India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్పై చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ BRS యువజన నాయకులు గురువారం మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని ఓ ఐటమ్ సాంగ్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR మాటలను వాడటం ఏంటన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఐటం సాంగ్లో ఉన్న KCR మాటలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఉప్పరి విజయ్, మోతే రాజు, వినయ్, రాకేశ్, వినయ్ కలిసి ఈ ఫిర్యాదు చేశారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో గురువారం సమావేశంలో సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ.. పనులలో వేగం పెంచాలని, ప్రాజెక్టు పురోగతిపై ఇకనుంచి ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సమీక్షిస్తామని చెప్పారు. దీంతో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మెదక్ జిల్లాకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా శాంతిభద్రతలకు పరిరక్షించడంలో కింది స్థాయి అధికారులను సమన్వయం చేస్తూ ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా పగడ్బందీగా చర్యలు చేపడతామని చెప్పారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మేడిగడ్డ బ్యారేజీకి వరద పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజికి 53,400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. గేట్లు ఎత్తి దిగువకు అంతే నీటిని బయటకు పంపిస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు చోట్ల వానలు పడుతున్న సంగతి తెలిసిందే.
రైతు రుణమాఫీ అంశంలో బ్యాంకర్లు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. గురువారం కరీంనగర్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు రుణమాఫీ అంశంపై బ్యాంకర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 35,686 రైతు కుటుంబాలకు సంబంధించిన 37,745 బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం 194.64 కోట్లు జమ చేయనుందన్నారు. రేషన్ కార్డును కేవలం రైతు కుటుంబాల గుర్తింపు కోసమే ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపన్పల్లి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ నెల 20న వంతెనను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పనులు తుదిదశకు చేరుకున్నాయని MLA చెప్పారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది నాయకులను సస్పెండ్ చేశారు. పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వారిపై ఆరేళ్లపాటు సస్పెన్షన్ విధిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కు గురైన వారిలో నలుగురు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు.
జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శాంతి కోటేశ్ గౌడ్ అధ్యక్షతన ఈరోజు జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. 18 నెలల బాలుడు విహాన్ కుక్కల దాడిలో మరణించిన నేపథ్యంలో జవహర్నగర్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కుక్కల బెడదను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పలు సూచనలు చేశారు.
జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శాంతి కోటేశ్ గౌడ్ అధ్యక్షతన ఈరోజు జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. 18 నెలల బాలుడు విహాన్ కుక్కల దాడిలో మరణించిన నేపథ్యంలో జవహర్నగర్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కుక్కల బెడదను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పలు సూచనలు చేశారు.
Sorry, no posts matched your criteria.