Telangana

News July 22, 2024

HYD: మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు సహకరించండి: సీఎం

image

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌ని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, వారి కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News July 22, 2024

జగిత్యాల: డిగ్రీ ఫెయిల్.. యువతి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. ఎస్సై అశోక్ వివరాల ప్రకారం.. రాయికల్ మండలం అయోధ్యకు చెందిన శివాని(18) డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఈనెల 6న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది.

News July 22, 2024

ఆ నిబంధ‌న‌ల వ‌ల్లే రుణ‌మాఫీ కావ‌ట్లేదు: హ‌రీశ్‌రావు

image

పంట‌ల రుణ‌మాఫీకి రేష‌న్ కార్డు, PM కిసాన్ నిబంధ‌న అమ‌లు చేస్తున్నారు. ఈ నిబంధ‌న‌ల వ‌ల్ల చాలా మంది రైతుల‌కు రుణ‌మాఫీ కావ‌ట్లేదు అని MLA హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. HYDలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రుణ‌మాఫీలో కోత‌లు పెట్టేందుకే రేష‌న్ కార్డు, PM కిసాన్ నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారని మండిప‌డ్డారు. క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కం ఆగిపోయిందని, ల‌క్ష మందికి పైగా చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు.

News July 22, 2024

HYD: ప్రజావాణికి 108 దరఖాస్తులు

image

హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా 108 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ వెంకటాచారి తెలిపారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నిర్మాణ శాఖ 78, ఎస్సీ డెవలప్‌మెంట్ 4, ఉపాధి కల్పన 3, దివ్యాంగుల సంక్షేమ శాఖ 4, సీపీవో 4 మిగతావి ఇతర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు ఆయన వివరించారు.

News July 22, 2024

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు బదిలీ

image

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు బదిలీ అయ్యారు. యాదాద్రి భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా రేపు ఆయన ఛార్జ్ తీసుకోనున్నారు. కొవిడ్ పాండమిక్‌లో వేలాది మంది పేషెంట్ల ప్రాణాలను తన మెడికల్ టీంతో కలిసి కాపాడిన ఆయన సేవ భావానికి అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఈరోజు తన బాధ్యతల నుంచి రిలీవ్ అయిన రాజారావును ఆసుపత్రి సిబ్బంది ఘనంగా సన్మానించి, వీడ్కోలు చెప్పారు.

News July 22, 2024

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు బదిలీ

image

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు బదిలీ అయ్యారు. యాదాద్రి భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా రేపు ఆయన ఛార్జ్ తీసుకోనున్నారు. కొవిడ్ పాండమిక్‌లో వేలాది మంది పేషెంట్ల ప్రాణాలను తన మెడికల్ టీంతో కలిసి కాపాడిన ఆయన సేవ భావానికి అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఈరోజు తన బాధ్యతల నుంచి రిలీవ్ అయిన రాజారావును ఆసుపత్రి సిబ్బంది ఘనంగా సన్మానించి, వీడ్కోలు చెప్పారు.

News July 22, 2024

బ్యాంకు లీకేజీ టార్గెట్‌ను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో ఉన్న బ్యాంకు లీకేజీ టార్గెట్‌ను త్వరితగతిన నెలల వారీగా అన్ని మండలాల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆదేశించారు. సోమవారం ఆయన DRDA సిబ్బందితో సమావేశమై మాట్లాడుతూ.. మహిళా శక్తిలో భాగంగా గుర్తించిన అన్ని రకాల యాక్టివిటీలు, గ్రౌండింగ్ కూడా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి చందర్, డిపిఎం రమేష్ , రవీందర్, సుధాకర్, వకుళ తదితరులు పాల్గొన్నారు.

News July 22, 2024

HYD: ప్రజావాణికి 108 దరఖాస్తులు

image

హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా 108 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ వెంకటాచారి తెలిపారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నిర్మాణ శాఖ 78, ఎస్సీ డెవలప్‌మెంట్ 4, ఉపాధి కల్పన 3, దివ్యాంగుల సంక్షేమ శాఖ 4, సీపీవో 4 మిగతావి ఇతర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు ఆయన వివరించారు.

News July 22, 2024

HYD: ప్రజావాణి విజ్ఞప్తులపై దృష్టి సారించాలి: ఆమ్రపాలి

image

గ్రేటర్ HYD పరిధి ప్రజావాణిలో వచ్చిన విన్నపాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంపై అధికారులు దృష్టి సారించాలని GHMC కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు సూచించారు. GHMC హెడ్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

News July 22, 2024

సికింద్రాబాద్ జాతరకు వెళ్లేవారికి ALERT

image

సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఆదివారం, సోమవారం 2 రోజుల వ్యవధిలో దాదాపు 25 సెల్‌ఫోన్లు, 15 గ్రాముల బంగారు గొలుసులు చోరీకి గురయ్యాయని బాధితులు మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 1,500 మంది పోలీసుల బందోబస్తు, 100కు పైగా CC కెమెరాలున్నా దొంగలు తమ చేతివాటాన్ని చూపారు.