Telangana

News May 7, 2025

NZB: ‘ఉగ్రవాదంపై తీసుకునే చర్యపై మా మద్దతు ఉంటుంది’

image

కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై తీసుకునే ఎలాంటి చర్యలకైనా తమ మద్దతు ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌ ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాన్నారు. ఇలాంటి చర్యలు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా చేయాలన్నారు.

News May 7, 2025

HYDలో కరెంటును కంటిన్యూగా వాడేస్తున్నారు

image

HYDలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఉక్కపోత కారణంగా ఏసీలు, కూలర్ల వినియోగం అధికంగా ఉండటంతో మీటర్లు నిరంతరాయంగా తిరుగుతున్నాయి. గతేడాది ఏప్రిల్ 24న 3795 మెగా వాట్లను వినియోగించగా ఈ ఏడాది అదే రోజు 4,170 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. ఏప్రిల్ 23 2024లో 3,745 మోగా వాట్లు వినియోగించగా ఈ ఏడాది 4,136 వాడారు. ఈ వారం, పది రోజుల్లో వినియోగం ఇంకా ఎక్కువ ఉండే అవకాశముంది.

News April 25, 2025

నల్గొండ: కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం

image

టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వెంటాడుతుంది. ప్రస్తుతమున్న వారు డబుల్ డ్యూటీ చేయటం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శాశ్వత ప్రాతిపదికన డ్రైవర్ల నియామకం జరిగే వరకు తాత్కాలిక పద్ధతిన డ్రైవర్లను నియమించేందుకు నిర్ణయించినట్లు ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, నార్కట్ పల్లి, కోదాడ, దేవరకొండ డిపోల్లో 90 మంది డ్రైవర్లను నియమించనున్నట్లు తెలిపారు. 

News April 25, 2025

HYD: సెలవుల్లో జూపార్క్‌ చుట్టేద్దాం..!

image

వేసవి సెలవుల్లో జూపార్క్ అధికారులు విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. మే నెలలో జూ టూర్ పేరుతో చిన్నారులకు జూ మొత్తం చూపించనున్నారు. స్నాక్స్, భోజనం కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక ప్రత్యేకంగా రూపొందించిన కిట్ (క్యాప్, నోట్‌బుక్, బ్యాడ్జ్) ఇస్తారు. రూ.1,000 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికే ఈ అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. 9281007836కు వాట్సప్‌లో సంప్రదించవచ్చు.

News April 25, 2025

 స్కూల్ విద్యార్థులకు ఓయూలో ఇంగ్లిష్ క్లాసస్

image

8, 9,10 విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల్లో కమ్యూనికేషన్ ఇంగ్లిష్‌పై నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (CELT) ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ ఉంటుంది. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన తరగతులు కూడా ఉంటాయి. రోజూ ఉదయం 8.15 నుంచి 9.45 వరకు శిక్షణ ఉంటుంది. వివరాలకు 7989903001 నంబరుకు ఫోన్ చేయవచ్చు.

News April 25, 2025

నిజామాబాద్ జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లా జడ్జిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జిల్లా న్యాయమూర్తి జి.వి.ఎన్.భరతలక్ష్మిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనంలోని జిల్లా జడ్జి ఛాంబర్లో ఆమెకు పూల మొక్కను అందించి స్వాగతం తెలిపారు. ఇరువురు కొద్దిసేపు భేటీ అయ్యి జిల్లా స్థితిగతులపై చర్చించారు.

News April 25, 2025

ఖమ్మం: వరకట్నం కోసం ఒప్పంద పత్రం డిమాండ్.. ఆగిన పెళ్లి

image

వరకట్నం ఇచ్చే విషయమై ఒప్పంద పత్రం రాస్తేనే పెళ్లి జరుగుతుందని వరుడు తెగేసి చెప్పడంతో పీటలపైన పెళ్లి ఆగిపోయిన ఘటన కూసుమంచిలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన యువతీయువకుడు ఇష్టపడ్డారు. ఇరువర్గాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వరుడు నగదు, ఎకరా భూమి ఎప్పుడు ఇస్తారో ఒప్పంద పత్రం రాసి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పెళ్లి నిలిచిపోయింది.

News April 25, 2025

ADB: కట్టుకున్నవారే కడతేర్చుతున్నారు

image

కట్టుకున్నవారే కాలయముళ్లుగా మారి కడతేరుస్తున్నారు. బంధాలను మర్చిపోయి పిల్లలను తల్లి ప్రేమకు దూరం చేస్తున్నారు. ADB (D) గుడిహత్నూర్‌కు చెందిన మారుతి భార్యపై కక్ష పెంచుకుని కత్తితో హతమార్చాడు. ASF(D) కాగజ్‌నగర్‌కు చెందిన జయరాం మగసంతానం కోసం భార్యతో గొడవపడి పలుగుతో దాడి చేసి చంపాడు. అన్యోన్యంగా ఉండాల్సినవారు గొడవలతో జీవితాన్ని నాశనం చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.

News April 25, 2025

HYD: 15 రోజుల్లో 1,275 మంది మైనర్లపై కేసులు

image

నగర వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్‌పై సిటీ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 15 రోజులుగా వివిధ ప్రాంతాల్లో వాహనాలు నడుపుతున్న 1,275 మంది మైనర్లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామని సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. వీరిపై ఛార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. తల్లిదండ్రులు మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దని మరోసారి హెచ్చరిస్తున్నారు.

News April 25, 2025

శిథిలావస్థలో హైదరాబాద్ చారిత్రక సంపద

image

పాతబస్తీలోని పురాతన భవనం పత్తర్‌గట్టి భవనం శిథిలావస్థకు చేరుకుంది. గత నెలలో పెచ్చులూడి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 1911లో నిర్మించిన ఈ హెరిటేజ్ భవన సంరక్షణను ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందని స్థానికులు చెబుతున్నారు. చార్‌కమాన్ల ఆధునీకరణలో భాగంగా 2009లో కేవలం రెండింటికి మాత్రమే మరమ్మతులు చేశారని తెలిపారు. HYD చారిత్రక సంపదను సంరక్షించాలని పలువురు కోరుతున్నారు.