India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్లో వర్షపునీరు చేరి నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం 513.21 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు, రేపు భారీ వర్షాల నేపథ్యంలో నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తున్నా లేదా తాగుతున్నట్లు సమాచారం ఇస్తే నగదు బహుమతి అందజేస్తామని సీపీ అంబర్ కిషోర్ ఝూ తెలిపారు. సమాచారం తెలియజేసినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. పెద్ద మొత్తంలో గంజాయి సమాచారం ఇచ్చిన వారికి భారీగా నగదు బహుమతి అందజేస్తామన్నారు. 87125 84473 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
☞కొడంగల్:17,975 <<13659589>>రైతులకు <<>>99.84 కోట్లు☞అచ్చంపేట:15.990 రైతులకు 92.44 కోట్లు☞కొల్లాపూర్:16,982 రైతులకు 82.81 కోట్లు☞వనపర్తి:16,071 రైతులకు 83.84 కోట్లు☞దేవరకద్ర:16,621 రైతులకు 87.94 కోట్లు☞కొల్లాపూర్:16,982 రైతులకు 91.58 కోట్ల రూపాయలు రుణమాఫీ అయ్యాయి. ఇందులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి స్థానంలో కల్వకుర్తి, మహబూబ్ నగర్ నియోజకవర్గం చివరి స్థానంలో నిలిచింది. – SHARE IT
తొలి విడతలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా రూ.లక్ష లోపు <<13659616>>రుణమాఫీ <<>>వివరాలు..
☞MBNR:5,829 రైతులకు 30.85 కోట్లు
☞NGKL:14,348 రైతులకు 81.75 కోట్లు
☞జడ్చర్ల:14,349 రైతులకు 80.09 కోట్లు
☞మక్తల్:12,107 రైతులకు 72.75 కోట్లు
☞షాద్ నగర్:13,462 రైతులకు 70.31 కోట్లు
☞గద్వాల్:10,099 రైతులకు 61.28 కోట్లు
☞NRPT:14,774 రైతులకు 82.24 కోట్లు
☞కల్వకుర్తి:18,196 రైతులకు 103.02 కోట్లు – SHARE IT
EMR గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20న EMT ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ జనార్ధన్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు 20 నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ ఏసీబీకి చిక్కాడు. రూ. 25వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. మత్స్యశాఖ సోసైటి సభ్యుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో వారు ఏసీబీ అధికారలకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐపీఎస్ల బదిలీల్లో అప్పటి వరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. బదిలీ అయినప్పటి నుంచి సెలవులో ఉన్న ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐపీఎస్ల బదిలీల్లో అప్పటి వరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. బదిలీ అయినప్పటి నుంచి సెలవులో ఉన్న ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
పెద్దపల్లి ప్రజలకు ఆర్టీసీ డిపో ఏర్పాటు 30 ఏళ్లుగా కలగానే మిగిలింది. జిల్లాగా ఏర్పడిన తర్వాత కూడా ఇంకా సాధ్యం కాలేదు. డిపో ఏర్పాటుకు పెద్దపల్లిలో అందుబాటులో ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడంపై పాలకులు దృష్టి సారించడం లేదు. కాగా ప్రభుత్వం రెండు రోజుల క్రితం మోత్కూరు ఆర్టీసీ డిపో ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరి పెద్దపల్లికి ఎప్పుడు వస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ.7,245 పలికింది. గత వారం రూ.7,400 పలికిన పత్తి ధర.. ఈ వారం క్రమంగా తగ్గడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వారంలో పత్తి ధరలు చూస్తే.. సోమవారం రూ.7,310, మంగళవారం రూ.7,350, బుధవారం మార్కెట్ బంద్, గురువారం రూ.7,235కి పలికాయి.
Sorry, no posts matched your criteria.