Telangana

News July 20, 2024

దండేపల్లి: ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

image

దండేపల్లి మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ అనిలాను సస్పెండ్ చేస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల రికార్డులు సక్రమంగా లేకపోవడం, యూనిఫాం డబ్బులు సకాలంలో చెల్లించకపోవడం తదితర ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపి నివేదికలను రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ ఏంఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

News July 20, 2024

కరీంనగర్: పదవుల్లో జిల్లా నేతలు.. అభివృద్ధిపై గంపెడాశలు!

image

కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో జిల్లా నేతలు కీలక పదవుల్లో కొనసాగుతుండటంతో అభివృద్ధిపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. కేంద్రమంత్రిగా బండి సంజయ్, రాష్ట్ర మంత్రులుగా శ్రీధర్ బాబు, పొన్నంతో పాటు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్‌కు ప్రభుత్వ విప్ పదవులు దక్కగా జిల్లాకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.

News July 20, 2024

వరంగల్: 113 మంది కానిస్టేబుళ్లు బదిలీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న 113 మంది కానిస్టేబుళ్లు కౌన్సిలింగ్ పద్దతిలో బదిలీ అయ్యారు. ఈ మేరకు వారు కమిషనరేట్ పరిధిలో ఎంపిక చేసుకున్న పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

News July 20, 2024

HYD: బోనాల ఉత్సవాలు.. సీఎస్‌ ఆదేశాలు

image

సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని CS శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించాలని సూచించారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు రెండు 500 KVట్రాన్స్‌ఫార్మర్లు, డీజిల్ జనరేటర్లను స్టాండ్‌లో ఉంచామన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంత రావు, GHMC కమిషనర్‌ ఆమ్రపాలి ఉన్నారు.

News July 20, 2024

HYD: బోనాల ఉత్సవాలు.. సీఎస్‌ ఆదేశాలు

image

సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని CS శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించాలని సూచించారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు రెండు 500 KVట్రాన్స్‌ఫార్మర్లు, డీజిల్ జనరేటర్లను స్టాండ్‌లో ఉంచామన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంత రావు, GHMC కమిషనర్‌ ఆమ్రపాలి ఉన్నారు.

News July 20, 2024

కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేదు: మంత్రి జూపల్లి

image

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో అవినీతికి ఆస్కారంలేదని, ప్రజాప్రతినిధులు, అధికారులు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. విపనగండ్లలో వివిధ అంశాలపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. BRS పాలనలో గాడి తప్పిన వ్యవస్థను బాగు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవినీతికి తావులేదనే సందేశం కిందిస్థాయి వరకు వెళ్లాలని మంత్రి సూచించారు.

News July 20, 2024

సంగారెడ్డి: ‘విద్యార్థులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాం’

image

విద్యార్థులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News July 20, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ విడుదల: చనగాని
✓సికింద్రాబాద్: లష్కర్ బోనాలకు సీఎం, డిప్యూటీ సీఎంకు ఆహ్వానం ✓గోల్కొండ అమ్మవారి హుండీ ఆదాయం రూ.3,91,205
✓శంషాబాద్:యువకుడి అసభ్య ప్రవర్తన.. కొట్టి చంపేసిన మహిళలు
✓బాలాపూర్:సీఎం 30 వేల ఉద్యోగాలిచ్చారు:KLR
✓ఖైరతాబాద్: శరవేగంగా 70 అడుగుల గణపయ్య విగ్రహ పనులు
✓HYD-బీజాపూర్ హైవే విస్తరణకు లైన్ క్లియర్

News July 20, 2024

త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల: డిప్యూటీ సీఎం

image

త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఓవర్ ల్యాపింగ్ లేకుండానే పోటీ పరీక్షలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అలాగే త్వరలో ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాగా, నేడు డిప్యూటీ సీఎం సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులతో పరీక్షల రద్దుపై చర్చించారు.

News July 20, 2024

ప్రతి కేసుపై పారదర్శక విచారణ: ఎస్పీ

image

ప్రతీ కేసుపై పారదర్శకంగా విచారణ చేపట్టి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసులను పరిశీలించారు. ఆయా కేసులకు సంబంధించి అధికారులు సేకరిస్తున్న ఆధారాలను పరిశీలించారు. సమవేశంలో అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి ఉన్నారు.