Telangana

News July 20, 2024

HYD: అర్ధాంగి లేదనే బాధతో మృతిచెందిన భర్త

image

ఆలు మగలవి ఒక జీవితానికి చాలని ప్రేమలని ఓ కవి అన్నారు. అర్ధాంగిని కోల్పోయిన బాధను జీర్ణించుకోలేని ఓ భర్త మనోవేదనతో తనువు చాలించిన విషాద ఘటన ఇది. పద్మారావు‌నగర్ స్కందగిరి‌లో కొంతకాలంగా జిల్లా లక్ష్మణ్(80) నీలవేణి (70) కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు. గత నెల 22న అనారోగ్యంతో నీలవేణి చనిపోయారు. దీంతో మనోవేదనకు గురైన భర్త శనివారం తనువు చాలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

News July 20, 2024

HYD: అర్ధాంగి లేదనే బాధతో మృతిచెందిన భర్త

image

ఆలు మగలవి ఒక జీవితానికి చాలని ప్రేమలని ఓ కవి అన్నారు. అర్ధాంగిని కోల్పోయిన బాధను జీర్ణించుకోలేని ఓ భర్త మనోవేదనతో తనువు చాలించిన విషాద ఘటన ఇది. సికింద్రాబాద్‌లోని పద్మారావు‌నగర్, స్కందగిరి‌లో కొంతకాలంగా జిల్లా లక్ష్మణ్(80) నీలవేణి (70) కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు. గత నెల 22న అనారోగ్యంతో నీలవేణి చనిపోయారు. దీంతో మనోవేదనకు గురైన భర్త శనివారం తనువు చాలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

News July 20, 2024

RR:ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓హైటెక్ సిటీ: రూ.7కోట్ల డ్రగ్స్ సీజ్
✓జూలై 21,22న ఉజ్జయిని మహంకాళి బోనాలు
✓పటాన్ చెరు: బుల్లెట్ తలలోకి దూసుకెళ్లి CISF కానిస్టేబుల్ మృతి
✓శేరిలింగంపల్లి: గోపన్ పల్లి వంతెన ప్రారంభించిన సీఎం
✓హుస్సేన్ సాగర్ ఫుల్..2 గేట్లు ఎత్తివేత
✓మణికొండలో కారు పై కూలిన చెట్టు
✓త్వరలో అందుబాటులోకి రానున్న చర్లపల్లి రైల్వే స్టేషన్

News July 20, 2024

నిజామాబాద్: నేటి వార్తల్లోని ముఖ్యంశాలు

image

*శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 18,275 క్యూసెక్కుల ఇన్ ఫ్లో * NZB జిల్లా ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ * పాఠశాల సమయాల్లో మార్పు: నిజామాబాద్ DEO *NZB: ఏడాదిన్నరలో రోడ్డు ప్రమాదాల్లో 550 మంది మృతి * రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: మంత్రి జూపల్లి * నిజామాబాద్: ‘నిర్లక్ష్యం, బాధ్యతరాహిత్యమే రోడ్డు ప్రమాదాలకు కారణం’ * GGHలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతం

News July 20, 2024

ఖమ్మం, మధిర డిపోల సిబ్బందితో ముచ్చటించిన మంత్రి

image

క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లతో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వర్చ్‌వల్‌గా సమావేశమయ్యారు. డిపోలలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం గురించి మరియు డిపోలో ఉన్న ఇబ్బందుల గురించి ఖమ్మం మరియు మధిర డిపోలకు చెందిన సిబ్బందితో స్వయంగా మంత్రి అడిగి తెలుసుకున్నారు.

News July 20, 2024

నిజామాబాద్: GGHలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతం

image

నిజామాబాద్ GGHలో కిడ్నాప్ అయిన మూడేళ్ల బాలుడు అరుణ్ కథ సుఖాంతం అయ్యింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో బాలుడిని పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే అతణ్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఆర్మూర్‌కు చెందిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. కాగా జిల్లా ఆస్పత్రిలో తన తండ్రి పక్కన నిద్రిస్తున్న బాలుడిని ఇద్దరు నిందితులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.

News July 20, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సైదాపూర్ మండలంలో పురుగుల మందు తాగి మహిళా ఆత్మహత్య. @ కథలాపూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ. @ సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్. @ ఎండపల్లి మండలంలో 5 డెంగ్యూ కేసులు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం. @ వెల్గటూర్ మండలంలో ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు సస్పెండ్.

News July 20, 2024

ఆదిలాబాద్: నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

◆ ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వాన
◆ లోకేశ్వరం: పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
◆ MNCL: రైలుకింద పడి యువకుడు మృతి
◆ భీమిని : మద్యం మత్తులో తల్లిపై దాడి
◆ బెల్లంపల్లి : గుండెపోటుతో ప్రభుత్వ పిఈటి మృతి
◆ కన్నెపల్లి : ఉరేసుకుని వ్యక్తి మృతి
◆ NRML : కడెం ప్రాజెక్టు మూడుగేట్లు ఎత్తివేత
◆ పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు
◆ ఆదిలాబాద్ : పోలీసులమంటూ బురిడీ
◆ మంచిర్యాల: MLAపై అసత్య ప్రచారం.. ముగ్గురు అరెస్ట్

News July 20, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి తాజా సమాచారం. ఇన్ ఫ్లో 00 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 9,874 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం 504.60 అడుగులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టి.ఎం.సిలు కాగా, ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం 122.6854 టీఎంసీలుగా ఉన్నది.

News July 20, 2024

హనుమకొండ: మాజీ ఎమ్మెల్యే కారు ఢీకొని మహిళ మృతి

image

మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ వద్ద జరిగింది. మృతురాలు కలకోట్ల స్వప్న (40)గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.