: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

image

ఆర్టీసీ బస్సు టాలీ ఆటో ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన వెల్దండ మండలం కుట్ర గేట్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. కల్వకుర్తి మండలం యంగంపల్లి గ్రామానికి చెందిన సంపత్ (22) వెల్దండ మండలం గుండాల దేవస్థానం వద్ద బొమ్మల అమ్ముకునేవాడు. సంపత్
తన నివాసానికి వెళుతుండగా కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళుతున్న కల్వకుర్తి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.

News March 16, 2024

పటాన్‌చెరు: శ్మశానవాటిక సమీపంలో మృతదేహం

image

పటాన్‌చెరు మం. రుద్రారం శ్మశానవాటిక సమీపంలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. రుద్రారం కారోబార్ రాజు ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి 45-50 వయసు ఉంటుందని గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.