Telangana

News July 21, 2024

సికింద్రాబాద్: బంగారు బోనం.. కవిత దూరం!

image

లిక్కర్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న నేపథ్యంలో మొదటిసారి BRS MLC కవిత సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జాగృతి ఏర్పాటు చేసి రాష్ట్ర సంస్కృతిని వ్యాప్తి చేసేలా ఏటా కవిత బంగారు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. కాగా ఈ సారి లష్కర్ బోనాల వేడుకలకు కవిత రాలేని పరిస్థితి ఉండడంతో పలువురు BRS నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News July 21, 2024

HYD: UPDATE.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం

image

చైతన్యపురి పీఎస్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని వేణుశ్రీ<<13674167>> ఆత్మహత్యాయత్నానికి<<>> పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కొత్తపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అంతకుముందు విద్యార్థిని సూసైడ్ నోట్ రాసింది. ‘రేపటి వరకు ఉంటానో.. ఉండనో తెలియదు డాడీ.. I’M SORRY’ నేను నా వరకు ట్రై చేస్తున్నా. కానీ మీ పేరు నిలబెట్టలేనేమో అని భయమేస్తుంది’ అని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

News July 21, 2024

మహబూబాబాద్: మత్స్యకారుడి వలలో 32 కిలోల భారీ చేప

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండం చెరువులో ఓ మత్స్యకారుడి వలకు 32 కిలోల భారీ చేప చిక్కింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చెరువు నుంచి పెద్ద చేపలు వాగులోకి ఎదురు వెళ్తున్నాయి. పిల్లి సతీష్ అనే మత్స్యకారుడు చెరువులోకి వాగు నీరు చేరే చోట వల ఏర్పాటు చేశాడు. వల ఎంతకూ రాకపోవడంతో ఇతరుల సాయంతో వలను ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో 32 కిలోల పెద్ద చేప చిక్కడంతో సతీశ్ ఆనందం వ్యక్తం చేశారు.

News July 21, 2024

HYD: UPDATE.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం

image

చైతన్యపురి పీఎస్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని వేణుశ్రీ <<13674116>>ఆత్మహత్యాయత్నానికి <<>>పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కొత్తపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అంతకుముందు విద్యార్థిని సూసైడ్ నోట్ రాసింది. ‘రేపటి వరకు ఉంటానో.. ఉండనో తెలియదు డాడీ.. I’M SORRY’ నేను నా వరకు ట్రై చేస్తున్నా. కానీ మీ పేరు నిలబెట్టలేనేమో అని భయమేస్తుంది’ అని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

News July 21, 2024

కామారెడ్డి: మూడో అంతస్తు పైనుంచి పడి మహిళ మృతి

image

భవనంలోని మూడో అంతస్తు పైనుంచి పడి మృతి చెందిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. పట్టణంలోని అశోక్‌నగర్‌లో ఉన్న ఓ భవనం మూడో అంతస్తు నుంచి పడి రాజేశ్వరి(50) మృతి చెందింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 21, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు విద్యుత్ శాఖ హెచ్చరిక

image

విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు జిల్లా విద్యుత్ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. తడిసిన కరెంట్ స్థంబాలను, విద్యుత్ లైన్‌కు తగిలే చెట్లను, తడి చేతులతో చార్జింగ్ పెట్టడం, స్విచ్ ఆన్ చేయడం వంటివి చేయవద్దని హెచ్చరించారు. అలాగే ఉతికిన బట్టలు ఇనుప తీగలపై ఆరవేయొద్దని సూచించారు. ఏమైనా విద్యుత్ సమస్య వస్తే సొంతంగా రిపేర్ చేయకుండా, విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.

News July 21, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లిలో 27.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా మొహ్మదాబాద్ 22.8 మి.మీ, నారాయణపేట జిల్లా గుండుమల్లో 20.5 మి.మీ, వనపర్తి జిల్లా మదనాపురంలో 21.5 మి.మీ, గద్వాల జిల్లా కేంద్రంలో 10.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News July 21, 2024

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు

image

పినపాక మండలం పోట్లపల్లికి చెందిన బడే నాగరాజు, పాయం నగేష్ ఇద్దరు కలిసి చేపలు పట్టేందుకు పొట్లపల్లి వాగు చెక్ డాం వద్దకు వెళ్లారు. చెక్ డ్యాంలోకి దిగి చేపలు పడుతుండగా వరద ప్రవాహం అధికం కావడంతో పాయం నగేష్ వరదలో కొట్టుకొని పోయాడు. బడే నాగరాజు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజేందర్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

News July 21, 2024

మార్చి నాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి: కోమటిరెడ్డి

image

వచ్చే మార్చినాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నార్కట్పల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న SLBC సొరంగం పనుల పూర్తికి రాష్ట్ర సీఎంతో మాట్లాడి రూ.2200 కోట్లు మంజూరు చేయించడమే కాకుండా, నిధుల విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ లో నిధులు ఏర్పాటు చేశామని తెలిపారు.

News July 21, 2024

శాకాంబరి అవతారంలో భద్రకాళి అమ్మవారు

image

శ్రీ భద్రకాళీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆదివారం భద్రకాళి అమ్మవారు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కాగా, అమ్మవారిని శాకాంబరి అవతారంలో దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు.