Telangana

News September 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
✒కల్వకుర్తి: తండ్రి మందలించాడని ఉరేసుకున్న బాలుడు
✒దేవరకద్ర MLAకు పితృవియోగం
✒పలుచోట్ల భారీ వర్షాలు
✒GDWL:విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి
✒పండుగలను శాంతియుతంగా జరుపుకోండి:CIలు
✒ప్రతి పోలింగ్ బూత్‌కు 200 సభ్యత్వాలు చేర్పించాలి:BJP
✒సీజనల్ వ్యాధులపై అవగాహన
✒మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
✒ఓటర్ల జాబితా పై ప్రత్యేక ఫోకస్

News September 5, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> WGL: రాయపర్తిలో దొంగల బీభత్సం
> BHPL: గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
> MLG: పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురి అరెస్ట్
> BHPL: చెరువులో పడి పశువుల కాపరి మృతి
> JN: ఎమ్మార్వో ఆఫీస్ ముందు పురుగు మందుతో మహిళా ఆందోళన
> MLG: జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం
> HNK: స్వగ్రామానికి చేరుకున్న మావోయిస్టు మృతదేహం
> WGL: బాలికను వేధించిన కేసులో యువకుడిపై పోక్సో కేసు

News September 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్..

image

> WGL: WAY2NEWS స్పెషల్.. ఓరుగల్లు కీర్తి, వరంగల్ దీప్తి..
> MHBD: ఆర్గానిక్ పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు: త్రిపుర గవర్నర్
> WGL: రేపు నిర్వహించే జాబ్ మేళా వాయిదా
> JN: కొమురవెల్లి దేవస్థానానికి మహిళా అఘోర
> HNK: జిల్లా కేంద్రంలో సందడి చేసిన గంగవ్వ
> WGL: దీప్తి జీవాంజి ఫస్ట్ కోచ్ మృతి
> BHPL: ఉమ్మడి జిల్లాలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

News September 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.
@ రామడుగు మండలంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం.
@ జగిత్యాల ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్.
@ ఎల్లారెడ్డిపేటలో ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్.
@ సిరిసిల్ల, జగిత్యాల కలెక్టరేట్లో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం.
@ కథలాపూర్, కొడిమ్యాల మండలాలలో పర్యటించిన జగిత్యాల కలెక్టర్.

News September 5, 2024

దోమకొండ: కారు ఢీకొని పాదచారుడు మృతి

image

కారు ఢీకొని పాదచారుడు మృతి చెందాడు. ఈఘటన దోమకొండ మండలంలో గురువారం జరిగింది. SI ఆంజనేయులు వివరాలిలా.. దోమకొండ వాసి గజం సత్యం (55) కూలీ పని నిమిత్తం అంచనూరు గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే సమయంలో వేగంగా వెళ్తున్న కారు అతనిని ఢీ కొట్టింది. తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ..మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.

News September 5, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యంశాలు

image

☆ గత నెలలో డయల్-100 కు 4,119 కాల్స్: పోలీస్ కమిషనర్
☆ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి: భద్రాద్రి జిల్లా ఎస్పీ
☆ వరద బాధితులకు ఎంపి పార్థసారధి రెడ్డి కోటి విరాళం
☆ ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
☆ వరద ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ బలరాం నాయక్
☆ ఖమ్మం వరద బాధితులకు మాజీ మంత్రి హరీష్ రావు సహాయం
☆ ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

News September 5, 2024

HYD: ఇబ్రహీంపట్నంలో ముగ్గురు ఆత్మహత్య

image

ఇబ్రహీంపట్నంలో విషాద ఘటన వెలుగుచూసింది. పెద్ద చెరువులో దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులు హస్తినాపురానికి చెందిన మంగ కుమారి(తల్లి), శరత్(కుమారుడు), లావణ్య(కూతురు)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. లావణ్య మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.

News September 5, 2024

మణుగూరుకు మావోయిస్టు మృతదేహాలు తరలింపు

image

కరకగూడెం మండల పరిధిలో ఇవాళ జరిగిన పోలీసులు- మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను మణుగూరు వంద పడకల ఆసుపత్రికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తరలించారు. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.

News September 5, 2024

HYD: ఇబ్రహీంపట్నంలో ముగ్గురు ఆత్మహత్య

image

ఇబ్రహీంపట్నంలో విషాద ఘటన వెలుగుచూసింది. పెద్ద చెరువులో దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులు హస్తినాపురానికి చెందిన మంగ కుమారి(తల్లి), శరత్(కుమారుడు), లావణ్య(కూతురు)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. లావణ్య మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.

News September 5, 2024

ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం

image

భద్రాది కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు కమిటీ డివిజన్ కమిటీ ఆజాద్ పేరుతో ములుగు జిల్లాలో మావోయిస్టు లేక కలకలం రేపుతుంది. రఘునాధపాలెంలోనే జరిగిన ఎన్కౌంటర్ విప్లవ ద్రోహుల పనేనని, మావోయిస్టు పార్టీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ఒకటే ఎజెండా అన్నారు. ఈ ఎన్కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్ కౌంటర్‌కు నిరసనగా ఈనెల 9న భద్రాద్రి జిల్లా బందుకు పిలుపునిచ్చారు.