Telangana

News September 5, 2024

ఆర్గానిక్ పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు: త్రిపుర గవర్నర్

image

కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో గురువారం అభినవ్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తున్న విధానాన్ని త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి డ్రోన్ పథకం ద్వారా సులభతరమైన పద్ధతిలో వ్యవసాయం చేయవచ్చన్నారు. ప్రస్తుత కాలంలో ప్రకృతి వ్యవసాయం చాలా అవసరమని, ఆర్గానిక్ పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని అన్నారు.

News September 5, 2024

WGL: రేపు నిర్వహించే జాబ్ మేళా వాయిదా

image

జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో సెప్టెంబర్ 6 శుక్రవారం (రేపు) నిర్వహించే జాబ్ మేళా రద్దు అయినట్లు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జాబ్ మేళను వాయిదా వేసినట్లు వారు తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో త్వరలో తెలుపుతాం అన్నారు.

News September 5, 2024

పంతం నెగ్గించుకున్న హరీశ్ రావు

image

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పంతం నెగ్గించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించకపోవడంతో హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు మేరకు గురువారం లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడితే చెక్కుల పంపిణీ కోసం హైకోర్టు ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

News September 5, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా సిరిసనగండ్లలో 9.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గద్వాల జిల్లా గట్టులో 7.5 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా మాచుపల్లిలో 7.5 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా దగడలో 2.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా కేంద్రంలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News September 5, 2024

విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలి: విజయేంద్రప్రసాద్

image

ఉపాధ్యాయులు విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని కవి, రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఈరోజు నల్లగొండలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకడం లేదని, అలాంటి పరిస్థితిని ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో కల్పించాలని కోరారు.

News September 5, 2024

WGL: గురువులు జీవితాన్ని ఇస్తారు: ఎంపీ కావ్య

image

తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు జీవితాన్నిస్తారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. వరంగల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవం వేడుకల్లో ఎంపీ పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. చదువు చెప్పే వారు మాత్రమే గురువులు కాదని, సన్మార్గంలో నడిపించే ప్రతి ఒక్కరూ గురువులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

News September 5, 2024

HYD: పూడికతీతల్లో అధికారుల చేతివాటం

image

క్షేత్రస్థాయిలో పనిచేసే పలువురు సహాయ ఇంజినీర్లు, కార్యనిర్వాహక ఇంజినీర్లు గుత్తేదారులతో చేతులు కలిపి అవకతవకలకు తెరలేపారు. నాలాల్లో పూడిక తొలగించకుండానే కొందరు గుత్తేదారులు పెట్టిన బిల్లులకు, ఇంజనీర్లు నిధులు మంజూరు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూడికతీత, ఎంఈటీ పనులకు ఒకే బృందం పని చేయడంతో ఏ పనీ సరిగ్గా జరగట్లేదనే విమర్శలొస్తున్నాయి. పనుల లోపంతోనే డ్రైనేజీ సమస్యలు ఏర్పడుతున్నాయి.

News September 5, 2024

ఆదిలాబాద్: జవహర్ నవోదయలో ప్రవేశాలు

image

2025-26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయలో ఆరో తరగతి అడ్మిషన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదిలాబాద్ DEO ప్రణీత పేర్కొన్నారు. ఎంపిక పరీక్ష ద్వారా ప్రవేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 16 లోపు www.navodaya.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 2025 జనవరి 18న పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కావున జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 5, 2024

మా ప్రదీప్ సార్ ఎప్పటికీ ప్రత్యేకమే: HYD కలెక్టర్

image

ఆరో తరగతిలో ఆంగ్లం బోధించే ప్రదీప్ మాస్టారు పాఠాలు చెప్పే విధానం నచ్చేదని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పేర్కొన్నారు. ఈ మేరకు గురువుల దినోత్సవం సందర్భంగా ఆయన పంచుకున్నారు. ‘మాస్టారు అందరూ ఇంగ్లిషులో మాట్లాడేందుకు ప్రోత్సహించారు. అప్పటినుంచి ఆంగ్ల భాషపై పట్టు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించాను. పదో తరగతి వచ్చేసరికి ఆంగ్లభాషలో మాట్లాడే స్థితికి చేరుకున్నా’ అని తెలిపారు.

News September 5, 2024

ఖైరతాబాద్: డిప్యూటీ సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. అనంతరం డిప్యూటీ సీఎంను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఛైర్మన్, కమిటీ సభ్యులు ఉన్నారు.