Telangana

News July 14, 2024

జగిత్యాల నుంచి శంషాబాద్‌కు రాజధాని బస్సులు

image

జగిత్యాల డిపో నుంచి శంషాబాద్‌కు టీజీఎస్ RTC రాజధాని బస్సు సర్వీసులు నడపనున్నట్లు RM సుచరిత తెలిపారు. ఈనెల 15 నుంచి నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ బస్సులు జగిత్యాల నుంచి బయల్దేరి KNR, ఉప్పల్ క్రాస్ రోడ్, LBనగర్ మీదుగా శంషాబాద్ చేరుకుంటాయన్నారు. జగిత్యాల నుంచి శంషాబాద్‌కు సాయంత్రం 4:30, రాత్రి 8గం.కు, KNR నుంచి సా.5:45కు, రాత్రి 9:30కు, శంషాబాద్ నుంచి KNR/JGLకు ఉ.7:15, 8 గంటలకు బయల్దేరుతాయన్నారు.

News July 14, 2024

ఖమ్మం: ఖానాపురం హవేలి PSలో మహిళ హల్‌చల్‌

image

ఖానాపురం హవేలి PSలో ఓ వివాహిత శనివారం హల్‌చల్‌ చేసింది. AR కానిస్టేబుల్‌‌తో తన భార్యకు సంబంధం ఉందని ఆమె భర్త ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా యువతిని స్టేషన్‌కు పిలిపించి నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించగా, నోటీసులు తీసుకోవడానికి నిరాకరించింది. కానిస్టేబుల్‌తో ఉన్న ఫొటోలు తనవి కావని, మార్ఫింగ్‌ చేశారంటూ గొడవకు దిగింది. పెట్రోలు పట్టుకుని వచ్చి బెదిరించింది.

News July 14, 2024

వలిగొండ: తమ్ముడు మృతి.. అన్న ఆత్మహత్య

image

ఉరేసుకొని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వలిగొండ(M) ప్రొద్దుటూరులో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాలు.. గోపాల్‌-శకుంతల పెద్ద కుమారుడు శివప్రసాద్‌(27) ఇంటి వద్దనే ఉంటాడు. ఇటీవల తన సోదరుడు రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి సోదరుడిని జ్ఞాపకం చేసుకుంటూ మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.

News July 14, 2024

తూప్రాన్: ఇంటర్ విద్యార్థిని సూసైడ్

image

తూప్రాన్ మండలం దాతర్‌పల్లిలో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాలు.. బోసమైన గాయత్రి(17) గజ్వేల్ మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మొదటి సంవత్సరంలో ఫెయిల్ కావడంతో నిన్న రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్కూల్ బ్యాగ్‌లో వెతకగా టీసీ కనిపించడంతో ఫెయిలైన కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 14, 2024

గద్వాల: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సూసైడ్

image

అయిజ మండలంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. ఉప్పలక్యాంపు గ్రామానికి చెందిన చెన్నకేశవరావు(24) కొంతకాలం చెన్నైలో ఉద్యోగం చేశాడు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స కోసం స్వగ్రామానికి వచ్చాడు. చికిత్స పొందుతూ, అయిజలోని ఉప్పల్‌దొడ్డిపేటలో చిన్నాన్న వద్ద ఉంటున్నాడు. శనివారం ఇంటి నుంచి వెళ్లి ఉప్పల రహదారిలో ఉన్న మంచినీటి సంప్‌ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 14, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

> పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
> కొత్తగూడెంలో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి పర్యటన
> వెంకటాపురంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> సత్తుపల్లి సింగరేణి ఏరియాల్లో ఉచిత వైద్య శిబిరం
> నేలకొండపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
> బయ్యారంలో ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆత్మీయ సమ్మేళనం
> మధిరలో సీపీఎం పార్టీ జిల్లా శిక్షణ తరగతులు
> అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన

News July 14, 2024

తాడ్వాయిలో విష జ్వరాలు.. స్పందించిన వైద్యులు

image

మునగాల మండల పరిధిలోని తాడ్వాయిలో విష జ్వరాలు విజృంభిస్తుండడంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీశైలం ఆధ్వర్యంలో గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరం, దగ్గు ఇతర లక్షణాలున్న గ్రామస్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో పేరు నమోదు చేసుకున్న 64 మందిలో 9 మందికి జ్వరం లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారి తెలిపారు.

News July 14, 2024

NZB: జిల్లాలో పెరుగుతున్న డెంగ్యూ, చికెన్‌గున్యా కేసులు

image

ఉమ్మడి NZB వ్యాప్తంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధులో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈక్రమంలో పిట్లం మండలం అల్లాపూర్‌లో గత 2రోజులుగా చికెన్‌గున్యా వ్యాధులు విజృంభించి ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం గ్రామంలో వైద్యాధికారులు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇంటింటా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

News July 14, 2024

నేడు మంచిర్యాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్

image

మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీలో ఆదివారం సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) 28వ ద్వైవార్షిక మహాసభలను నిర్వహిస్తున్నట్లు యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య తెలిపారు. సభలకు ఛీప్‌గెస్ట్‌గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నట్లు చెప్పారు. బీఎంఎస్ కేంద్ర కమిటీ సభ్యులు కూడా రానున్నట్లు పేర్కొన్నారు. సింగరేణి కార్మికవర్గం మహాసభలను సక్సెస్ చేయాలని కోరారు.

News July 14, 2024

WGL: మహిళా కండక్టర్‌ను దూషించిన ప్రయాణికుడిపై కేసు

image

మహిళా కండక్టర్‌ను దూషించిన ఓ ప్రయాణికుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు షేక్ దుర్గా హుస్సేన్ కూతురితో కలిసి ఖమ్మం నుంచి తొర్రూర్‌కు వెళ్లే RTC బస్సు ఎక్కారు. అయితే టికెట్ తీసుకునే క్రమంలో కూతురు ఆధార్ కార్డును ఫోన్‌లో చూపించింది. దీంతో ఒరిజినల్ కార్డు చూపించాలని, లేదంటే టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పడంతో హుస్సేన్ ఆగ్రహంతో కండక్టర్‌ను దూషించాడు.