India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జీడిమెట్ల డివిజన్ పరిధి వెన్నెలగడ్డలో నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(STP) పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట, కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్తో కలిసి సోమవారం పరిశీలించారు. STP పరిసరాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఈ నెల 27న CM రేవంత్ రెడ్డి ఈ ప్లాంటును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.
తెలంగాణ సాధన కోసం తాను సాగించిన పోరాటాలలో దాశరథి అందించిన స్ఫూర్తి ఇమిడి ఉన్నదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం, అభ్యుదయ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా వారందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టే దాశరథి కవిత్వం సాహిత్యం తెలంగాణ భవిష్యత్తు తరాలకు నిత్య స్ఫూర్తిదాయకమని కేసీఆర్ అన్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో సోమవారం స్వామివారు ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. బేడా మండలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జీడిమెట్ల డివిజన్ పరిధి వెన్నెలగడ్డలో నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(STP) పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట, కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్తో కలిసి సోమవారం పరిశీలించారు. STP పరిసరాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఈ నెల 27న CM రేవంత్ రెడ్డి ఈ ప్లాంటును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.
నల్గొండ: కేతపల్లి మండలం బొప్పారం గ్రామం నుంచి కేతేపల్లి వరకు మూసి సుందరీకరణ, పర్యాటక కేంద్రంగా గుర్తించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మధిర: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం AICC అగ్రనేత ప్రియాంక గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్తో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ప్రియాంక గాంధీని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తదితర అంశాలను ప్రియాంక గాంధీకి వారు వివరించారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పంటల సాగు ఊపందుకుంది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయభూములు తడిసి విత్తనాలు వేసుకోవడానికి అనుకూలంగా మారాయి. దీంతో జిల్లాలో నల్లరేగడి భూములు అధికంగా ఉండడంతో రైతులు పత్తి, మొక్కజొన్న, తదితర పంటలు సాగు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్నిచోట్ల రైతులు భూమిని దున్ని విత్తనాలు నాటుతున్నారు.
మహబూబ్నగర్లో ఐడీవోసీ కార్యాలయం ఉద్యోగి మృతిచెందారు. ఎస్టీవో మోహన్ రాజ్ విధులకు హాజరవుతుండగా నీరసంతో కిందపడి చనిపోయినట్లు తెలిసింది. మృతుడు మోహన్ రాజ్ స్వస్థలం వనపర్తి జిల్లా. ఘటనకు సంబంధించి మరిన్ని సమాచారం తెలియాల్సి ఉంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కి నేడు మిర్చి తరలి రాగా కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. తేజ మిర్చి శుక్రవారం క్వింటాకు రూ.17, 500 పలకగా.. నేడు రూ.17,800 పలికింది. అలాగే 341 రకం మిర్చి శుక్రవారం రూ.15,200 పలకగా.. నేడు రూ.14,000 ధర వచ్చింది. వండర్ హాట్ (WH) మిర్చికి రూ.13,500 ధర రాగా.. నేడు రూ.15,000 వచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో భారీ వర్షాలకు ధ్వంసం అయిన పెద్దవాగు ప్రాజెక్టును ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజ్, జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.