India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళా సమాఖ్య, రైతులు, స్థానిక ప్రజల సమస్యలపై మంత్రి జూపల్లి చర్చించారు. వీపనగండ్ల మండలంలోని వివిధ అంశాలపై అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో గాడి తప్పిన వ్యవస్థను బాగు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అవినీతికి తావు లేదనే సందేశం పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు వెళ్లాలన్నారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు బిక్కనూర్ మండలంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి చెప్పారు. మండల కేంద్రంలో నిర్వహించే రైతు సంబరాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఆయన పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నట్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు.
ADB జిల్లా వ్యాప్తంగా 18 మంది ధరణి అపరేటర్లకు స్థానచలనం కల్పించారు. ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లను ఎట్టకేలకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఆయా మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో చేరాలని ఆదేశించారు. కాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కొందరిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తారని అంతా భావించినా.. పక్క మండలానికే కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
నేషనల్ స్కిల్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ కోర్సులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ అందిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సాయి శ్రీమాన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మణికొండలోని సమస్త కార్యాలయంలో ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. SHARE IT
సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఈ నెల 21, 22న జరగనున్న విషయం తెలిసిందే. అమ్మవారి దర్శనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి TGRTC ప్రత్యేక రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్రేటర్లోని 24 ప్రాంతాల నుంచి 175 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ MD సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT
సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఈ నెల 21, 22న జరగనున్న విషయం తెలిసిందే. అమ్మవారి దర్శనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి TGRTC ప్రత్యేక రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్రేటర్లోని 24 ప్రాంతాల నుంచి 175 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ MD సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT
◆ త్వరలో ఆదిలాబాద్లో రేవంత్ రెడ్డి పర్యటన
◆ జైనూర్: భారీగా గుట్కా పట్టివేత
◆ భైంసా: కోతికి అంత్యక్రియలు
◆ మంచిర్యాల: చోరీకి పాల్పడిన ముగ్గురు అరెస్ట్
◆ తలమడుగు: పురుగుల మందుతాగి యువకుడు మృతి
◆ పెంచికల్ పెట్ : రోడ్డుపై చేపలు పడుతూ నిరసన
◆ దిలావార్పూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
◆ ఆదిలాబాద్: ప్రాజెక్టులకు జలకళ
◆ పలు చోట్ల ఉప్పొంగిన వాగులు, వంకలు
◆ రెబ్బెన: డ్రంక్ అండ్ డ్రైవ్
విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని OSD మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలోని ఎంబీఏ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మొదటి సంవత్సర విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. నాలుగవ సెమిస్టర్ లో మంచి మార్కులు సాధించి మంచి ఉద్యోగం చేయాలని, అదే అధ్యాపకులకు ఇచ్చే గురుదక్షిణ అని అన్నారు. ప్రిన్సిపల్ చంద్ర కిరణ్, అధ్యాపకులు పాల్గొన్నారు.
తెలంగాణలోని రైతులందరి సూచనలు, అభిప్రాయాలను క్రోడీకరించి రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రైతు భరోసా పథకం అమలుపై ఉమ్మడి జిల్లాలోని రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఆ దిశగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. కలెక్టరేట్లో మెడికల్ ఆఫీసర్లకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రతి మెడికల్ ఆఫీసర్ ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో సిజేరియన్ సెక్షన్లు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని, అనుమతులను రద్దు చేస్తామని అన్నారు.
Sorry, no posts matched your criteria.