India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పటాన్చెరు MLA మహిపాల్రెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారనే ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. మహిపాల్రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్లో చేరికపై చర్చ జరపగా ఇందుకు పలువురు ఆసక్తి చూపనట్లు తెలిసింది. మరోవైపు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఆయన్ని చేర్చుకోవద్దని అంటున్నారు. స్థానిక కాంగ్రెస్ నేత శ్రీనివాస్గౌడ్ వర్గం రహస్య సమావేశంతో ఆయన చేరికతో పార్టీ చీలిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన అల్వాల్ PSపరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీనగర్కు చెందిన మహిళ శనివారం యాప్రాల్ నుంచి ఆటోలో అల్వాల్కు వచ్చింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. లోతుకుంటలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించగా.. ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన అల్వాల్ PSపరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీనగర్కు చెందిన మహిళ శనివారం యాప్రాల్ నుంచి ఆటోలో అల్వాల్కు వచ్చింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. లోతుకుంటలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించగా.. ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిర్మల్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాల మేరకు శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన నాకాబంది(ప్రత్యేక తనిఖీ)లో మొత్తం 664 కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాటిలో హెల్మెట్ లేనివారు 565, డ్రైవింగ్ లైసెన్స్ 7, సీట్ బెల్ట్ 5, రాంగ్ డ్రైవింగ్ 9, ట్రిపుల్ డ్రైవింగ్ 7, నంబర్ ప్లేట్ 66, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ 2, మైనర్ డ్రైవింగ్ 2 కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఏడో తరగతి చదివే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి దర్గా కాజీపేటలో చోటుచేసుకుంది. ఎస్సై వై.సుధాకర్ రెడ్డి వివరాల ప్రకారం.. బాలిక(13) ఓ ప్రైవేటు పాఠశాల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. రాత్రి 7:30 సమయంలో తల్లి బయటకు వెళ్లి వచ్చిన అరగంటలో ఇంట్లో ఉరేసుకుని మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామ శివారులోని చెరువు కట్టపై ఆదివారం రాత్రి మొసళ్ల సంచారించాయి. జూరాల ఎడమ కాలువ నుంచి నేపథ్యంలో విడుదలవుతున్న నీరు గ్రామ చెరువుకు చేరుతుంది. ఈ క్రమంలో ఇవి చెరువు కట్టపైకి వచ్చాయి. రాత్రి ఆటుగా వెళ్లిన చిన్నారులు విషయాన్ని కుటంబీకులు చెప్పారు. ఆత్మకూరు నుంచి మూలమల్ల మీదుగా నందిమల్ల, జూరాల ప్రాజెక్టుకు వెళ్లేవారు దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘నా కొడుకునే రిమాండ్ చేస్తారా మీకెంత ధైర్యం ఉండాలి’ అంటూ ఓ హోంగార్డు PSలో హల్చల్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఘట్కేసర్కు చెందిన ఏ.వెంకటేశ్ను చైన్స్నాచింగ్ కేసులో పోలీసులు రిమాండ్ చేశారు. నిందితుడి తండ్రి హోంగార్డుగా పని చేస్తున్నారు. శనివారం రాత్రి స్థానిక PSలోకి వెళ్లి ఏకంగా క్రైమ్ సీఐ శ్రీనివాస్నే ‘నీ అంతు చూస్తా’ అంటూ ఇష్టమొచ్చినట్లు తిడుతూ రచ్చచేశారు. అతడి మీద కూడా కేసు నమోదైంది.
‘నా కొడుకునే రిమాండ్ చేస్తారా మీకెంత ధైర్యం ఉండాలి’ అంటూ ఓ హోంగార్డు PSలో హల్చల్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఘట్కేసర్కు చెందిన ఏ.వెంకటేశ్ను చైన్స్నాచింగ్ కేసులో పోలీసులు రిమాండ్ చేశారు. నిందితుడి తండ్రి హోంగార్డుగా పని చేస్తున్నారు. శనివారం రాత్రి స్థానిక PSలోకి వెళ్లి ఏకంగా క్రైమ్ సీఐ శ్రీనివాస్నే ‘నీ అంతు చూస్తా’ అంటూ ఇష్టమొచ్చినట్లు తిడుతూ రచ్చచేశారు. అతడి మీద కూడా కేసు నమోదైంది.
రాష్ట్ర పురపాలకశాఖ వరంగల్ ప్రాంతీయ సంచాలకులు షాహిద్ మసూద్ ఆధ్వర్యంలో నేడు గ్రేటర్ వరంగల్ సాధారణ పరిపాలన విభాగం ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ జరగనుంది. HNKలోని ‘కుడా’ కాంప్లెక్సులో ఉదయం 9గంటలకు సీనియర్ అసిస్టెంట్లు, మధ్యాహ్నం 12గంటలకు సీనియర్ అకౌంటెంట్స్, మధ్యాహ్నం 1గంటకు హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందని వరంగల్ ప్రాంతీయ ఉప సంచాలకులు షాహిద్ మసూద్ షెడ్యూల్ విడుదల చేశారు.
చౌటుప్పల్ పరిధిలోని లక్కారం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి వివరాలు.. ఒడిశాకు చెందిన కంటైనర్ HYD-విజయవాడ వెళ్తుంది. లక్కారం వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన గూడ్స్ ఆటో కంటైనర్ను.. హైవే రెయిలింగ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెంకు చెందిన ప్రకాశ్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.