India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువు పెంచడం జరిగిందని అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. అపరాధ రుసుం లేకుండా ఈనెల 7 వరకు, అపరాధ రుసుంతో 20వ తేదీ వరకు పొడిగించారన్నారు. ఆసక్తిగల అభ్యాసకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 80084 03522 నెంబరును సంప్రదించాలని పేర్కొన్నారు.
కరీంనగర్ పట్టణం భగత్నగర్లో సాయి కృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న లీగల్ మెట్రోలజీ (తూనికలు, కొలతలు) కార్యాలయాలను LMD కాలనీ, మహాత్మా నగర్ (తిమ్మాపూర్ మండలం), సర్వే నంబర్: 443లో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ భవనంలోకి మార్చారు. ఈ కొత్త భవనంలో లీగల్ మెట్రోలజీకి సంబంధించిన మూడు విభాగాల కార్యాలయాలను మార్చారు. ప్రజలు ఇకపై కొత్త చిరునామాలో సేవలు పొందగలరని అధికార విభాగం తెలిపింది.
2025-26 విద్యా సంవత్సరానికి PHD ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉర్దూ, బిజినెస్ మేనేజ్మెంట్, కామర్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, బాటని, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, జియో ఇన్ఫర్మాటిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మాసూటికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, సోషల్ వర్క్, లా విభాగాల్లో ఖాళీల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి తెలిపారు.
HYDలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 6న మ.1:10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మ.1:30 నుంచి మ.3 గంటల వరకు ఐటీసీ కాకతీయలో బీజేపీ నేతలతో సమావేశం, మ.3 నుంచి సా.4 గంటల వరకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి 46 ఏళ్ల ప్రయాణానికి సంబంధించి ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సా.4 నుంచి సా.4:55 గంటల వరకు MJ మార్కెట్లో గణేశ్ నిమజ్జనోత్సవంలో పాల్గొంటారు.
ఖమ్మం జిల్లాలో కాజీపేట–BZA రైల్వే మూడో లైన్ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ తుది దశలో ఉందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ సమీక్షించిన వీడియో కాన్ఫరెన్స్లో బుధవారం పాల్గొన్న ఆయన, ప్రాజెక్ట్ వేగవంతానికి భూ సేకరణ కీలకమని, గడువు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ లైన్ పూర్తయితే రైళ్ల ట్రాఫిక్ తగ్గి ప్రయాణికులు, పరిశ్రమలకు మేలు చేకూరనుందని పేర్కొన్నారు.
గణేష్ నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం సాయంత్రం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ పనులపై కలెక్టర్ రాజర్షిషా బుధవారం అధికారులతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల రవాణాను తక్షణమే పునరుద్ధరించాలని, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నష్టాన్ని వెంటనే అంచనా వేసి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు కల్పిస్తున్నట్లు మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. నిమజ్జన వేళ ప్రజలకు పలు సూచనలు చేశారు. జిల్లాలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా, భద్రతగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి విభాగం అప్రమత్తంగా పని చేయాలని ఆదేశించారు. మెదక్లో వినాయక మండపాలను సందర్శించారు.
చేగుంట గురుకుల పాఠశాలలో ఈనెల 8, 9న గిరిజన గురుకుల క్రీడా పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలకు ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి బోనఫైడ్, కుల ధ్రువీకరణ పత్రం తీసుకొని ఉదయం 10:30 గంటల లోగా చేగుంట గురుకుల పాఠశాలలో జరిగే పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
HYD శామీర్పేట్(M) జీనోమ్ వ్యాలీ PS పరిధిలో విషాద ఘటన ఈరోజు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. జగన్గూడలోని కొల్తూరు చౌరస్తా వద్ద బైక్పై వస్తున్న ఇద్దరిని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ఉన్న ఓ వ్యక్తి కాలు తెగి పడిపోయింది. నొప్పితో విలవిలలాడుతున్న వ్యక్తిని చూసిన స్థానికులు 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు.చాలా సేపు తర్వాత ‘108’ సిబ్బంది వచ్చి అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.