Telangana

News September 1, 2025

మహబూబ్ నగర్ SP జానకి కీలక ప్రకటన

image

శాంతి భద్రతల పరిరక్షణ కోసం మహబూబ్ నగర్ జిల్లాలో సెప్టెంబర్ 01 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ 30 యాక్ట్ సెక్షన్ అమలులో ఉంటుందని SP జానకి వెల్లడించారు. ప్రజాసంఘాలు, యూనియన్లు, రాజకీయ పార్టీలు పోలీస్ అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

News September 1, 2025

HYD: డ్రగ్స్ వ్యవహారం.. మహీంద్రా యూనివర్సిటీ కీలక నిర్ణయం

image

HYD మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నట్లు కేసు నమోదు కావడంతో వర్సిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సెక్యూరిటీని పెంచారు. ఇష్టానుసారం విద్యార్థులు తిరగకుండా కట్టడి చేశారు. ముఖ్యంగా రాత్రి 10 గంటల తరువాత ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్స్‌ను అనుమతించబోమని, అంతేకాక క్యాంపస్‌లోకి ఐడీ కార్డు లేనిదే అడుగుపెట్టనివ్వడం లేదని సెక్యూరిటీ అధికారి తెలిపారు.

News September 1, 2025

HYD: NAARM ఏర్పాటై నేటికి 50 ఏళ్లు..!

image

వ్యవసాయ రంగంలో కీలక పరిశోధనలకు నిలయమైన NAARM (నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్) నగరంలో ఏర్పాటై ఈరోజుకు 50 ఏళ్లయింది. రాజేంద్రనగర్‌లో 1976 సెప్టెంబర్ 1న నార్మ్ ఏర్పాటు చేశారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో నార్మ్ శాస్త్రవేత్తలకు శిక్షణ కూడా ఇస్తోంది. అగ్రికల్చర్‌కు NAARM ఒక దిక్సూచి అని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ గోపాల్‌లాల్ పేర్కొన్నారు.

News September 1, 2025

వీధి కుక్కలపై అధికారులతో కలెక్టర్ కాన్ఫరెన్స్

image

వీధి కుక్కల వల్ల కలిగే నష్టాలు, వీధి కుక్కల స్టెరిలైజేషన్, వాక్సినేషన్, భర్త కంట్రోల్ తదితర అంశాలపై ప్రజలకు, విద్యార్థులకు అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఇతర శాఖల సంబంధిత అధికారులతో ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు సమన్వయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుక్కలన్నింటికీ వ్యాక్సినేషన్ వేయించాలని సూచించారు.

News September 1, 2025

KNR: ‘పెన్షన్ అనేది బిక్ష కాదు, ఉద్యోగుల హక్కు’

image

జిల్లా కలెక్టరేట్ ఎదురుగా KNR ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ పెన్షన్ విద్రోహక దినం సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, టిషర్ట్లు ధరించి నిరసన కార్యక్రమంలో‌ పాల్గొన్నారు. JAC చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పెన్షన్ అనేది బిక్ష కాదు, ఉద్యోగుల హక్కు అని అన్నారు. 30–35 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన తర్వాత వృద్ధాప్యంలో వారికి ఇచ్చే పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సహాయం కాదన్నారు.

News September 1, 2025

HYD: ‘పార్టీ మారిన విషయం’పై 10 రోజుల్లో చెబుతాం.. సమయమివ్వండి: MLAలు

image

బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేల విషయంపై కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై పూర్తి వివరణ ఇచ్చేందుకు తమకు పది రోజుల టైం కావావాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పీకర్‌ను అసెంబ్లీ ఆవరణలోని కార్యాలయంలో కలిసి కోరారు.

News September 1, 2025

SRSP UPDATE

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టు 25 స్పిల్వే వరద గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడిచిపెట్టారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 1.30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా వరద గేట్లు, ఇతర కాల్వల ద్వారా 1,26,853 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు.

News September 1, 2025

HYD: ఎర్రమంజిల్‌లో మంత్రి సీతక్క సమావేశం

image

HYD ఎర్రమంజిల్‌లోని పంచాయతీరాజ్ శాఖ సమావేశ మందిరంలో మంత్రి సీతక్క అధికారులతో ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గాల్లో జరుగుతున్న రోడ్లు, వంతెనల నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, పీఆర్ అధికారులు పాల్గొన్నారు.

News September 1, 2025

ఖైరతాబాద్ మహాగణపతి భక్తులు.. తగ్గేదేలే..!

image

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. తండోపతండాలుగా ఏకదంతుడి మహారూపం చూడటానికి వస్తున్నారు. దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు రద్దీగా మారుతున్నాయి. శనివారం 2 లక్షల మంది, ఆదివారం 4 లక్షల మంది దర్శించుకున్నారు. ఈ సంఖ్య ఈరోజు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఖైరతాబాద్‌కు వచ్చే బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసులు కిటకిటలాడుతున్నాయి.

News September 1, 2025

HYD: బతుకమ్మ వేడుకలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

image

తెలంగాణ సంప్రదాయ పండుగైన బతుకమ్మ వేడుకల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యంగా HYD హుస్సేన్ సాగర్‌లో ఫ్లోటింగ్ బతుకమ్మ వేడుకల పేరుతో సరికొత్త కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రముఖులను కూడా వేడుకల్లో భాగం చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు మంత్రి జూపల్లి త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.