Telangana

News July 18, 2024

పారిశుద్ధ్య లోపం.. విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు

image

వర్షాకాలం ప్రారంభమవడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించడంతో ఖమ్మం జిల్లా ప్రజలు డెంగ్యూ జ్వరాల బారిన పడి మంచం పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రజలు డెంగీ జ్వరాల బారిన పడటంతో ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా జూలై నెలలో ఇప్పటి వరకు 18 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు.

News July 18, 2024

దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు

image

ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ పరీక్షలు రాసే దివ్యాంగుల కోసం అధికారులు ఖమ్మం నగరంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే డీఈఓ కార్యాలయ సీఎంఓ రాజశేఖర్‌ను ఇన్ఛార్జిగా నియమించారు. 137మంది అభ్యర్థులు ఇక్కడ పరీక్ష రాయనున్నారు.
వీరికి సహాయకుల (స్క్రైబ్స్)ను అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకోసం ఇంటర్ విద్యార్థులను
జిల్లా విద్యాశాఖ ప్రత్యేకంగా నియమించింది.

News July 18, 2024

డీఎస్సీ అభ్యర్థులకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలో డీఈఓ సోమశేఖరశర్మ, భద్రాద్రి కొత్తగూడెంలో డీఈఓ వెంకటేశ్వరాచారి పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు డీఈఓ కార్యాలయాల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఖమ్మం 99512 12603, భద్రాద్రి జిల్లా అభ్యర్థులు 98857 57137కు సంప్రదించాలన్నారు.

News July 18, 2024

ఆదిలాబాద్‌లో ప్రారంభం కానున్న DSC పరీక్ష

image

DSC పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయగా ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి 11.30, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులను ఉదయం 7.30 నుంచే లోనికి అనుమతిస్తారు. కాగా ఉదయం, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 100మంది విద్యార్థులు హాజరుకానున్నారు. >>ALL THE BEST

News July 18, 2024

అర్చకుల బదిలీని నిలిపి వేస్తూ హైకోర్టు స్టే

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో పనిచేస్తున్న అర్చకుల బదిలీని నిలిపి వేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ అర్చకులను బదిలీ చేయాలని దేవాదాయ శాఖ జీవో విడుదల చేసిన నేపథ్యంలో భద్రాచలానికి చెందిన ఆలయ ఉప ప్రధానార్చకులు మురళీ కృష్ణమాచార్యులు, శ్రీమన్నారాయణ చార్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో భద్రాద్రి ఆలయ అర్చకుల బదిలీని నిలిపివేస్తూ న్యాయస్థానం స్టే ఇచ్చింది.

News July 18, 2024

నల్గొండ: ఆశలు ఊరిస్తున్నా .. అనుమానాలు తొలగడం లేదు

image

నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఈసారైనా సాగునీరు అందుతుందా..? అని రైతులు ఎదురుచూస్తున్నారు. కృష్ణా నదికి ఎగువన ఆల్మట్టి డ్యామ్ నుంచి దిగువకు నీటి విడుదల ప్రారంభమైనా.. సాగర్ ఆయా కట్టు రైతుల్లో అనుమానాలు తొలగడం లేదు. గతేడాది ఇలాగే ఆశలు ఊరించినా ఆయకట్టుకు మాత్రం సాగునీరు అందలేదు. ఈసారి కూడా వరదలు వస్తాయా? ఆశలు నెరవేరుతాయా ..?  అన్న ఆందోళన అన్నదాతల్లో నెలకొంది.

News July 18, 2024

MBNR: సొంత ఊరు రైతులతో సీఎం ముఖాముఖి

image

సొంత గ్రామం కొండారెడ్డిపల్లి రైతులతో సీఎం రేవంత్ రెడ్డి నేడు ముఖాముఖి అవుతారని వంగూరు మాజీ ఎంపీటీసీ రమేష్ గౌడ్ తెలిపారు. రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ.7వేల కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. కాగా సా.4 గంటలకు సొంత గ్రామం రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి కానున్నారు. రైతులతో మాట్లాడి తెలుసుకోనున్నారు.

News July 18, 2024

మానకొండూర్: భర్త మరణం తట్టుకోలేక భార్య మృతి

image

భర్త మృతిని తట్టుకోలేక భార్య చెందిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం బంజేరుపల్లిలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. మల్లయ్య(75)మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం ఆయన అంత్యక్రియల నిర్వహణలో పాడె కడుతున్న సమయంలో మల్లయ్య భార్య రాజలచ్చమ్మ(70) ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News July 18, 2024

HYD: ఇంటి రుణం కట్టలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

image

ఇంటి రుణం కట్టలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD శివారు అమీన్‌పూర్‌‌ పరిధిలో జరిగింది. సీఐ నాగరాజు వివరాలు.. బీరంగూడలోని ఓ రెసిడెన్సీలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుమంత్‌ (30) రుణం తీసుకొని ఇల్లు కొన్నారు. కాగా ఇంటి వాయిదాలు చెల్లించడానికి అతడికి డబ్బులు సరిపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News July 18, 2024

HYD: ఇంటి రుణం కట్టలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

image

ఇంటి రుణం కట్టలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD శివారు అమీన్‌పూర్‌‌ పరిధిలో జరిగింది. సీఐ నాగరాజు వివరాలు.. బీరంగూడలోని ఓ రెసిడెన్సీలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుమంత్‌ (30) రుణం తీసుకొని ఇల్లు కొన్నారు. కాగా ఇంటి వాయిదాలు చెల్లించడానికి అతడికి డబ్బులు సరిపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.