India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
> ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరిపిచ్చిన వానలు
> వరదలకు మూడో ప్రమాద హెచ్చరిక దిశగా పెరుగుతున్న గోదావరి
> లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు
> ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
> భద్రాద్రి జిల్లాకు రానున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
> భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
> నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ఇరు జిల్లాల కలెక్టర్లు
HYD మహానగరంలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్లో 90 రోజుల్లో ఏకంగా 200 కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మే నుంచి పరిశీలిస్తే.. ప్రతి నెలా పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. జ్వరంతో ఆసుపత్రికి 350 మందికి పైగా వస్తుండగా ఓపీ ఇస్తున్నారు. మరోవైపు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లోనూ జ్వరంతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. జాగ్రత్త..!
రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశమున్నట్లు పేర్కొంది. ఈమేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. కాగా, ఇప్పటికే కురిసిన వర్షాలకు చాలా చోట్ల వాగులు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
HYD మహానగరంలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్లో 90 రోజుల్లో ఏకంగా 200 కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మే నుంచి పరిశీలిస్తే.. ప్రతి నెలా పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. జ్వరంతో ఆసుపత్రికి 350 మందికి పైగా వస్తుండగా ఓపీ ఇస్తున్నారు. మరోవైపు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లోనూ జ్వరంతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. జాగ్రత్త..!
గ్రేటర్ HYDలో కాలుష్య భూతం మెల్లమెల్లగా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం.. PM 2.5 వ్యాసం కలిగిన సూక్ష్మ ధూళికణాలు గత 4 నెలల రికార్డులను పరిశీలిస్తే జూపార్కు ప్రాంతాల్లో 115, పాశమైలారం 104, బాలానగర్ 101, ఉప్పల్ 89, జీడిమెట్ల 107, ప్యారడైజ్ 96 మైక్రాన్లుగా నమోదైంది. సాధారణంగా 40 మైక్రాన్ల లిమిట్ దాటితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
గ్రేటర్ HYDలో కాలుష్య భూతం మెల్లమెల్లగా పెరుగుతోన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం.. PM 2.5 వ్యాసం కలిగిన సూక్ష్మ ధూళికణాలకు సంబంధించి గత 4 నెలల రికార్డులను పరిశీలిస్తే జూపార్కు ప్రాంతంలో 115, పాశమైలారం 104, బాలానగర్ 101, ఉప్పల్ 89, జీడిమెట్ల 107, ప్యారడైజ్ 96 మైక్రాన్లుగా నమోదైంది. సాధారణంగా 40 మైక్రాన్ల లిమిట్ దాటితే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
ప్రజావాణి కార్యక్రమనికి మొత్తం 80 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లతతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో భూ సమస్యలపై 38 దరఖాస్తులు, డిఆర్డిఓ 12, డియంహెచ్ఓ 8, ఇతర శాఖలకు సంబంధించి 22, మొత్తం 80 దరఖాస్తులు అందాయని తెలిపారు.
లక్ష్య సాధనకు ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కేంద్రంలో గ్రూప్-1 ఉద్యోగార్థుల శిక్షణా తరగతుల తీరును పరిశీలించారు. పోటీ పరీక్షల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి కలెక్టర్ అవగాహన కల్పించారు. ఎప్పుడు శ్రమపై దృష్టి పెట్టాలని, కచ్చితంగా ఫలితం వస్తుందన్నారు.
ప్రజలు ఎలాంటి పైరవీలు చేయకుండా స్వచ్ఛందంగా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ జానకి అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సంబంధిత మండల ఎస్సైకు ఫోన్ చేసి ఫిర్యాదుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వేగవంతంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఫిర్యాదుదారులతో సీఐ, ఎస్సైలు మర్యాదపూర్వకంగా మెలగాలని అన్నారు.
HYD చుట్టూ RRR నిర్మాణాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మిస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగానే భారత్ మాల-1లో ఉత్తర భాగం, భారత్ మాల-2ప్రాజెక్టులో దక్షిణ భాగం అభివృద్ధి చేయాలని భావించినా దక్షిణ భాగం నిర్లక్ష్యానికి గురైంది. దీంతో ప్రస్తుతం కేంద్రం తాజాగా విజన్-2047లో చేర్చినట్లుగా సమాచారం. దక్షిణభాగం ఆమనగల్, షాద్నగర్,చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర ఉండనుంది.
Sorry, no posts matched your criteria.