India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
BJP సీనియర్ నాయకుడు ఓరుగంటి రాములు ప్రథమ వర్ధంతి సందర్భంగా గురువారం నల్గొండ పట్టణంలో నిర్వహించనున్న సంస్మరణ కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి రానున్నారు. నల్గొండ నుంచి ఎంపీగా పలుమార్లు పోటీ చేసిన ఆయన గవర్నర్ హోదాలో రానుండటంతో జిల్లా BJP అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గురుకుల విద్యపై ప్రస్తుత ప్రభుత్వం కుట్ర చేస్తోందని భారాస నేత RS. ప్రవీణ్ కుమార్ వాపోయారు. తెలంగాణ భవన్లో బుధవారం మాట్లాడారు. ‘గురుకులాల్లోని 2,000 మంది టీచర్లను తొలగించడంతో విద్యార్థుల భవిత అగమ్యగోచరంగా మారింది. ఈ కుట్ర నుంచి గురుకులాలను కాపాడుకోవాలి. కేసీఆర్ హయాంలో నాణ్యమైన గురుకుల విద్య అందించారు. ప్రభుత్వం కుట్రకు ఎస్సీలే సమిధలవుతున్నారు’ అని సీఎం ఫైర్ అయ్యారు.
గురుకుల విద్యపై ప్రస్తుత ప్రభుత్వం కుట్ర చేస్తోందని భారాస నేత RS. ప్రవీణ్ కుమార్ వాపోయారు. తెలంగాణ భవన్లో బుధవారం మాట్లాడారు. ‘గురుకులాల్లోని 2,000 మంది టీచర్లను తొలగించడంతో విద్యార్థుల భవిత అగమ్యగోచరంగా మారింది. ఈ కుట్ర నుంచి గురుకులాలను కాపాడుకోవాలి. కేసీఆర్ హయాంలో నాణ్యమైన గురుకుల విద్య అందించారు. ప్రభుత్వం కుట్రకు ఎస్సీలే సమిధలవుతున్నారు’ అని సీఎం ఫైర్ అయ్యారు.
నగరంలోని ధూల్పేట నుంచి వినాయక విగ్రహాల తరలింపు దృష్ట్యా నేటి నుంచి 7వ తేదీ రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు బుధవారం తెలిపారు. గణేశ్ విగ్రహాలు తీసుకెళ్లే వాహనాలు ఎంజే మార్కెట్ బ్రిడ్జి నుంచి గాంధీ విగ్రహం వైపు (ధూల్పేట) వరకు మాత్రమే అనుమతిస్తారు. ఎంజే బ్రిడ్జి నుంచి పురానాపూల్ వరకు ఇతర వాహనాలు అనుమతించరు.
పెళ్లైన 17 రోజులకే నవ వధువు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. SI నరేశ్ ప్రకారం.. మల్యాల మం. మ్యాడంపల్లికి చెందిన ఉదయ్కిరణ్కు తక్కళ్లపల్లికి చెందిన భాగ్యలక్ష్మితో ఆగస్టు 18న పెళ్లయింది. కాగా, ఉదయ్ HYDలో ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు భాగ్యలక్ష్మిని స్వగ్రామం తీసుకురాగా ‘నేను ఎవరి కారణంగా చనిపోవట్లేదు.. నాకే ఈ లోకంలో ఉండటం ఇష్టం లేదు’ అని చేతిపై రాసి ఉరేసుకుంది.
WGL జిల్లాలో విషాదం నెలకొంది. దేశానికి కాంస్యం తీసుకొచ్చిన దీప్తి జీవాంజి ఫస్ట్ కోచ్ బుధవారం మృతి చెందారు. RDF స్కూల్లో PETగా పనిచేసిన వెంకటేశ్వర్లు మొదటగా దీప్తి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. దీప్తి విజయం వెనక ఉన్న ప్రధాన వ్యక్తుల్లో ఒకరుగా నిలిచారు. గత 6-7 ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం మృతి చెందారు. జాతీయ స్థాయి క్రీడల్లో ఎందరో విద్యార్థులు రాణించడానికి ఈయన కృషి చేశారు. SHARE
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల నుంచి ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం అదనపు సమయాన్ని పాఠశాలల్లో గడుపుతూ తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు అందజేయనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ యంత్రాంగం DEOలకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 3,227 ప్రభుత్వ పాఠశాలల్లో 12,708 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు పాఠశాలలో విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఉమ్మడి జిల్లాలో 13.97 లక్షల మంది వరకు ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేస్తున్నారు. మే వరకు సగటున రోజుకు 2.70లక్షల మంది వరకు కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. రోజుకు రూ.5.40కోట్లు ఉపాధి కూలీల ఖాతాల్లో అప్పట్లో పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం నెలకు సగటున ఉమ్మడి జిల్లాలో ఉపాధి కూలీల కోసం రూ. 170 కోట్లు నిధులు విడుదల చేస్తోంది.
జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న 130 మంది ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ జిల్లా స్థాయి ఉత్తమ గురువులుగా ఎంపిక చేసింది. ఉత్తమ బోధనతోపాటు ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆదర్శంగా నిలిచినందుకు వీరు ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించనున్నారు.
∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} వరద ప్రభావిత ప్రాంతాల కొనసాగుతున్న సర్వే
∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
Sorry, no posts matched your criteria.