India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
WNP: ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రమంతా ఈ రోజు అపార నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విపత్తు సంభవించినప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి సోయి లేకుండా, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోలేదన్నారు. ఐదు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుంటే ఈ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారని నిలదీశారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వరుసగా ఐదు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరిక మేరకు ఇవాళ రేపు, 6న సెలవు, 7,8న (శని, ఆదివారాలు) వారంతపు సెలవు సందర్భంగా ఐదు రోజులు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి 9న (సోమవారం) నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని ప్రకటించారు.
శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. 10 గేట్లను ఎత్తి 2,70,470 క్యూసెక్కులు, కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల ద్వారా 67,217 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదులుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు జలాశయంలో నీటి మట్టం 883.80 అడుగులకు చేరింది. జూరాల నుంచి 2,08,511 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 10,326 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.
త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్ని విధాల ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎంపీడీవోలు, ఎమ్మార్వోలతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి విధుల కేటాయింపు వంటి పనులను వేగవంతం చేయాలని సూచించారు.
విపత్కర పరిస్థితుల్లో BRS నేతలు రాజకీయాలు చేయొద్దని AICC కార్యదర్శి సంపత్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా 24 గంటలు తమ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు పని చేస్తున్నారు. BRS నేతలు KTR, హరీశ్ రావు ఇద్దరు రాజకీయ లబ్ధి కోసం విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. జనాలు తిరగబడి చెప్పుతో కొట్టే రోజులు వస్తాయని’ ఆయన హెచ్చరించారు.
వినాయక నవరాత్రి వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ సత్తయ్య గౌడ్ అన్నారు. జోగిపేటలో శాంతి కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబి, వినాయక నిమజ్జనం ఒకేసారి రావడంతో ఇరువర్గాలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో జోగిపేట సిఐ అనిల్ కుమార్, ఎస్సై పాండు, తహసిల్దార్ మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.
వినాయక చవితి పండుగ పురస్కరించుకొని ప్రజలు మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించాలని, కాలుష్య నియంత్రణకు సహకరించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలని వినియోగించాలని రూపొందించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కృత్రిమ రంగులు, రసాయనాలతో ఉన్న ప్రతిమలను వినియోగించొద్దన్నారు.
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేనేత రంగంలో ఉత్పత్తి అయిన వస్త్రాలు, శాలువాలను ఉపయోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చేనేత వస్త్రాలను ఉపయోగిస్తే నేతన్నలందరికి ఆర్థికంగా సహకరించినట్లు ఉంటుందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 5 టీచర్స్ డే రోజు సింథటిక్ శాలువాల బదులు కాటన్ శాలువాలని వాడాలని, కాటన్ వస్త్రాలను ధరించాలన్నారు.
డాక్టర్ BR. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ, PG, డిప్లమా కోర్సులలో చేరుటకు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా సమన్వయకర్త డా. అంతటి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ పరీక్ష ఫీజుని ఈనెల 20 లోపు చెల్లించాలని, కొత్తగా అడ్మిషన్ కోరే వారు ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత ఆయా స్టడీ సెంటర్లలో ఒరిజినల్స్ వెరిఫై చేయించుకోవాలన్నారు
ఈ నెల 7న వినాయక చవితి పురస్కరించుకొని అన్ని గణేష్ మండపాలకు భద్రత ఇవ్వడానికి పాయింట్ బుక్ ఏర్పాటు కోసం సమాచారం ఇవ్వాలని నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ పేర్కొన్నారు. నిజామాబాద్,ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునే వారు https://policeportal.tspolice.gov.in లింక్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సహకరించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.