Telangana

News July 19, 2024

వరంగల్ మార్కెట్‌లో క్వింటా పత్తి ధర రూ.7,245

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా పత్తి ధర రూ.7,245 పలికింది. గత వారం రూ.7,400 పలికిన పత్తి ధర.. ఈ వారం క్రమంగా తగ్గడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వారంలో పత్తి ధరలు చూస్తే.. సోమవారం రూ.7,310, మంగళవారం రూ.7,350, బుధవారం మార్కెట్ బంద్, గురువారం రూ.7,235కి పలికాయి.

News July 19, 2024

చిరుతదాడి నుంచి తప్పించుకున్న లైన్‌మన్

image

ఖిల్లాఘనపురం మండలంలోని మామిడిమాడ సబ్‌స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్‌మన్ పరమేశ్వర్ తృటిలో చిరుతదాడి నుంచి తప్పించుకున్నాడు. గురువారం విధుల్లో భాగంగా జంమాయపల్లి నుంచి మామిడిమాడ తండాకు వస్తుండగా మార్గమధ్యలో చిరుత ఆయన దగ్గరకు వస్తూ కనిపించింది. ఒక్కసారిగా తన బైక్ వేగం పెంచి పులి నుంచి తప్పించుకొని తండాకు వచ్చాడు. ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకుని తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

News July 19, 2024

వెంకటాపురం-వాజేడు: ఆకట్టుకుంటున్న గడి చెరువు జలపాతం

image

ములుగు జిల్లా వెంకటాపురం-వాజేడు మండలాల సరిహద్దు అభయారణ్యంలోని మహితాపురం, బొల్లారం గ్రామాల సమీపంలో ఉన్న గడి చెరువు జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఎత్తయిన గుట్టలపై నుంచి జాలువారుతున్న ఈ జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. గుట్టలపై నుంచి జాలువారుతున్న జలధారలను తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. మరి మీరు ఈ జలపాతం చూశారో కామెంట్ చేయండి.

News July 19, 2024

నిజాంసాగర్: ట్రాక్టర్ నడిపి రైతులలో జోష్ పెంచిన MLA తోట

image

నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో రైతు రుణమాఫీ సంబరాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు గురువారం నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతులలో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ప్రదీప్ పటేల్, పార్టీ మండల అధ్యక్షుడు మల్లికార్జున్, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

News July 19, 2024

ఆదిలాబాద్: కాంగ్రెస్ నుంచి 16 మంది సస్పెన్షన్

image

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 16 మంది నాయకులపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు వారిపై సస్పెన్షన్ విధిస్తూ పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. వేటుకు గురైన వారిలో ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. వారితో పాటు పార్టీ క్రమశిక్షణ చర్యల కింద పలువురు నాయకులకు సైతం బహిష్కరించినట్లు పేర్కొన్నారు.

News July 19, 2024

బాసర: నేటి నుంచి గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభం

image

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ఆలయం పక్షాన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ విజయరామారావు ఓ ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి చివరి రోజు గురుపౌర్ణమి ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.

News July 19, 2024

గుట్టలుగా గంజాయి.. ధ్వంసం చేసే దారేదీ !

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 13 ఎస్హెచ్ఓ స్టేషన్లు ఉన్నాయి. అన్నీ ఖమ్మంలో ఉన్న ఉప కమిషనర్ కార్యాలయం పర్యవేక్షణలో పని చేస్తున్నాయి. ఆరేళ్లలో ఒక్క ఎన్ఫోర్స్మెంట్ విభాగం 9,008 కిలోల గంజాయిని పట్టుకొంది. ఎన్ఫోర్స్మెంట్, రెండు జిల్లాల్లోని జిల్లా టాస్క్ ఫోర్స్ బృందాలు కేసులను ఆయా పరిధి స్టేషన్లలో నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే స్టేషన్లలో మూలుగుతున్న గంజాయి కలిసి స్టేషన్లలో కుప్పలు పేరుకుపోతున్నాయి.

News July 19, 2024

భద్రాచలం వద్ద 24 అడుగులకు చేరిన గోదావరి

image

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రం 22 అడుగులు ఉన్న నీటిమట్టం శుక్రవారం ఉదయానికి 24 అడుగులకు చేరుకుంది. ఎగువున భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మరింత పెరిగే సూచనలు ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News July 19, 2024

వనపర్తి: పీరు మోస్తూ.. కుప్పకూలిన యువకుడు

image

ఓ యువకుడు పీరు మోస్తూ.. కుప్పకూలిన ఘటన వనపర్తి మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. సవాయిగూడెం గ్రామానికి చెందిన గువ్వల మధుసుదన్(29) గురువారం పీరు ఎత్తుకొని గ్రామంలో ఊరేగిస్తుండగా గుండెనొప్పికి గురయ్యాడు. స్థానికులు వనపర్తి ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మధుసుదన్‌కు భార్యా, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె పుట్టుకతో దివ్యాంగురాలు.

News July 19, 2024

పెద్దపల్లి: పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య

image

పెద్దపల్లి జిల్లాలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాలు.. కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన రెడ్డి అభిలాశ్ (20) పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాగా కొద్ది రోజులుగా కుటుంబీకులతో కలిసి యైటింక్లయిన్ కాలనీ క్వార్టర్స్‌లో ఉన్నాడు. గురువారం అక్కడి నుంచి కమాన్‌పూర్‌కి వచ్చిన అభిలాశ్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి తల్లి ఫిర్యాదు మేరకు SI చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు.