Telangana

News September 4, 2024

ఏజెన్సీలో 21 మంది ఉత్తమ ఉపాధ్యాయులు: DEO

image

రంపచోడవరం డివిజన్ 7 గిరిజన మండలాల్లో 21 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశామని ఏజెన్సీ DEO.మల్లేశ్వరావు బుధవారం తెలిపారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేసే ప్రతి మండలం నుంచి 3 సీనియర్ టీచర్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా గురువారం ITDA కార్యాలయంలో వీరిని సన్మానిస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

News September 4, 2024

7,480 గృహాలు దెబ్బతిన్నాయి: మంత్రి

image

వరద ఉధృతి తగ్గడంతో శానిటేషన్ పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. పది డివిజన్లలో మొత్తం 7,480 గృహాలు దెబ్బతిన్నాయని తెలిపారు. 5 జీసీబీలు , 50 ట్రాక్టర్లు, 75 వాటర్ ట్యాంకర్లు, 8 ఫైర్ ఇంజిన్లు, 600 మంది శానిటేషన్ సిబ్బందితో పనులు సాగుతున్నాయన్నారు. ఇళ్లలో బురద తొలగించేందుకు వాటర్ ట్యాంకర్లు ద్వారా నీళ్ళు సరఫరా చేస్తున్నామన్నారు. 12 హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేశామన్నారు.

News September 4, 2024

సంగారెడ్డి: ‘టీచర్లకు బోధనేతర పనులు అప్పగించొద్దు’

image

ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించవద్దని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని బీసీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను పూర్తిగా బోధనకు పరిమితం చేస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు టైం టేబుల్ అమలు చేయాలని కోరారు.

News September 4, 2024

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను అభినందించిన కేటీఆర్

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన రక్షిత కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను అభినందించారు.

News September 4, 2024

WGL: మావోయిస్టు అగ్రనేత జగన్ మృతి

image

మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ @దాదా రణదేవ్ దాదా మృతిచెందాడు. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లో అతను మృతిచెందినట్టు దంతేవాడ పోలీసులు ధ్రువీకరించారు. మరణించిన జగన్ స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం టేకులగూడెమని దంతేవాడ ఎస్పీ ప్రకటించారు.

News September 4, 2024

ఖమ్మంలో సాధారణ పరిస్థితి: తుమ్మల

image

ఖమ్మంలో వరద బాధితులు ఎవరు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సుమారు 1000 మంది వర్కర్లతో 40 జెసీబీలు, 133 ట్రాక్టర్లతో సహాయక చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల చెప్పారు. ప్రస్తుతం ఖమ్మం నగరం నార్మల్ స్థితికి వచ్చిందని అన్నారు.

News September 4, 2024

విజృంభిస్తున్న డెంగ్యూ.. పట్టించుకోని ప్రభుత్వం: హరీశ్ రావు

image

గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో లోపంతో డెంగ్యూ జ్వరాలు భారీగా వ్యాప్తి చెందుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా తడకపల్లి గ్రామానికి చెందిన కనకలక్ష్మి డెంగ్యూ జ్వరంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సేవలు అందక, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం భూమి అమ్ముకొని రూ.25 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం కాపాడుకోలేక పోయారని అన్నారు.

News September 4, 2024

HYD: హైడ్రా కమిషనర్ హెచ్చరిక

image

హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కొంతమంది బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ విభాగాన్ని నీరు గార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రా పేరుతో బెదిరిస్తే పీఎస్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.

News September 4, 2024

HYD: హైడ్రా కమిషనర్ హెచ్చరిక

image

హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కొంతమంది బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ విభాగాన్ని నీరు గార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఇలా బెదిరిస్తే పీఎస్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.

News September 4, 2024

HYD: హైడ్రా GOOD NEWS.. ఇక ఈజీ!

image

HYD నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా, ప్రజల నుంచి వినతులను సైతం స్వీకరిస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. భవిష్యత్తులో సామాన్య మానవుడు సైతం చూసుకునేలా చెరువులు, కుంటల FTL, బఫర్ జోన్ వివరాలను యాప్‌లో పొందుపరుస్తామని తెలిపారు. తద్వారా భూమి కొనుగోలు చేసేటప్పుడు అందరూ చెక్ చేసుకోవడానికి వీలుంటుందన్నారు. అక్రమాలు, సహా ఇతర ఫిర్యాదులను సైతం యాప్ ద్వారా స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.