India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రుణ మాఫీకి కోర్రీలు పెట్టారని, ఆరు హామీలు అటకెక్కించారని BRS పార్టీ రాష్ట్ర నాయకుడు RS ప్రవీణ్ కుమార్ అన్నారు. మఠంపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రైతు రుణమాఫి అని చెప్పి లక్ష లోపు సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదన్నారు. రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి సకాలంలో రూ.2లక్షల లోపు రైతు రుణమాఫీ చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డిలో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేశామని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలే కేంద్రబిందువుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో పలువురు ఎస్సైలను శనివారం ఉన్నతాధికారులు బదిలీ చేశారు. తిరుమలాయపాలెం ఎస్హెచ్ఓ గిరిధర్ రెడ్డి, ఖమ్మం రూరల్ పీఎస్ ఎస్సై పులోజు కుశ కుమార్, బయ్యారం ఎస్హెచ్ఓ ఉపేందర్లను బదిలీ చేస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో నూతన ఎస్ఐలను పోలీస్ ఉన్నతాధికారులు నియమించారు.
ఒంటరి వృద్ధులు, వృద్ధ మహిళలను టార్గెట్ చేసి వరుస దొంగతనాలు చేసే ముఠాను పట్టుకున్నట్లు రూరల్ CI గాంధీనాయక్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. MBNR పట్టణానికి చెందిన షేక్ మహ్మద్ హుస్సేన్, ఉమ ఒంటరిగా వృద్ధులు, వృద్ధ మహిళలు కనబడగానే ఆటో ఎక్కించుకొని ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి చంపుతామని బెదిరించి వారి ఒంటిపై ఉన్న నగలు, డబ్బు లాక్కుంటారని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు.
మరో 2 రోజులు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో భద్రాద్రి, ఖమ్మం జిల్లా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈ మేరకు శనివారం భద్రాద్రి, ఖమ్మం కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. రెవిన్యూ శాఖలో ఉద్యోగులు సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు మంత్రి తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.
తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం పౌల్ట్రీ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్రెడ్డిపల్లికి చెందిన గార్ల ఆంజనేయులు (40) పౌల్ట్రీ, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య మౌనిక, ముగ్గురు సంతానం ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అన్ని ప్రదేశాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేయాలన్నారు.
తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం పౌల్ట్రీ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్రెడ్డిపల్లికి చెందిన గార్ల ఆంజనేయులు (40) పౌల్ట్రీ, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య మౌనిక, ముగ్గురు సంతానం ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భీమిని మండల కేంద్రంలో రాంటెంకి శ్రీకాంత్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో తల్లి పోషక్కను బ్లేడ్తో చేతిపై గాయపర్చగా, అన్న శంకర్ను ఇనుపరాడ్తో కొట్టి తాను బ్లేడ్తో కోసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శ్రీకాంత్ను ఆసుపత్రికి తరలించే క్రమంలో హోంగార్డు అశోక్ పై దాడి చేసి బ్లేడ్తో గొంతు కోశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కెజిబివి) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులను జారీచేశారు. ఉత్తర్వులకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచి 6, 7 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో అడ్మిషన్లను ప్రారంభించినట్లు డీఈఓ రామారావు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.