Telangana

News September 26, 2024

దుబ్బాక: మంత్రిని సన్మానించిన మెదక్ ఎంపీ

image

దుబ్బాక నియోజకవర్గానికి మొదటిసారి విచ్చేసిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖకి దుబ్బాక నేతన్నలు తయారు చేసిన నూలు పోగు చేసిన కండువాను బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుబ్బాక అంటేనే చేనేత అని అన్నారు. నేతన్నల సమస్యలు పరిష్కరించాలని, వారి జీవితాల్లో వెలుగు నింపాలని ఎంపీ మంత్రిని కోరారు.

News September 26, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. నాగర్ కర్నూల్ జిల్లా ఎళ్లికలో 48.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా మాచుపల్లిలో 41.3 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా సోలిపూర్ లో 33.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 20.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా కేంద్రంలో 14.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News September 26, 2024

MDK: బీఆర్ఎస్ పాలనలో సువర్ణ అధ్యాయం: హరీశ్‌రావు

image

తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయమని హరీశ్‌ రావు అన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి అని చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ అని, పత్తి ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉందన్నారు. పంటల సాగులో తెలంగాణ మేటి అని అన్నారు. దేశానికే మన తెలంగాణ ఆదర్శమని చెప్పారు. ఇదంతా మంత్రమేస్తేనో, మాయ చేస్తేనో జరిగింది కాదని ఎక్స్‌ వేదికగా తెలిపారు.

News September 26, 2024

రాజకీయ నాయకుడిగా రాలేదు.. ఊరి మనవడిగా వచ్చా: కేటీఆర్

image

తను రాజకీయ నాయకుడిగా రాలేదని, ఊరి మనవడిగా వచ్చానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో గురువారం తన అమ్మమ్మ-తాతయ్య జోగినిపల్లి లక్ష్మీబాయి-కేశవరావు స్మారకార్థం సొంత ఖర్చులతో నిర్మించిన ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. తన అనుబంధాన్ని పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు.

News September 26, 2024

తాంసీ: ఆ ఒక్క టీచర్ రాకపోతే బడికే తాళం..?

image

తాంసీ మండలంలోని గోట్కూరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 5 వ తరగతి వరకు 53 మంది విద్యార్థులకు ఒకరే టీచర్ ఉన్నారు. ప్రస్తుతం ఉపాద్యాయురాలు రోజా రాణి ఒకరే అన్ని తానై విధులు నిర్వహిస్తున్నారు. సరి పడా టీచర్లు లేక పోవడంతో 3 నెలలు గా తమ పిల్లల  చదువును నష్ట పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

News September 26, 2024

వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

News September 26, 2024

తెలంగాణ తెగువకు చిరునామాగా నిలిచిన వీర వనిత ఐలమ్మ: బండి సంజయ్

image

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జ్వలించిన నిప్పుకణిక ఐలమ్మ అని కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత..
తెలంగాణ తెగువకు చిరునామాగా నిలిచిన వీర వనిత అన్నారు. మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని కొనియాడారు.

News September 26, 2024

HYD: ఇళ్లకు ‘RB-X’ మార్కింగ్..!

image

మూసీ నది ప్రక్షాళనలో భాగంగా <<14199043>>ఇళ్లు కోల్పోయే వారికి<<>> పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అధికారులు చర్యలు చేపట్టారు. అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చేందుకు రీ సర్వే చేస్తున్నారు. ఓనర్ల నుంచి ఇంటి పత్రాలు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ శివకుమార్, తహశీల్దార్లు సంధ్యారాణి, అహల్య ఆధ్వర్యంలో కూల్చివేసే ఇళ్లకు RB-X పేరిట మార్కింగ్ చేస్తున్నారు.

News September 26, 2024

HYD: ఇళ్లకు ‘RB-X’ మార్కింగ్..!

image

మూసీ నది ప్రక్షాళనలో భాగంగా <<14199043>>ఇళ్లు కోల్పోయే వారికి<<>> పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అధికారులు చర్యలు చేపట్టారు. అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చేందుకు రీ సర్వే చేస్తున్నారు. ఓనర్ల నుంచి ఇంటి పత్రాలు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ శివకుమార్, తహశీల్దార్లు సంధ్యారాణి, అహల్య ఆధ్వర్యంలో కూల్చివేసే ఇళ్లకు RB-X పేరిట మార్కింగ్ చేస్తున్నారు.

News September 26, 2024

వరంగల్ మార్కెట్‌లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ 341 రకం మిర్చి నిన్నటి లాగే నేడు రూ.16,500 ధర పలికింది. అలాగే తేజ మిర్చి నిన్న రూ.18,400 ధర పలకగా నేడు రూ. 18,300 కి తగ్గింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.16 వేలు ధర రాగా నేడు రూ.17 వేల ధర వచ్చింది. టమాటా మిర్చికి బుధవారం రూ.25 వేల ధర రాగా ఈరోజు రూ. 24 వేలకి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు.