Telangana

News July 19, 2024

నిజామాబాద్: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

image

హత్య కేసులో ఓ వ్యక్తికి యావజ్జీవ శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి సునీత తీర్పు వెల్లడించారు. వివరాలిలా.. ఆలూరు(M)కు చెందిన గంగుకు తన కోడలితో గొడవలు జరిగేవి. ఈ విషయాన్ని వెంకటి అనే వ్యక్తికి చెప్పడంతో అతడు నగలు దోచుకోవాలనే దురుద్దేశ పడ్డాడు. గొడవ పడకుండా ఉండేందుకు పూజలు చేయాలని చెప్పాడు. 2022 SEP 27న ఓ మడుగులో స్నానం చేయాలని చెప్పాడు. ఆమె నీటిలో దిగగానే మెడకు చీర చుట్టి చంపేశాడు.

News July 19, 2024

ఆదిలాబాద్ జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు

image

ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తుండడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని వివిధ గ్రామాల్లో 100కు పైగా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. రోగులు వాంతులు విరోచనాలతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో అడ్మిట్ అవుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని రోగులకు సూచిస్తున్నారు.

News July 19, 2024

కరీంనగర్: 1,30,709 మంది రైతుల రుణమాఫీ

image

పంట రుణమాఫీ నిధుల విడుదలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని 1,30,709 మంది రైతులకు రూ.688.44 కోట్ల పంట రుణమాఫీ నిధులు రానున్నాయి. ఇందులో కరీంనగర్‌‌లో 37,745 మంది రైతులకు రూ.194.64 కోట్ల నిధులు, జగిత్యాలలో 39,253 మంది రైతులకు రూ.207.99 కోట్లు, పెద్దపల్లిలో 29,725 రైతులకు రూ.149.43 కోట్లు, సిరిసిల్లలో 23,986 మంది రైతులకు రూ.136.36 కోట్ల నిధులను విడుదల చేశారు.

News July 19, 2024

రైతు రుణమాఫీ పేరిట లింకులు వస్తే ఓపెన్ చెయొద్దు

image

రైతు రుణమాఫీ అంటూ ఫోన్‌కు లింకులు వస్తే ఓపెన్ చెయొద్దని SP ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఏదైన కార్యక్రమం ప్రారంభించగానే సైబర్ నేరగాళ్లు అదే పేరిట ఆన్‌లైన్ మోసాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైన సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్‌ చేయడం, దగ్గర్లోని PSలో ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బును రికవరీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News July 19, 2024

HYD: ఉజ్జయినీ బోనాలు.. కీలక మార్పులు

image

ఈనెల 21న నిర్వహించనున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలకు అధికారులు కీలక మార్పులు చేశారు. ఈసారి ఆలయంలోకి జోగినీలు, శివసత్తులతో పాటు ఐదుగురినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి సా.4 గంటలలోపు బాట కూడలి నుంచి మాత్రమే వచ్చేలా పక్కా ప్రణాళిక చేశారు. బోనాల అనంతరం నిర్వహించే ఫలారం బండి(తొట్టెల) ఊరేగింపు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.

News July 19, 2024

HYD: ఉజ్జయినీ బోనాలు.. కీలక మార్పులు

image

ఈనెల 21న నిర్వహించనున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలకు అధికారులు కీలక మార్పులు చేశారు. ఈసారి ఆలయంలోకి జోగినీలు, శివసత్తులతో పాటు ఐదుగురినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి సా.4 గంటలలోపు బాట కూడలి నుంచి మాత్రమే వచ్చేలా పక్కా ప్రణాళిక చేశారు. బోనాల అనంతరం నిర్వహించే ఫలారం బండి(తొట్టెల) ఊరేగింపు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.

News July 19, 2024

రుణమాఫీ… రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ

image

రుణమాఫీ కింద రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 83,124 రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం రూ.454.49 కోట్లను జమ చేసింది. అటు సూర్యాపేట జిల్లాలో 56,274 మంది రైతుల ఖాతాల్లో రూ.282.98 కోట్లు, యాదాద్రి జిల్లాలో 37,285 ఖాతాల్లో రూ.203.82 కోట్లను ప్రభుత్వం జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1.76 లక్షల మంది రైతుల ఖాతాల్లో రానున్న నాలుగైదు రోజుల పాటూ రూ.941.29 కోట్లను జమ చేయనుంది.

News July 19, 2024

MBNR: రూ.1,120.74 కోట్లు మాఫీ

image

తొలి విడతలో రూ.లక్షలోపు పంట రుణాలమాఫీకి సంబంధించి ఉమ్మడి MBNRజిల్లాలో 1,91,519 కుటుంబాల్లో 2,01,102 మంది రైతులకు లబ్ధి చేకూరింది. మొత్తం రూ.1,120.74 కోట్ల మాఫీకాగా.. అత్యధికంగా రుణమాఫీ అయిన నియోజకవర్గాల్లో కల్వకుర్తి రూ.103.02కోట్లతో రాష్ట్రంలో 3వస్థానంలో ఉండగా.. జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. రూ.99.84కోట్లతో కొడంగల్, రూ.92.44కోట్లతో అచ్చంపేట నియోజకవర్గాలు వరుసగా 2,3 స్థానాలు దక్కించుకున్నాయి.

News July 19, 2024

వాంకిడి: భగ్గుమంటున్న టమాటా ధరలు

image

వాంకిడి మండలం కేంద్రంలో గురువారం సాగిన సంతలో టమాట కేజీ రూ.100, పెద్దగా ఉన్న (గ్రేడ్-ఏ) టమాటాలు రూ.120కు లభించాయి. వర్షాలకు దెబ్బతినడం, సరఫరా సరిపడినంత లేకపోవడంతోనే టమాటా ధరలు పైపైకి చేరుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. కాగా నిన్న, మొన్నటి వరకు అందుబాటులో ఉన్న టమోటా ధర పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.

News July 19, 2024

ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

image

జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నేషనల్ హైవే ప్రాజెక్టుల భూ సేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. ధంసలాపురం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ కి కావాల్సిన భూ సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.