India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అలాగే జిల్లాలోని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు మెదక్ ఆర్డీవో రమాదేవి తెలిపారు. ఉదయం 10:30 నుంచి 2:30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని శనివారం నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన ఆర్టీసీ ఆస్పత్రిని సందర్శించి చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన మాట్లాడారు.
తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని శనివారం నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన ఆర్టీసీ ఆస్పత్రిని సందర్శించి చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన మాట్లాడారు.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ.లార్సన్, మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. పార్టీ సనత్నగర్ ఇన్ఛార్జ్ కోట నీలిమ, నాయకులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ.లార్సన్, మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. పార్టీ సనత్నగర్ ఇన్ఛార్జ్ కోట నీలిమ, నాయకులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇకపై ప్రతి సోమవారం ఉ.11 గంటల నుండి ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదులకు వీలుగా “గ్రీవెన్స్ డే”ను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను జిల్లా ఎస్పీకి నేరుగా తెలపడానికి అవకాశం కల్పిస్తున్నందున ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన నేపథ్యంలో కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, ఫిర్యాదులుంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3434, 9154252936 లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కంట్రోల్ రూమ్లో 24 గంటలు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.
నిజామాబాద్ జిల్లా మెండోరాకు చెందిన మాకురి వినోద్ బతుకుదెరువుకోసం బెహరన్ దేశం వెళ్లాడు. కాగా ఈనెల17న డ్యూటీలో ఉండగానే ప్రమాదవశాత్తు మృతి చెందాడు. వినోద్ మృతదేహన్ని త్వరగా స్వదేశానికి తీసుకు వచ్చేలా చూడాలని అతని భార్య యమున, పిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఈ సందర్భంగా విద్యార్థులకు బోధన చేసి పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఆయన పరిశీలించారు. పాఠశాలలోని పలు రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులను సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.
HYD సనత్నగర్ సీఐ పురేందర్ రెడ్డిపై సైబరాబాద్ సీపీ చర్యలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఓ కేసు విషయమై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనతో సీఐ అసభ్యకరంగా చాటింగ్ చేశాడని బాధితురాలు సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసింది. అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేస్కి రావాలంటూ చాటింగ్ చేశాడని పేర్కొంది. మెసేజ్లను చూయించింది. దీంతో సీఐను హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.