India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె-కేసముద్రం సెక్షన్ ట్రాక్ ఘటనతో సోమవారం రెండో రోజు కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రూట్లలో నడిచే రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్ల వివరాలు.. 5న డోర్నకల్-విజయవాడ(07755), ప్యాసింజర్, డోర్నకల్- కాజీపేట(07754) ప్యాసింజర్ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కాజీపేట జంక్షన్, నాగపూర్, నడికుడ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు.
2024-25 ఏడాదికి వరంగల్ జిల్లాలోని షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన, అల్ప సంఖ్యాక, దివ్యాంగ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ 31 లోగా ‘ఈపాస్ వెబ్ సైట్’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వరదలొస్తేనే కాని అధికారులకు చెరువులు, నాలాలు గుర్తుకురావని WGL నగర ప్రజలు మండిపడుతున్నారు. ఏడాది నుంచి భద్రకాళి చెరువు కట్టను ఎవరూ పట్టించుకోలేదని, ప్రస్తుతం చెరువు నిండుకుండలా మారిందన్నారు. పోతననగర్ వైపు చెరువు కట్ట బలహీనంగా మారడంతో దిగువన ఉన్న కాలనీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆదివారం కలెక్టర్ ప్రావీణ్య చెరువు కట్టను పరిశీలించి అధికారులపై మండిపడటంతో ఇసుక బస్తాలను నింపుతున్నట్లు సమాచారం.
ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా జ్వర బాధితులు పెరుగుతున్నారు. PDPL జిల్లాలో ఆస్టులో 8918కి మందికి పైగా జ్వరాల బారిన పడ్దారు. ఇప్పటివరకు 67 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ప్రధాన ఆస్పత్రితో పాటు ఓ జనరల్ ఆస్పత్రి, 7పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానల్లో మందుల కొరత లేకుండా చూస్తున్నామని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
నల్గొండ జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గణేష్ ఉత్సవాలపై ఏర్పాటు చేసిన ‘శాంతి కమిటీ’ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను వాడేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సీజన్లోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు మట్టి మిద్దెలు, గోడలు కూలి మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు వదిలారు. NGKL జిల్లాలోనే 6 మృతి చెందారు. WNPT జిల్లాలో ఓ వృద్ధుడు, NRPT జిల్లాలో తల్లీకుమార్తెలు మరణించారు. గత నాలుగేళ్లుగా పాలమూరులో మట్టి మిద్దెలు కూలి మొత్తం 20 మంది మృతి చెందారు. మట్టి మిద్దెలో నివసిస్తున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పంటలు నీటి మునిగాయి. దీంతో పంటకు తెగులు సోకే ప్రమాదం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏడీఆర్ డా.ఉమారెడ్డి సూచించారు. పత్తిలో నీటిని తీసివేసి, ఎకరాకు 30కిలోల యూరియా, 15 కిలోల పోటాష్ వేయాలని.. మిరపకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3గ్రా. తెగులు సోకిన మొక్కల మొదళ్లకు పోయాలని సూచించారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రం వరకు 2,51,250 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 73టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 40 గేట్లు ఎత్తి 2.50లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు, కాకతీయ కాలువకు 3వేల క్యూసెక్కులు, వరద కాలువకు 7వేల క్యూసెక్కులు వీటిని విడుదల చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ మీటర్లు లేని BPL కుటుంబాలకు NPDCL రూ.825కే విద్యుత్ కనెక్షన్ ఇవ్వనుంది. ఈ నెల 15 వరకు నేరుగా విద్యుత్ అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 500 వాట్ల విద్యుత్ వాడే వారు విద్యుత్ కార్యాలయాలు, ఉపకేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు. దరఖాస్తు ఫీజు – రూ.25, డెవలప్మెంట్ ఛార్జీ – రూ.600, సెక్యూరిటీ డిపాజిట్ – రూ.200 కలిపి మొత్తంగా రూ.825వసూలు చేయనున్నారు.
వర్షానికి నగరంలోని రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. సీసీ రోడ్లు, బీటీ రోడ్లని తేడాలేకుండా గుంతలుపడి నీళ్లు నిలిచాయి. మ్యాన్హోళ్ల మరమ్మతులు లేక రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. మహానగంలో ఉమ్మడి జిల్లాను కలుపుతూ 10వేల కి.మీ.ల రోడ్లుంటే అందులో 885 కి.మీ. ప్రధాన రహదారులు నిర్వహణ బాధ్యత ప్రైవేట్ సంస్థలది. వీటిపై అధికారులు పర్యవేక్షణను గాలికొదిలేశారు. బల్దియాకు రోజుకు 1000కిపైగా రహదారులపై కంప్లెంట్స్ వస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.