Telangana

News July 15, 2024

NLG: కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్.. 34 మందికి విముక్తి!

image

వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించి బడి ఈడు పిల్లలను బడిలోనే ఉంచాలనే ఉద్దేశంతో NLG జిల్లాలో ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది జనవరిలో ఆపరేషన్ స్మైల్-10 పూర్తికాగా ఈ నెల 1 నుంచి ఆపరేషన్ ముష్కాన్ కొనసాగుతోంది. జిల్లాలోని పలు పరిశ్రమలు, దుకాణాలు ఇతర ప్రదేశాల్లో బాల కార్మికులుగా పనిచేస్తున్న 34 మంది బాల కార్మికులను గుర్తించి పనుల నుంచి విముక్తి కల్పించారు.

News July 15, 2024

NZB: బాధిత కుటుంబానికి RS.25లక్షల సాయం అందజేత

image

ఆపదలో ఉన్న మిత్రుడి కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచారు. అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీనివాస్ సిబ్బంది వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అతడి కుటుంబాన్ని ఆదుకునేందుకు తోటి స్నేహితులు ముందుకొచ్చారు. 2014 బ్యాచ్‌కు చెందిన SIలు ఆ కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. వారిలో ఉమ్మడి NZB జిల్లాకు చెందిన పలువురు SIలు కూడా ఉన్నారు.

News July 15, 2024

ADB: నేడు JOBS కోసం ఇంటర్వ్యూలు

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. విద్యాలయంలో సంగీతం/నృత్యం, టీజీటీ సంస్కృతం, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్ విభాగాల్లో నాలుగు పోస్టులు ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈరోజు ఉదయం నిర్వహించే ఇంటర్వ్యూలకు ద్రువపత్రాలతో హాజరుకావాలని ఆమె సూచించారు.

News July 15, 2024

ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీ విస్తరణకు ప్లాన్

image

ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీని విస్తరించినందుకు ప్రభుత్వం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఇటీవల వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి దీనిపై నివేదిక సిద్ధం చేసి నిపుణుల కమిటీకి అందజేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీలను కలిపి జీహెచ్ఎంసీ కిందికి తీసుకువస్తే నగరం మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

News July 15, 2024

ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీ విస్తరణకు ప్లాన్

image

ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీని విస్తరించినందుకు ప్రభుత్వం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఇటీవల వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి దీనిపై నివేదిక సిద్ధం చేసి నిపుణుల కమిటీకి అందజేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీలను కలిపి జీహెచ్ఎంసీ కిందికి తీసుకువస్తే నగరం మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

News July 15, 2024

పూలకు కేరాఫ్ అడ్రస్@గుడిమల్కాపూర్

image

హైదరాబాద్‌లో పూలకు కేరాఫ్ అడ్రస్‌ గుడిమల్కాపూర్ మార్కెట్. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చిన వ్యాపారస్థులు పూల క్రయవిక్రయాలు చేస్తుంటారు. పండగ వచ్చింది అంటే చాలు ఇక్కడ సందడిగా మారుతుంది. రూ. లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. 11 ఎకరాల్లో విస్తరించి ఉన్న మార్కెట్ వేలాది కుటుంబాలకు ఉపాధినిస్తుంది. ఇక బోనాల సీజన్‌‌ కావడంతో రెట్టింపు వ్యాపారం జరగనుంది.

News July 15, 2024

పూలకు కేరాఫ్ అడ్రస్@గుడిమల్కాపూర్

image

హైదరాబాద్‌లో పూలకు కేరాఫ్ అడ్రస్‌ గుడిమల్కాపూర్ మార్కెట్. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చిన వ్యాపారస్థులు పూల క్రయవిక్రయాలు చేస్తుంటారు. పండగ వచ్చింది అంటే చాలు ఇక్కడ సందడిగా మారుతుంది. రూ. లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. 11 ఎకరాల్లో విస్తరించి ఉన్న మార్కెట్ వేలాది కుటుంబాలకు ఉపాధినిస్తుంది. ఇక బోనాల సీజన్‌‌ కావడంతో రెట్టింపు వ్యాపారం జరగనుంది.

News July 15, 2024

జడ్చర్లలో నేడు మంత్రుల పర్యటన

image

జడ్చర్ల నియోజకవర్గంలో నేడు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ పర్యటిస్తున్నట్లు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. బాలానగర్ నుంచి గంగాపూర్ వరకు రూ.56 కోట్లతో నిర్మించనున్న డబుల్ రోడ్డు, రాజాపూర్ నుంచి రంగారెడ్డిగూడ వయా మల్లేపల్లి, ఇదిగానిపల్లి, కల్లేపల్లి మీదుగా రూ.30కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని కోరారు.

News July 15, 2024

సనాతన ధర్మంలో మహిళలకు అత్యున్నత స్థానం

image

భారతీయ సనాతన ధర్మంలో మహిళలకు అత్యున్నతమైన స్థానం కల్పించినట్లు ప్రముఖ ఆధ్యాత్మిక వక్త సత్యవాణి పేర్కొన్నారు. సదాశివపేటలో వీరశైవ సమాజం, ఆధ్వర్యంలో శివ పంచాక్షరి జపయజ్ఞ సామూహిక ఇష్ట లింగార్చన మహోత్సవం నిర్వహిస్తున్నారు. సృష్టిలో మహిళా మూర్తులకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. సమాజ అధ్యక్షులు చీల మల్లన్న, విశ్వనాథం, శ్రీశైలం, వీరేశం, బసవరాజు పాల్గొన్నారు.

News July 15, 2024

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సూచించారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో బుధవారం వరకు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల వల్ల రోడ్లు కొట్టుకుపోవడం, ఉద్యాన పంటల నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.