Telangana

News September 6, 2024

జగిత్యాలలో అంగన్వాడీ కేంద్రాల వివరాలు

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జగిత్యాల, ధర్మపురి, మెట్‌పల్లి, మల్యాలలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో 1,065 అంగన్వాడీ కేంద్రాలుండగా ఇందులో 1,037 మెయిన్ కేంద్రాలు, 28 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో సుమారు 14,086 మంది గర్భిణులు, బాలింతలు, 34,897 మంది 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సులోపు చిన్నారులు, 15,907 మంది 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులు ఉన్నారు.

News September 6, 2024

జిట్టా కోరిక ఇదే..

image

తన ఫామ్ హౌస్‌లోనే కన్నుమూయాలనేదే జిట్టా బాలకృష్ణారెడ్డి చివరి కోరిక అని ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుంచి వెంటిలేటర్ మీద ఉంచి భువనగిరికి తరలిస్తున్నట్లు సమాచారం. కాగా జిట్టా మృతికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిట్టా అంత్యక్రియలు జరగనున్నాయి.

News September 6, 2024

కాళోజీ కళాక్షేత్రం అద్భుతంగా నిర్మించుకున్నాం: కేటీఆర్

image

HNK: పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి నారాయణరావు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. KCR ప్రభుత్వంలో ఆయన జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించుకున్నాం అని, హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రం అద్భుతంగా నిర్మించుకున్నామని, సెప్టెంబర్ 9న ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నామని పలు ఫోటోలను కేటీఆర్ ట్వీట్ చేశారు.

News September 6, 2024

HYD: ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురు

image

కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల కుదింపు, పెంపు వ్యవహారంలో ఇంజినీరింగ్ కాలేజీలకు గురువారం హైకోర్టులో చుక్కెదురైంది. ఇప్పటికే అడ్మిషన్ల షెడ్యూలు పూర్తైనందువల్ల.. జేఎన్టీయూ, ఏఐసీటీఈ అనుమతించిన సీట్లకు కౌన్సెలింగ్‌కు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. అనుబంధ పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 6, 2024

పాలమూరు: NH-44పై పెరుగుతున్న ప్రమాదాలు !

image

ఉమ్మడి పాలమూరులో గుండా వెళ్తున్న 44వ జాతీయ రహదారి దేశంలోనే ప్రత్యేకమైంది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్‌లో ప్రారంభమై.. తమిళనాడులోని కన్యాకుమారిలో ముగిస్తుంది. అయితే ఉమ్మడి జిల్లాలో బాలనగర్ నుంచి అలంపూర్ చౌరస్తా ఉన్న జాతీయ రహదారిలో ప్రతి ఏడాది ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత ఏడాది 85 ప్రమాదాలు జరిగ్గా.. 35 మంది చనిపోయారు. 463 మంది తీవ్రంగా గాయాలయ్యాయి. ఏడాది ఇప్పటికే 10 మందిపైగా చనిపోయారు.

News September 6, 2024

MDK: విషాదం.. బ్యాంకు స్లిప్పే సూసైడ్ లెటర్..!

image

HYD మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలో ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామ <<14033756>>రైతు సురేందర్ రెడ్డి<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆత్మహత్యకు గల కారణాలను ఆయన SBI బ్యాంకుకు సంబంధించిన స్లిప్పుపై రాశాడు. ‘చిట్టాపూర్ బ్యాంకులో రుణమాఫీ కాలేదు, నా చావుకు కారణం మా అమ్మ.. చిట్టాపూర్ బ్యాంకు’ అని రాసి ఉరేసుకుని చనిపోయాడు.

News September 6, 2024

HYD: విషాదం.. బ్యాంకు స్లిప్పే సూసైడ్ లెటర్..!

image

HYD మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలో ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామ <<14033756>>రైతు సురేందర్ రెడ్డి<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆత్మహత్యకు గల కారణాలను ఆయన SBI బ్యాంకుకు సంబంధించిన స్లిప్పుపై రాశాడు. ‘చిట్టాపూర్ బ్యాంకులో రుణమాఫీ కాలేదు, నా చావుకు కారణం మా అమ్మ.. చిట్టాపూర్ బ్యాంకు’ అని రాసి ఉరేసుకుని చనిపోయాడు.

News September 6, 2024

HYD: విషాదం.. బ్యాంకు స్లిప్పే సూసైడ్ లెటర్..!

image

HYD మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలో ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామ <<14033756>>రైతు సురేందర్ రెడ్డి<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆత్మహత్యకు గల కారణాలను ఆయన SBI బ్యాంకుకు సంబంధించిన స్లిప్పుపై రాశాడు. ‘చిట్టాపూర్ బ్యాంకులో రుణమాఫీ కాలేదు, నా చావుకు కారణం మా అమ్మ.. చిట్టాపూర్ బ్యాంకు’ అని రాసి ఉరేసుకుని చనిపోయాడు.

News September 6, 2024

ఎల్లారెడ్డి హాస్టల్‌లో రాళ్లతో దాడి చేసుకున్న విద్యార్థులు

image

ఎల్లారెడ్డి గురుకుల హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొంతకాలంగా విద్యార్థుల మధ్య జరుగుతున్న గొడవ గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 6, 2024

ఫామ్‌‌‌ హౌస్‌లో జిట్టా అంత్యక్రియలు

image

తెలంగాణ మలిదశ ఉద్యమకారులు జిట్టా బాలకృష్ణా రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. భువనగిరి శివారులోని మగ్దుంపల్లి రోడ్డులోని ఆయన ఫామ్ హౌస్‌లో నాలుగు గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కాసేపట్లో HYD నుంచి మృతదేహాన్ని ఫామ్ హౌస్‌కు తీసుకురానున్నారు. మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన మృతదేహాన్ని చూడడానికి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ముఖ్యులు రానున్నారు.