India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అస్సాం రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య వ్యర్థాలు వాటి నియంత్రణకు అక్కడి ప్రభుత్వం చేపట్టిన విధివిధానాలపై HYD కార్పొరేటర్లు అస్సాం రాష్ట్రంలో స్టడీ టూర్ను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వశర్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, సతీశ్గౌడ్ పాల్గొన్నారు.
గురుకుల విద్యార్థుల్లో వ్యక్తిగత నైపుణ్యాలను మరింత మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలోని కాన్ఫరెన్స్ హల్లో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గురుకులాలు బీసీ హాస్టళ్లు మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. హాస్టల్లో నాణ్యమైన ఆహారం అందించాలని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు.
☆ మధిరలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
☆ సాగర్ ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తాం: కలెక్టర్
☆ పర్యాటక గుమ్మంగా ఖమ్మం ఖిల్లాను తీర్చిదిద్దుతాం: తుమ్మల
☆ ఓపెన్ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేయాలి: అదనపు కలెక్టర్
☆ ఘనంగా ఐలమ్మ జయంతి కార్యక్రమం
☆ సత్తుపల్లిలో బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు
☆ కరకగూడెంలో పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య
☆ సుజాతనగర్లో గంజాయి పొట్లాలు స్వాధీనం
✓ ఉమ్మడి జిల్లాలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి ✓ పెద్దకోత్తపల్లి, కొల్లాపూర్ పోలీసు స్టేషన్ తనిఖీ చేసిన డీఐజీ
✓మిడ్జిల్ మండలంలో పర్యటించిన ఎంపీ డేకే అరుణ
✓ గద్వాల జిల్లాలో జీవో 25కు వ్యతిరేకంగా టీచర్స్ నిరసన మెమో
✓వెల్దండలో దేవగన్నేరు కవిత పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
✓వంగూరు మండలంలో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ సిబ్బంది మెమో
✓పలు మండలలో ఎంఇఓలను సన్మానించిన సిబ్బంది
బహిర్భూమికి వెళ్లిన మహిళపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఈనెల 14న జరగగా గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై విక్రం వివరాలిలా.. నవాబుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బొంత శివ అనే వ్యక్తి ఓ మహిళ బహిర్భూమికి వెళ్లిన సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సాగునీరు అందిస్తామని, రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కూసుమంచి మండలం పాలేరు జలాశయం నుంచి ఎడమ కాల్వ నీటి విడుదల ప్రక్రియను గురువారం పరిశీలించారు. ఎడమ కాల్వ కట్ట వైపు ఊట నీటిని 100 హెచ్.పీ. సామర్థ్యం గల 11 మోటార్ల ద్వారా సుమారు 200 క్యూసెక్కుల నీటిని కాలువలోకి ఎత్తి పోసే ప్రక్రియను ఈసందర్భంగా కలెక్టర్ పరిశీలించారు.
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి ఐజీ రమేశ్ ఐపీఎస్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసంబ ఐలమ్మ చేసిన పోరాటాలను వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు చట్టలకు లోబడి న్యాయం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్వర్యంలో నేర సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ప్రధాన కేసుల దర్యాప్తు వాటి పురోగతి, కేసుల్లోని నిందితుల అరెస్టులో ఆలస్యం అవ్వడంలో గల ప్రధాన కారణాలపై పోలీస్ కమిషనర్ స్టేషన్ వారిగా పోలీస్ అధికారులతో సమీక్ష జరిపారు.
మహబూబ్ నగర్లోని ఉమెన్స్ పోలీస్ స్టేషన్కు రిసెప్షన్ వర్టికల్ విధానంలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు లభించిందని జిల్లా ఎస్పీ జానకి ధరావత్ వెల్లడించారు. ఉమెన్ పీసీ జయమ్మను ఎస్పీ ఘనంగా సత్కరించారు. జయమ్మని ఆదర్శంగా తీసుకొని వర్టికల్ విభాగంలో అన్ని పోలీస్ స్టేషన్లు ప్రథమ స్థానంలో నిలవాలని కాంక్షించారు.
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా.. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా పోరాట శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.