Telangana

News April 25, 2025

HYD: విద్యార్థులూ.. ఈ నంబర్లకు కాల్ చేయండి!

image

ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. త్వరలో 10వ తరగతి ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఎగ్జామ్‌లో పాసైన వారి సంగతి అటుంచితే ఫెయిల్ అయిన వారు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే వారికి భరోసా ఇచ్చేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. మానసిక వేదనకు గురవుతున్న వారు ఈ నంబర్లకు 7893078930, 04066202000, 9493238208, 9152987821, 14416 కాల్ చేయండి. వీరి సూచనలు ఒత్తిడిని తగ్గిస్తాయని అధికారులు చెబుతున్నారు.

News April 25, 2025

HYD: 2 సార్లు కార్పొరేటర్.. రెండోసారి MLC

image

HYD స్థానిక సంస్థల MLC సీటు MIM కైవసం చేసుకుంది. అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ జులై 26 1977లో జన్మించారు. కామర్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. 2009లో నూర్ బజార్, 2016లో డబీర్‌పురా కార్పొరేటర్‌గా పనిచేశారు. 2019లో ఎమ్మెల్యేల కోటా MLCగా శాసనమండలిలో అడుగుపెట్టారు. కాగా 40 ఓట్లు కలిగిన MIM గెలుపు ఖాయమైనప్పటికీ, GHMCలో బలం పుంజుకుంటున్న బీజేపీ తమదే గెలుపనడంతో ఈ ఎన్నికపై కాస్త అసక్తి నెలకొంది.

News April 25, 2025

NLG: ఒకే తరహా ఘటనలు.. చర్యల్లో వివక్ష!

image

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు ఘటనల్లో అధికారులు చర్యలు తీసుకోవడంలో వివక్ష చూపుతున్నట్లు తెలుస్తుందని పలువురు అంటున్నారు. KTR (మం) చెరువుఅన్నారంలో 6.18 గుంటల భూమిని DT సుకన్య ఇతరులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారంలో సుకన్యను కలెక్టరేట్‌కు అటాచ్ చేశారే తప్ప చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. HZNRలో పట్టా మార్పిడి విషయంలో మాత్రం తహశీల్దార్ జయశ్రీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

News April 25, 2025

KMR: ప్రైవేటు వీడియోలు ఉన్నాయంటూ MLAకు బెదిరింపులు

image

జుక్కల్ MLA తోట లక్ష్మి కాంత్ రావును బ్లాక్‌ మెయిల్ చేసిన ఓ రిపోర్టర్‌ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. MLAకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని.. రూ.5 కోట్లు ఇవ్వకుంటే వాటిని బయటపెడతానని ఓ మహిళతో కలిసి శ్యామ్ అనే రిపోర్టర్ బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడినట్లు MLA ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి శ్యామ్‌ను అరెస్ట్ చేసి ఉప్పర్‌పల్లి మెట్రోపాలిటన్ కోర్టులో హాజరు పరిచారు.

News April 25, 2025

కారేపల్లి: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కారేపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. దుబ్బతండాకు చెందిన లావుడ్యా భద్రు(52) రెండు ఎకరాలలో మిర్చి, రెండు ఎకరాలలో పత్తి సాగు చేశాడు. పంట సరిగ్గా పండగ పోవడంతో చేసిన అప్పులు తీరవని బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News April 25, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} నేలకొండపల్లిలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} వేంసూరు మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 25, 2025

నిర్మల్: కన్న కొడుకును నరికి చంపిన తండ్రి

image

నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలంలో దారుణం జరిగింది. మల్లాపూర్ గ్రామంలో కన్నకొడుకు గొడ్డలితో నరికి తండ్రి హత్య చేశాడు. గ్రామానికి చెందిన బైనం అశోక్ (29)ను అతని తండ్రి బైనం ఎర్రన్న ఇవాళ ఉదయం హత్య చేశాడని గ్రామస్థులు పేర్కొన్నారు. చంపిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెల్లి లొంగిపోయాడు. ఎస్ఐ రహమాన్ మాలిక్ ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 25, 2025

మెదక్: కొడుకుల చేతులు కోసి, తల్లి సూసైడ్

image

అత్తింటి వేధింపులు భరించలేక కొడుకులతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల వివరాలు.. గుమ్మడిదలకు చెందిన అహ్మద్, మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రేష్మాబేగం(30)ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారు. తట్టుకోలేక కుమారుల చేతులపై కత్తితో గాయాలు చేసి, ఆమె ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పిల్లలను అసుపత్రికి తరలించారు.

News April 25, 2025

మావోల వేట.. కర్రె గుట్టల్లో తూటాల మోతలు

image

ములుగు జిల్లాలోని కర్రె గుట్టల్లో మావోలు ఉన్నారనే సమాచారంతో మూడు రోజులుగా పోలీసులు గుట్టలను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దాదాపు 300 కి.మీ విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో 3వేలకు పైగా భద్రతా బలగాలు మోహరించినట్లు సమాచారం. కాల్పుల్లో ఇప్పటికే పలువురు మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. వెంకటాపురం, వాజేడు, అలుబాక టేకులగూడెం, తిప్పాపురానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ కర్రె గుట్టలు ఉన్నాయి.

News April 25, 2025

కరీంనగర్ జిల్లాలో 44.4°C డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

image

కరీంనగర్ జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 44.4°C నమోదు కాగా, జమ్మికుంట 44.3, కరీంనగర్, మానకొండూర్ 44.2, రామడుగు 44.1, చిగురుమామిడి, చొప్పదండి, తిమ్మాపూర్ 43.9, కరీంనగర్ రూరల్ 43.6, గన్నేరువరం 43.4, శంకరపట్నం 43.3, కొత్తపల్లి 43.2, వీణవంక 42.9, ఇల్లందకుంట 42.5, హుజూరాబాద్ 42.1, సైదాపూర్ మండలంలో 41.7°Cగా నమోదైంది.