Telangana

News July 17, 2024

NRPT: పీర్ల ఊరేగింపుకు పటిష్ట పోలీస్ బందోబస్తు

image

జిల్లా వ్యాప్తంగా పీర్ల ఊరేగింపుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్ అన్నారు. మంగళవారం సాయంత్రం నారాయణపేట పట్టణంలోని ఉట్కూర్ మస్జిద్ చావిడిలో పీర్లను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిర్వాహకులు ఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. మొహరం వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని, భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలని నిర్వాహకులకు ఎప్పీ సూచించారు.

News July 17, 2024

తొలి ఏకాదశి SPECIAL.. ఈ ఆలయాలకు వెళుతున్నారా?

image

నేడు తొలి ఏకాదశి నేపథ్యంలో HYD, ఉమ్మడి RRతో పాటు రాజధానికి చేరువలో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ ఆలయాల్లో నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. చిలుకూరు బాలాజీ, వికారాబాద్ అనంతగిరి పద్మనాభ స్వామి,స్వర్ణగిరి, మేడ్చల్ బద్రీనాథ్, చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి, బంజారాహిల్స్ పూరీ జగన్నాథ్, బిర్లా మందిర్, శామీర్ పేట రత్నాలయం, సంఘి, బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, అమ్మపల్లి సీతారామాలయంలో ఏర్పాట్లు చేశారు. SHARE IT

News July 17, 2024

NZB: మాధవ నగర్ రైల్వే బ్రిడ్జిని పరిశీలించిన: MLA భూపతి రెడ్డి

image

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మాధవ నగర్ రైల్వే బ్రిడ్జిని మంగళవారం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే కాంట్రాటర్‌తో మాట్లాడుతూ.. రైల్వే బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని, వాహనా దారులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నీరడి దేవరాజ్, వాసు, కోట్ల భాస్కర్, వెంకట్ రెడ్డి, సాయిలు పాల్గొన్నారు.

News July 17, 2024

తొలి ఏకాదశి SPECIAL.. ఈ ఆలయాలకు వెళుతున్నారా?

image

నేడు తొలి ఏకాదశి నేపథ్యంలో HYD, ఉమ్మడి RRతో పాటు రాజధానికి చేరువలో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ ఆలయాల్లో నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. చిలుకూరు బాలాజీ, వికారాబాద్ అనంతగిరి పద్మనాభ స్వామి,స్వర్ణగిరి, మేడ్చల్ బద్రీనాథ్, చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి, బంజారాహిల్స్ పూరీ జగన్నాథ్, బిర్లా మందిర్, శామీర్ పేట రత్నాలయం, సంఘి, బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, అమ్మపల్లి సీతారామాలయంలో ఏర్పాట్లు చేశారు. SHARE IT

News July 17, 2024

GDK: అరుణాచల గిరి ప్రదర్శనకు ఆర్టీసీ బస్సు

image

గురుపౌర్ణమి పురస్కరించుకొని ఈనెల 21న అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షణకు వెళ్లే భక్తులకు TS- RTCగోదావరిఖని నుంచి తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు DMనాగభూషణం తెలిపారు. ఈనెల 19న రాత్రి 7 గంటలకు గోదావరిఖనిలో బయలుదేరి కరీంనగర్‌కు చేరుకొని అక్కడి నుంచి రాత్రి 8:45కు ప్రారంభమవుతుందన్నారు. వివరాలకు www.tsrtconline.inలో సర్వీస్ no.69999 బుక్ చేసుకోవాలన్నారు.

News July 17, 2024

ములుగు: రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేలం పాట

image

ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలోని ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కొబ్బరికాయలు పూజా సామగ్రి అమ్ముకోవడానికి మంగళవారం వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో 2024-25 సంవత్సరానికి గాను రూ.5,20,500 పాట పాడి జనగాం రమేశ్ దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ.4,31,000 వచ్చినట్లు దేవదాయ శాఖ పరిశీలకులు డి.అనిల్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News July 16, 2024

మహబూబ్ నగర్: నేటి ముఖ్య వార్తలు!!

image

✔NGKL:మాంసం ముక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి
✔SDNR: సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి సూసైడ్
✔మార్గదర్శకాల పేరుతో మమ అనిపించే ప్రయత్నం:MP డీకే అరుణ
✔రైతులను ఏరివేసేందుకే మార్గదర్శకాలు: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
✔తెలంగాణ నుంచి అర్హత సాధించిన ఏకైక టీం MBNR:MDCA
✔ఉమ్మడి పాలమూరులో మోస్తారు వర్షం
✔TCC ఉత్తీర్ణులు ధ్రువపత్రాలు తీసుకోండి: DEOలు
✔భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న మొహర్రం వేడుకలు

News July 16, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు. @ ఎండపల్లి మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ వెల్గటూర్ మండలంలో ఓ ఇంట్లో పేలిన ఫ్రిడ్జ్. @ ధర్మారం మండలంలో ట్రాక్టర్, బోలెరో డీ.. ఇద్దరి మృతి. @ కోరుట్ల పట్టణంలో ఎరువుల దుకాణాలలో వ్యవసాయ అధికారుల తనిఖీలు. @ బీర్పూర్ మండలంలో కుక్కల దాడిలో బాలుడికి గాయాలు.

News July 16, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ లోని నేటి ముఖ్యాంశాలు

image

★ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దంచికొట్టిన వర్షం
★ కాగజ్ నగర్: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
★ ముధోల్: విద్యుత్ షాక్ తో గేదెమృతి
★ నిర్మల్: 14 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
★ భైంసా: అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
★ కడెం: క్షణికావేశంలో ఒకరు ఆత్మహత్య
★ చిట్యాల: అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొట్టిన లారీ
★ ADB: జైలునుంచి విడుదలైన బీజేపీ నాయకులు
★ బెజ్జుర్: భారీ కొండ చిలువ ప్రత్యక్షం
★ భైంసా: దొంగ అరెస్ట్

News July 16, 2024

ఖమ్మం: వృద్ధురాలి హత్య

image

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సామ్యతండాకు చెందిన సక్రి(65)ని దుండగులు హత్య చేశారు. స్థానికుల వివరాలిలా.. సక్రి రోజూ పనికి వెళ్తుంటుంది. ఇవాళ ఇంటి నుంచి బయటకు రాలేదు. చుట్టు పక్కల వారు వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉంది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.