Telangana

News July 21, 2024

MBNR: ఆపిల్ ఫోన్‌ కోసం హత్యాయత్నం

image

ఆపిల్ ఫోన్ దక్కించుకునేందుకు ఓవ్యక్తి ఏకంగా హత్య చేయబోయిన ఘటన MBNRలో జరిగింది. పోలీసుల వివరాలు.. వీరన్నపేటకు చెందిన సయ్యద్‌మస్తాన్, టీడీగుట్ట ఫైర్‌స్టేషన్‌కు చెందిన అక్తర్ ఫ్రెండ్స్. ఈనెల 12న అక్తర్ ఫోన్‌ను ముస్తాన్ తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఫోన్ తీసుకునేందుకు ముస్తాన్ ఇంటికెళ్లగా కత్తితో పొడిచాడు. అక్తర్‌ను ముళ్లపొదల్లో వేయడానికి బైక్‌పై తీసుకెళ్లి భయంతో క్లాక్ టవర్ వద్ద వదిలి పరారయ్యాడు.

News July 21, 2024

సంగారెడ్డి: రేపు ప్రజావాణి కార్యక్రమం

image

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో 22వ తేదీన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా అధికారులు వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 21, 2024

మెదక్: గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 3,703 మంది మల్టీపర్పస్ ఉద్యోగుల వేతనాల కోసం రూ. 24.89 కోట్ల నిధులు విడుదలయ్యాయి. నిధులను విడుదల చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాకు రూ. 11,75,72,000, సంగారెడ్డి జిల్లాకు రూ. 8,09,97,000, మెదక్ జిల్లాకు రూ. 5,03,97,500 విడుదలయ్యాయి.

News July 21, 2024

నల్గొండ: గుండెపోటుతో సూపరిటెండెంట్ మృతి

image

నార్కట్‌పల్లి మండల ఎంపీడీవో కార్యాలయ సూపరిటెండెంట్ కోమటి ప్రదీప్ గుండెపోటుతో మరణించారు. బదిలీ ప్రక్రియలో భాగంగా కౌన్సెలింగ్ కోసం జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్లి అనంతరం హైదరాబాదులో నివాసానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ప్రదీప్ వాంతులు చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారని సన్నిహితులు చెప్పారు.

News July 21, 2024

నిజామాబాద్: ఆరు నెలల్లో నలుగురు చిన్నారుల కిడ్నాప్

image

జిల్లాలో చిన్నారుల కిడ్నాప్‌లు కలకలం రేపుతున్నాయి. తాజాగా NZB GGHలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. కాగా జనవరి 30న మాలపల్లికి చెందిన ఏడేళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి HYDలో విక్రయించేందుకు చూశారు. ఫిబ్రవరిలో ఆర్మూర్ బస్టాండ్‌లో ఓ మహిళ ఏడేళ్ల బాలుడిని, అదే నెల 4న నగర శివారులో ఓ దంపతులు రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు. అయితే ఈ కేసులను పోలీసులు ఛేదించి చిన్నారులను కాపాడారు.

News July 21, 2024

MBNR: నవోదయ ప్రవేశాలకు దరఖాస్తులు

image

బిజినేపల్లి మండలం వట్టెంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26వ సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష 18, జనవరి, 2025న నిర్వహిస్తామని తెలిపారు.

News July 21, 2024

HYD: భార్య, కుమార్తెను చంపి సూసైడ్

image

సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం వెలుగు చూసింది. భార్య స్వప్నతో పాటు 10 నెలల కుమార్తెను గణేశ్ అనే వ్యక్తి హతమార్చాడు. అనంతరం అల్వాల్‌లోని రైల్వే ట్రాక్ వద్ద పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి చెప్పి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలను గాంధీ మార్చురికీ పోలీసులు తరలించారు. మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. కాగా భార్యపై అనుమానంతోనే గణేశ్ ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

News July 21, 2024

జిల్లాలో నిండుకుండల్లా చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టులు

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వివిధ చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వైరా ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుండగా, లంకాసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పోస్తోంది. సత్తుపల్లి నియోజకవర్గంలో దాదాపు అన్ని చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. జలవనరులశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1,054 చెరువులు, చెక్ డ్యామ్లు ఉండగా శనివారం వరకు 385 చెరువులు, చెక్ డ్యాంలు నిండాయి.

News July 21, 2024

HYD: భార్య, కుమార్తెను చంపి సూసైడ్

image

సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం వెలుగు చూసింది. భార్య స్వప్నతో పాటు 10 నెలల కుమార్తెను గణేశ్ అనే వ్యక్తి హతమార్చాడు. అనంతరం అల్వాల్‌లోని రైల్వే ట్రాక్ వద్ద పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి చెప్పి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలను గాంధీ మార్చురికీ పోలీసులు తరలించారు. మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. కాగా భార్యపై అనుమానంతోనే గణేశ్ ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

News July 21, 2024

క్షేత్రస్థాయి పర్యటనలు.. ఆకస్మిక తనిఖీలు!

image

క్షేత్రస్థాయి పర్యటనలతో కలెక్టర్ నారాయణరెడ్డి జోరు పెంచారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలు, NLGలోని పలు శాఖల కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ఏళ్లుగా వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడిన బాలసదనం, సఖి, శిశు గృహాల్లో మౌలిక సదుపాయాలకు గత కలెక్టర్ హరిచందన కృషి చేయగా.. ఆ సంప్రదాయాన్ని ప్రస్తుత కలెక్టర్ కొనసాగిస్తున్నారు.