India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
*శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 18,275 క్యూసెక్కుల ఇన్ ఫ్లో * NZB జిల్లా ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ * పాఠశాల సమయాల్లో మార్పు: నిజామాబాద్ DEO *NZB: ఏడాదిన్నరలో రోడ్డు ప్రమాదాల్లో 550 మంది మృతి * రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: మంత్రి జూపల్లి * నిజామాబాద్: ‘నిర్లక్ష్యం, బాధ్యతరాహిత్యమే రోడ్డు ప్రమాదాలకు కారణం’ * GGHలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతం
క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లతో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వర్చ్వల్గా సమావేశమయ్యారు. డిపోలలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం గురించి మరియు డిపోలో ఉన్న ఇబ్బందుల గురించి ఖమ్మం మరియు మధిర డిపోలకు చెందిన సిబ్బందితో స్వయంగా మంత్రి అడిగి తెలుసుకున్నారు.
నిజామాబాద్ GGHలో కిడ్నాప్ అయిన మూడేళ్ల బాలుడు అరుణ్ కథ సుఖాంతం అయ్యింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలుడిని పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే అతణ్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఆర్మూర్కు చెందిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. కాగా జిల్లా ఆస్పత్రిలో తన తండ్రి పక్కన నిద్రిస్తున్న బాలుడిని ఇద్దరు నిందితులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.
@ సైదాపూర్ మండలంలో పురుగుల మందు తాగి మహిళా ఆత్మహత్య. @ కథలాపూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ. @ సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్. @ ఎండపల్లి మండలంలో 5 డెంగ్యూ కేసులు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం. @ వెల్గటూర్ మండలంలో ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు సస్పెండ్.
◆ ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వాన
◆ లోకేశ్వరం: పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
◆ MNCL: రైలుకింద పడి యువకుడు మృతి
◆ భీమిని : మద్యం మత్తులో తల్లిపై దాడి
◆ బెల్లంపల్లి : గుండెపోటుతో ప్రభుత్వ పిఈటి మృతి
◆ కన్నెపల్లి : ఉరేసుకుని వ్యక్తి మృతి
◆ NRML : కడెం ప్రాజెక్టు మూడుగేట్లు ఎత్తివేత
◆ పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు
◆ ఆదిలాబాద్ : పోలీసులమంటూ బురిడీ
◆ మంచిర్యాల: MLAపై అసత్య ప్రచారం.. ముగ్గురు అరెస్ట్
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి తాజా సమాచారం. ఇన్ ఫ్లో 00 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 9,874 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం 504.60 అడుగులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టి.ఎం.సిలు కాగా, ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం 122.6854 టీఎంసీలుగా ఉన్నది.
మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ వద్ద జరిగింది. మృతురాలు కలకోట్ల స్వప్న (40)గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
2024-25 విద్యా సం.కు గాను ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐలో ప్రవేశాల కొరకు, 2వ విడత ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, ప్రభుత్వ ఆశ్రమ పారిశ్రామిక శిక్షణ సంస్థ, కృష్ణసాగర్ ప్రిన్సిపల్ లక్ష్మణ్ తెలిపారు. అభ్యర్థులు iti.telangana.gov.in అనే వెబ్సైట్ నందు ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేసుకోని, పదవ తరగతి పాసై, 14 ఏళ్లు నిండినవారు ఈనెల 21లోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
మునుగోడు మండలానికి చెందిన వీరమళ్ళ సునిత మగవారికి ధీటుగా హలం పట్టి పంట పొలాల్లో దూసుకెళ్తుంది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఈ నారీమణి చిన్ననాటి నుంచే పొలం పనుల్లో మెలకువలు నేర్చుకొని రాటు తేలింది. తనకున్న కాడెద్దులతో పత్తి, వరి పొలాల్లో గుంటుక, గొర్రు తోలుతూ ఒక ఎకరానికి ₹800/- చొప్పున రోజుకి 4 ఎకరాలకు ₹3200/- సంపాదిస్తుంది. నేడు స్వతహాగా ఉపాధి బాట పట్టి మరెందరికో ఆదర్శంగా నిలిచింది.
రుణ మాఫీకి కోర్రీలు పెట్టారని, ఆరు హామీలు అటకెక్కించారని BRS పార్టీ రాష్ట్ర నాయకుడు RS ప్రవీణ్ కుమార్ అన్నారు. మఠంపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రైతు రుణమాఫి అని చెప్పి లక్ష లోపు సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదన్నారు. రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.