India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆరు రోజులుగా సింగరేణి వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో సుమారు 5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. మొత్తం 11 ఏరియాల్లో రోజుకు 2 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 1.10 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. దీంతో ఆరు రోజుల్లో సుమారు 5 లక్షల టన్నుల ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. సింగరేణి వ్యాప్తంగా 18 ఓసీల్లో ఆరు రోజులు 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబికి అంతరాయం వాటిల్లింది.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్ లో ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మన రాష్ట్రానికి ముఖ్యమైన సాంస్కృతిక, వారసత్వ ప్రాంతాల పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి ఇలాంటి సమావేశాలు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.
మెదక్ పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. వైద్య కళాశాలను క్షుణ్ణంగా పరిశీలించి మెడికల్ సూపరింటెండెంట్కు సూచనలు, ఆదేశాలు చేశారు. వైద్య కళాశాలకు డాక్టర్లు, సిబ్బందిని నియమించుకోవడం కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్ రవీంద్ర కుమార్, సూపరింటెండెంట్ చంద్ర శేఖర్ పాల్గొన్నారు.
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున: ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. రైతులు నాణ్యమైన, తేమలేని సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
రైతు రుణమాఫీ కానీ రైతుల కోసం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వ్యవసాయ శాఖ అధికారుల నెంబర్లను జిల్లా అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఖమ్మం జిల్లా అధికారి వినయ్ కుమార్ (ఏవో) 7288894281, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారి (ఏవో) 7288894262 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని జిల్లా అధికారులు సూచించారు. ఈ విషయాన్ని రైతులు గమనించి.. సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
జిల్లాలోని అర్హులైన రైతులందరితో రైతు బీమా చేయించాలని, నెలాఖరు వరకురైతు బీమా రెన్యువల్స్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం నుండి ప్రజాపాలన సేవా కేంద్రాలను అన్ని ఎంపిడిఓ కార్యాలయాలు, మున్సిపాలిటీలలో పకడ్బందీగా పనిచేసేలా చూడాలని ఎంపీడీవోలను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం మధ్యాహ్నానికి 19.185 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 18,518 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తోంది. మిషన్ భగీరథకు 63 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాలకు 108 క్యూసెక్కుల నీటిని చేశారు.
✓సనత్ నగర్: కరెంటు షాక్ తగిలి ముగ్గురు మృతి
✓సికింద్రాబాద్: మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి ప్రభాకర్
✓గ్రేటర్ HYD పరిధిలో త్వరలో రూ.5 లకే టిఫిన్..!
✓గ్రేటర్ HYDలో DRF నూతన టెక్నాలజీ
✓అన్ని జిల్లాల్లో BCG టీకాతో క్షయ వ్యాధికి చెక్
✓సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క
అంగన్వాడీలను చిన్నారులకు మరింత చేరువ చేసేందుకు సర్కార్ నడుం బిగించింది. అందులో భాగంగా ఈ కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా అప్ గ్రేడ్ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇది అమలు అయితే ఈ సెంటర్లు ఇకపై ప్రైవేట్ ప్లే స్కూల్స్ కు దీటుగా ప్రీ స్కూల్ విద్యను అందించనున్నాయి. సీఎం నిర్ణయంతో ఇన్ని రోజులు పౌష్టికాహారాన్ని మాత్రమే అందించిన ఈ కేంద్రాలు ఇకపై పిల్లలకు మూడో తరగతి వరకు ప్రాథమిక విద్యను అందించనున్నాయి.
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సుల లేఖను పరిగణనలోకి తీసుకోవాలని 15 రోజుల క్రితం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని దేవదాయ శాఖకు సూచించినట్లు ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు.
Sorry, no posts matched your criteria.