Telangana

News July 14, 2024

పాలమూరు యూనివర్సిటీకి రూ.100 కోట్ల నిధులు

image

పాలమూరు యూనివర్సిటీకి రానున్న రెండు సంవత్సరాల్లో రూ.100 నిధులు మంజూరు కానున్నాయి. ఇందులో కేంద్రం రూ.60 కోట్లు రాష్ట్రం రూ.40 కోట్లు భరిస్తాయి. ఈ నిధుల్లో పరిశోధనకు రూ.13 కోట్లు, సాఫ్ట్వేర్ అభివృద్ధికి రూ.3 కోట్లు, మరమ్మతులకు రూ.5 కోట్లు వెచ్చించనున్నారు. మిగిలిన నిధులను అమ్మాయిల ఈతకొలను, ఇండోర్ స్టేడియం, ఆసుపత్రి, పరిశోధన భవనాల కోసం ఖర్చు చేస్తారు.

News July 14, 2024

MBNR: HYD నుంచి ఇంటికి వస్తుండగా..

image

కారు చెట్టును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తిమ్మాజిపేటలో శనివారం రాత్రి జరిగింది. ఎస్సై నరేందర్ రెడ్డి వివరాలు.. గోపాల్పేట మండలం బుద్ధారం లక్ష్మీ తండాకు చెందిన సంతోష్ (30) భార్య శారదతో కలిసి HYD నుంచి స్వగ్రామానికి సొంత కారులో వెళుతుండగా.. తిమ్మాజిపేట మలుపు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు. సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య శారదకు స్వల్ప గాయాలయ్యాయి.

News July 14, 2024

దేవాదాయ, ధర్మాదాయ శాఖలో బదిలీలకు రంగం సిద్ధం

image

దేవాదాయ, ధర్మాదాయ శాఖలో బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో 630 దేవాలయాలు ఉండగా, 250 మంది వరకు ఉద్యోగులు, అర్చకులు పని చేస్తున్నారు. దేవాలయాల్లో 6ఏ విభాగంలో 19 ఉండగా, 6బీ కింద 41, 6సిలో 570 దేవాలయాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ దేవాలయాల్లో ధూపదీప నైవేద్య పథకం కింద ఎంపిక చేసిన ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి.

News July 14, 2024

కామారెడ్డి: సైబర్ నేరగాళ్ల కొత్త మోసం..

image

పాల్వంచ మండలం భవానిపేటకు చెందిన నారెడ్డి వెంకట్ రెడ్డి కూతురు రాధవి అమెరికాలో ఎంఎస్ చేస్తుంది. వెంకట్ రెడ్డికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీ కూతురు కేసులో చిక్కుకుందని, రూ.2 లక్షలు పంపాలని ఫోన్ చేశారు. వెంకట్ రెడ్డి కూతురుకు ఫోన్ చేయగా కలవకపోవడంతో భయానికి గురై రూ.లక్ష రూపాయలు మూడు విడతల్లో పంపాడు. మళ్లీ డబ్బుల కోసం డిమాండ్ చేయగా అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 14, 2024

సీఏ ఫైనల్ పరీక్షలో మెరిసిన KNR జిల్లా వాసి

image

సీఏ ఫైనల్ పరీక్షలో కరీంనగర్ జిల్లా వాసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. నగరంలోని సప్తగిరికాలనీకి చెందిన సముద్రాల వికాస్ 600 మార్కులకు గానూ 350 సాధించి 58.33శాతంతో ఉత్తీర్ణ పొందారు. అయితే వీరి సొంతూరు హుజూరాబాద్ కాగా.. కొన్నేళ్లుగా కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌లో ఉంటున్నారు. సీఏ ఫౌండేషన్ 2019లో, సీఏ ఇంటర్ 2020, సీఏ ఫైనల్ 2024లో పూర్తి చేశారు. దీంతో పలువురు వికాస్‌ను అభినందిస్తున్నారు.

News July 14, 2024

వాజేడు: జలపాతం వద్ద హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు

image

వరద ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జలపాతం సందర్శనకు వస్తున్న పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా వాజేడు పోలీసుల ఆధ్వర్యంలో ప్లెక్సీలతో సూచనలు చేశారు. వెంకటాపురం సీఐ బండారి కుమార్, వాజేడు ఎస్ఐ హరీశ్, పోలీస్ సిబ్బంది బొగత జలపాతం వద్ద వీటిని ఏర్పాటు చేశారు. సందర్శనకు వచ్చే పర్యాటకులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.

News July 14, 2024

భువనగిరి: మహిళపై గొడ్డలితో దాడి

image

మహిళపై గొడ్డలితో దాడి చేసిన ఘటన నారాయణపురం(M) వాయిల్లపల్లిలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన సుభాశ్‌ భూమి పక్కన చెన్నకేశవ, మారయ్య, లింగస్వామి, ఎర్రయ్యల భూమి ఉంది. కొద్ది రోజులుగా సుభాశ్ ఫెన్సింగ్ వేసుకున్న భూమిలో అర ఎకరం భూమి తమదంటూ గొడవ పడుతున్నారు. శనివారం ఫెన్సింగ్ కడ్డీలను ధ్వంసం చేసే సమయంలో సుభాశ్ భార్య అడ్డుకునేందుకు వెళ్లగా పద్మపై నలుగురు గొడ్డలితో దాడి చేశారు. కేసు నమోదైంది.

News July 14, 2024

ఖమ్మం జిల్లాలో హీరోయిన్

image

ఖమ్మం జిల్లాలో హీరోయిన్ సంయుక్త మేనన్ సందడి చేశారు. శనివారం ఆమె జిల్లాలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చింది. దీంతో ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆమెతో సెల్పీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.

News July 14, 2024

అరుణాచలానికి ప్రత్యేక బస్సులు

image

తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలేశ్వరుని దర్శనానికి మహబూబ్ నగర్ రీజియన్‌లోని MBNR, NGKL డిపోల నుంచి 10 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం వి.శ్రీదేవి తెలిపారు. ఈ నెల 19న రాత్రి రెండు డిపోల నుంచి బస్సులు అరుణాచలానికి బయలుదేరుతాయన్నారు. MBNR ప్రాంత ప్రయాణికులు 94411 62588, MGKL ప్రాంతం వాళ్లు 83092 14790 నంబర్లలో సంప్రదించాలని, పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,400 ధర నిర్ణయించామన్నారు.

News July 14, 2024

ఆర్మూర్: ఆస్తి వివాదంలో అన్న ప్రాణం తీసిన తమ్ముడు

image

అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి వివాదాల్లో అన్న ప్రాణం తీసిన ఘటన ఆర్మూర్ మండలంలో జరిగింది. మామిడిపల్లికి చెందిన నర్సయ్య, గంగాధర్ అన్నదమ్ములు వీరి మధ్య శుక్రవారం ప్లాట్ల విషయంలో గొడవ జరగగా ఆగ్రహంతో గంగాధర్ నర్సయ్యపై కర్రతో దాడి చేశాడు. క్షతగాత్రుడిని కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నర్సయ్య శనివారం మృతి చెందాడు. కుటుంబీకులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.