India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాబోయే రోజులలో తెలంగాణలోని అన్ని రకాల కళాకారులకు ప్రోత్సాహాలు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. HYDలోని రవీంద్రభారతిలో పద్మశ్రీ పురస్కార గ్రహీత పద్మజా రెడ్డి ప్రదర్శించిన కాకతీయ 3వ భాగం నృత్య రూపక కార్యక్రమానికి జూపల్లి హాజరై మాట్లాడారు. CM రేవంత్ రెడ్డి సారుద్యంలో కలలు సాంస్కృతి సాహిత్యంలో అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
పటాన్ చెరులో నిర్వహించిన సమావేశంలో సిద్దిపేట MLA మాజీ మంత్రి హరీశ్ రావు TRS కండువాతో కనిపించడం హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్ మారుస్తారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హరీశ్ రావు టీఆర్ఎస్ కండువా ధరించి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీకి మునుపటి ఫామ్ రావాలంటే.. పార్టీ పేరు నుంచి మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఆగ్రోస్ సంస్థ ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా పనులు చేస్తానని రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో బాలరాజు మాట్లాడుతూ.. పోచారం శీనన్న నాయకత్వంలో బాన్సువాడ నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఈ అభివృద్ధి కొనసాగుతుందన్నారు. కొంతమంది హైదరాబాద్లో కూర్చొని గాలి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 2025-26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ చక్రపాణి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2025 జనవరి 18న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో వచ్చే విద్యా సంవత్సరం(2025- 26) ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయ ప్రధానాచార్యుడు నర్సింహులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ అనుమతి పొందిన, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. సెప్టెంబరు 16లోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
దేశంలో రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీని చేయడం ఇదే మొదటిసారి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ నిర్ణయంలో కేబినెట్ మంత్రిగా తాను ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. మరికొన్ని గంటల్లో రైతు జీవితంలో ఆనందం గడియలు మొదలు కానున్నాయని అన్నారు. ఒకేసారి రైతు పేరు మీద ఉన్న రుణాన్ని 3 పద్ధతుల్లో మాఫీ చేస్తున్నామని తెలిపారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.
@ ఉమ్మడి కరీంనగర్లో మొహర్రం వేడుకలు.
@ హుజురాబాద్ పట్టణంలో 25 మందిపై పిచ్చికుక్కల దాడి.
@ ధర్మారం మండలంలో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య.
@ మల్యాల మండలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.
@ పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్.
★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో తొలిఏకాదశి వేడుకలు
★ ముధోల్ : కుళ్ళిన అంగన్వాడీ కోడిగుడ్లు
★ ఆదిలాబాద్ : పోలీసులపై డాడి.. ఇద్దరు జైలుకు
★ భైంసా : నీటిలో మునిగి ఎద్దు మృతి
★ ఆదిలాబాద్ : మహారాష్ట్ర మద్యం బాటిళ్ల పట్టివేత
★ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసానికి ఏర్పాట్లు పూర్తి
★ ఆదిలాబాద్ : యువకుడి అదృశ్యం
★ మందమర్రి : గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్ట్
★ త్వరలో జిల్లాకు డిప్యూటీ సీఎం రాక
భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతిచెందిన ఘటన బుధవారం మూడవ టౌన్ పరిధిలో జరిగింది. నగరంలోని గాయత్రినగర్ చెందిన షేక్ మెహబూబ్(49) గౌతంనగర్ నూతన భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న మూడవ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ధంసలాపురం వద్ద ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ఎంట్రీ ఎగ్జిట్పై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ ఇతర అధికారులతో డిజైన్స్పై చర్చ జరిపారు. ఈ చర్చలో మంత్రికి రెండు డిజైన్లను అధికారులు సమర్పించారు. రైతులు నష్టపోకుండా తక్కువ భూసేకరణ ఉండే డిజైన్ పరిశీలించి ఆ డిజైన్ ఆమోదించాలని మంత్రి సూచించారు.
Sorry, no posts matched your criteria.