Telangana

News July 18, 2024

NZB: కలెక్టర్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు

image

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో 2022 ఆగస్టులో బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో జాతీయ మానవ హక్కుల కమిషన్ తాజాగా జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఘటనలో బాధితురాలికి పరిహారం చెల్లింపులో కాలయాపన జరుగుతోందని వరంగల్‌కు చెందిన పౌర హక్కుల సంఘం ప్రతినిధి బక్క జడ్సన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక కోరుతూ కమిషన్ జిల్లా కలెక్టర్‌కు సమన్లు జారీ చేసిందని జడ్సన్ తెలిపారు.

News July 18, 2024

మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు: పోలీస్ కమీషనర్

image

ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండల పరిధిలోని కొలనూర్, పెద్దరాత్ పల్లి, కాల్వ శ్రీరాంపూర్ ప్రాంతాల్లో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి సహా పలువురు పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు. పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్షతో కలిసి హెలిపాడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.

News July 18, 2024

ఆదిలాబాద్: ఐటీఐలో అడ్మిషన్లకు గడువు పొడగింపు

image

ఐటిఐ కళాశాలలో రెండవ విడత ద్వార ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు తేదీని పొడగించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ రొడ్డ శ్రీనివాస్ తెలిపారు. జులై 15 వరకు గడువు ఉండగా జూలై 21 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. కావున ఐటిఐ కళాశాలలో చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ కళాశాలలో వివిధ ట్రెడ్ లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. SHARE IT

News July 18, 2024

భూ వివాదం.. మహిళపై దాడి

image

భూ వివాదంలో ఓ మహిళపై మాజీ ఉపసర్పంచ్ దాడిచేసిన ఘటన పెద్దవూర మండలం తేప్పలమడుగులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జానపాటి సునీతపై మాజీ ఉపసర్పంచ్ పల్లెబోయిన శంకర్, అతని కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో NLGలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు స్పందించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.

News July 18, 2024

బిజినేపల్లి: మద్యం మత్తులో ఉరేసుకుని యువకుడి సూసైడ్

image

మద్యం మత్తులో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బిజినేపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. లింగసానిపల్లి గ్రామానికి చెందిన సురేశ్ (26) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. క్షణికావేశంలో ఉరేసుకొని బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

News July 18, 2024

ప్రజాసేవకు విరమణ ఉండదు: కడియం

image

చిల్పూర్ మండల కేంద్రంలో గురువారం ఎంపీపీ, ఎంపీటీసీల పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవికి విరమణ ఉంటుంది తప్ప.. ప్రజాసేవకు విరమణ ఉండదని అన్నారు. పదవీ కాలం ముగిసిన ప్రతి రాజకీయ నాయకుడు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. ఎంపీపీ, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు.

News July 18, 2024

KNR: గ్రూప్-1 మెయిన్స్‌కు ఉచిత శిక్షణ

image

గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన ఔత్సాహికులు దరఖాస్తులను వెబ్‌‌సైట్
www.tgbcstudycircle.cgg.gov.inలో ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 75 రోజుల పాటు నిర్వహించే శిక్షణ ఈ నెల 22న మొదలవుతుందన్నారు.

News July 18, 2024

దమ్మపేట: పిడుగు పడి ఇద్దరు చిన్నారులు మృతి

image

పిడుగు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన దమ్మపేట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. దమ్మపేట మండలం జమేధారు బంజర్ గ్రామంలో ఇద్దరు చిన్నారులు పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 18, 2024

ఎన్నికల హామీని తూచా తప్పకుండా నెరవేరుస్తాం: ఎంపీ రేణుక చౌదరి

image

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల అధ్యక్షతన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీ రేణుక చౌదరి మాట్లాడుతూ.. ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచిన రాష్ట్రంలోని ప్రతీ రైతుకు 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీని అధికారంలోకి వచ్చిన 7 నెలలలోనే ఇచ్చిన హామీని నెరవేర్చామన్నారు.

News July 18, 2024

ములుగు DMHOను అభినందించిన మంత్రి రాజనర్సింహ

image

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ములుగు <<13649861>>DMHO <<>>డా.అల్లెం అప్పయ్యకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో నడిచి, కొండలు ఎక్కి, వాగులు దాటి ఆదివాసీలకు వైద్యసేవలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. ములుగు DMHOను ఆదర్శంగా తీసుకుని ఇతర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలతో పాటు గిరిజనులకు వైద్యసేవలు అందించాలని కోరారు.