Telangana

News July 18, 2024

వర్షం వల్ల ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల తాడిచర్ల ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 80 వేల మెట్రిక్ టన్నుల ఓబీ తవ్వకాలు, 4000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు మైన్ అధికారులు తెలుపుతున్నారు. మైండ్ మొత్తం బురదమయంగా మారడంతో పాటు ఓసీపీలోకి వరద నీరు వచ్చి చేరింది. మోటార్ల సాయంతో వరద నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.

News July 18, 2024

రేపు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మంత్రుల పర్యటన

image

రేపు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు ,తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలు ఖరారయ్యింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో అయిల్ ఫాం ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, 11:40కి మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు జయంతి వేడుకల్లో, 1 గంటలకు కరీంనగర్లోని ఓ కన్వెన్షన్లో రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

News July 18, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.60,790 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.24,416, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.21,600, అన్నదానం రూ.14,774 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రజలకు తెలియజేశారు.

News July 18, 2024

సంగారెడ్డి: EMT ఉద్యోగులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి జిల్లాలో EMRI సంస్థ 108లో EMT ఉద్యోగ నియామకాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు Bscనర్సింగ్, లైఫ్ సైన్స్, Bఫార్మా, GNM, DMLT కోర్సులు పూర్తిచేసి 35ఏళ్లలోపు అభ్యర్థులు ఈ నెల 23న సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగే ఇంటర్వ్యూలకు సకాలంలో హాజరు కావాలన్నారు.

News July 18, 2024

అంకాపూర్ చికెన్ తినిపిస్తావా.. బోధన్ రైతుతో CM రేవంత్

image

అంకాపూర్ చికెన్ తినిపిస్తావా? లేదా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన యువ రైతు రవిని అడిగారు. రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవితో మాట్లాడుతూ.. చికెన్ గురించి అడిగారు.

News July 18, 2024

ADB: మద్యం మత్తులో మహిళ హంగామా

image

మద్యం మత్తులో ఒక మహిళ ఆర్టీసీ బస్సులో హంగామా సృష్టించింది. ఆదిలాబాద్ నుంచి ఆర్టీసీ బస్సు గురువారం నిర్మల్‌కు బయలుదేరింది. మద్యం మత్తులో ఉన్న ఒక మహిళ ఆ బస్సు ఎక్కి ఇబ్బందులకు గురిచేసింది. మహిళను బస్సు దిగమని కండక్టర్ సూచించినప్పటికీ దిగనని మొండికేసింది. దీంతో బస్సును కలెక్టర్ చౌక్ వద్ద నిలిపివేశారు. మహిళా పోలీసులు వచ్చి ఆమెను బలవంతంగా బస్సులోంచి కిందికి దింపేసి మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నారు.

News July 18, 2024

ములుగు: రిజిస్టర్ కార్యాలయంలో మతాంతర వివాహం

image

ములుగు జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో తెలంగాణ బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన కుమారుడు భరత్, తస్లీమ్‌లకు ఆదర్శ వివాహాన్ని జరిపించారు. ఈ కార్యక్రమానికి ప్రజాసంఘాల జేఏసీ ఛైర్మన్ బిక్షపతి హాజరై మాట్లాడుతూ.. మతాంతర వివాహం చేసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. నేటి సమాజంలో వరకట్న వేధింపులు, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి ఆదర్శ వివాహం చేసుకోవడం హర్షనీయమన్నారు.

News July 18, 2024

HYD: ఐటం సాంగ్‌లో KCR మాటలు.. డైరెక్టర్‌పై ఫిర్యాదు

image

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌పై చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ BRS యువజన నాయకులు గురువారం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని ఓ ఐటమ్ సాంగ్‌లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR మాటలను వాడటం ఏంటన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఐటం సాంగ్‌లో ఉన్న KCR మాటలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఉప్పరి విజయ్, మోతే రాజు, వినయ్, రాకేశ్, వినయ్ కలిసి ఈ ఫిర్యాదు చేశారు.

News July 18, 2024

HYD: ఐటం సాంగ్‌లో KCR మాటలు.. డైరెక్టర్‌పై ఫిర్యాదు

image

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌పై చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ BRS యువజన నాయకులు గురువారం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని ఓ ఐటమ్ సాంగ్‌లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR మాటలను వాడటం ఏంటన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఐటం సాంగ్‌లో ఉన్న KCR మాటలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఉప్పరి విజయ్, మోతే రాజు, వినయ్, రాకేశ్, వినయ్ కలిసి ఈ ఫిర్యాదు చేశారు.

News July 18, 2024

ఎత్తిపోతల పనులు వేగం పెంచాలి: సీఎం

image

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో గురువారం సమావేశంలో సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ.. పనులలో వేగం పెంచాలని, ప్రాజెక్టు పురోగతిపై ఇకనుంచి ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సమీక్షిస్తామని చెప్పారు. దీంతో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.